ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో దిల్ రాజు గత ఏడాది మొదలుపెట్టిన కొత్త సినిమాకు సుధీర్ బాబు హీరో అని.. అందులో నాని అతిథి పాత్ర లాంటిది చేస్తున్నాడని ముందు వార్తలొచ్చాయి. చిత్ర బృందం కూడా ఇలాంటి సంకేతాలే ఇచ్చింది. కానీ తర్వాత చూస్తే ఇందులో నానీదే డామినేషన్ అని అర్థమైంది.
అతను నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నప్పటికీ.. ‘హీరో’ పాత్రధారి సుధీరే అయినప్పటికీ.. సినిమాలో ఓవరాల్గా హైలైట్ అయ్యేది మాత్రం నానీనే అని స్పష్టమైపోయింది. ప్రమోషన్లంతా కూడా నానీని హైలైట్ చేస్తూనే సాగాయి. నాని 25వ సినిమా అని పోస్టర్ మీద వేసి ఇది అతడి సినిమాగానే ప్రొజెక్ట్ చేస్తూ వచ్చింది చిత్ర బృందం. సుధీర్తో పోలిస్తే నాని మార్కెట్ ఎక్కువ కాబట్టి అతడిని ముఖచిత్రంగా పెడితేనే సినిమాకు మార్కెట్ అవుతుందన్న ఉద్దేశంతో ఇలా చేసి ఉండొచ్చు.
ఐతే ఈ సినిమాతో సుధీర్ బాబుకు వచ్చే ప్రయోజనం ఏంటి.. అతను ఏ రకంగా సినిమాలో హైలైట్ అవుతాడు అనే ప్రశ్న చాలామందిలో ఉంది. దానికి సమాధానం ఇందులోని ఒక యాక్షన్ సీక్వెన్స్ అన్నది చిత్ర బృందం సమాచారం. ఇందులో హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తగ్గని ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉందట.
దాన్ని బాలీవుడ్లో టైగర్ ష్రాఫ్, హృతిక్ రోషన్ లాంటి యాక్షన్ హీరోల సినిమాల్లో మాదిరి భారీతనంతో తెరకెక్కించారట. అది తెలుగు సినిమా స్థాయిని పెంచేలా ఉంటుందని.. అందులో షర్ట్ విప్పి సిక్స్ ప్యాక్, చిజిల్డ్ బాడీ చూపిస్తూ సుధీర్ చేసిన యాక్షన్ విన్యాసాలు వావ్ అనిపిస్తాయని అంటున్నారు.
దీనికి సంబంధించి ఇప్పటికే సుధీర్ లుక్ ఒకటి రిలీజ్ చేశారు. ట్రైలర్లోనూ ఒక షాట్ అలా మెరిసి మాయమైంది. క్యారెక్టర్, పెర్ఫామెన్స్ పరంగా నాని ఎంత డామినేట్ చేసినా.. ఈ సీక్వెన్స్లో మాత్రం సుధీర్ హైలైట్ అయ్యాడని.. అతడికి అదొక్కటి చాలని అంటున్నారు. చూద్దాం సెప్టెంబరు 5న ఆ సీక్వెన్స్లో అంత ప్రత్యేకత ఏముందో?
This post was last modified on August 28, 2020 8:13 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…