పెద్ద ప్యాన్ ఇండియా మూవీ అందులోనూ వరల్డ్ వైడ్ పాపులారిటీ ఉన్న సల్మాన్ ఖాన్ లాంటి హీరో ఉన్నప్పుడు ఎవరైనా ఎందుకు పోటీ పడతారు. ఆదివారం విడుదల కాబోతున్న టైగర్ 3 మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో చూస్తున్నాం. మరీ పఠాన్, జవాన్ రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ దూకుడు లేదు కానీ ఇంకా నాలుగు రోజులు ఉండగానే లక్షన్నర టికెట్లు అమ్ముడుపోవడం కండల వీరుడి స్టామినాకి నిదర్శనం. తమిళంలో జపాన్, జిగర్ తండా డబుల్ ఎక్స్ తప్ప తెలుగులో చెప్పుకోదగ్గ ఏ స్ట్రెయిట్ మూవీ డిసెంబర్ 10, 12 తేదీల్లో విడుదల కాకపోవడం గమనించాల్సిన విషయం.
ఇక్కడిదాకా బాగానే ఉంది కానీ టైగర్ 3 తాకిడి ఈ స్థాయిలో ఉందని తెలిసి కూడా ఓ మరాఠి మూవీ సవాల్ విసరడం ట్రేడ్ ని ఆశ్చర్యపరుస్తోంది. దాని పేరు నాళ్ భాగ్ 2. 2018లో వచ్చిన నాళ్ అనే బ్లాక్ బస్టర్ కి కొనసాగింపు. దీన్ని తీసింది ఎవరో కాదు. మన తెలుగాయనే. గుంటూరుకి చెందిన సుధాకర్ రెడ్డి ఎక్కంటి అంటే వెంటనే గుర్తురాకపోవచ్చు కానీ నిత్యం టాలీవుడ్ వ్యవహారాల్లో మునిగి తేలేవాళ్లకు సుపరిచితమే. మధుమాసం, మనసారా, పౌరుడు, కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల్రాజు, దళం, జార్జ్ రెడ్డిలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు. నాళ్ డైరెక్టర్ ఈయన డెబ్యూ చిత్రం. జాతీయ అవార్డు కూడా అందుకున్నారు.
నాళ్ విమర్శకుల ప్రశంసలు పొంది కమర్షియల్ గానూ భారీ విజయం నమోదు చేసుకుని కల్ట్ గా నిలిచిపోయింది. ఇప్పుడీ సీక్వెల్ కూడా ఈయనే తీశారు. జీ స్టూడియోస్ నిర్మించింది. క్రేజ్ ఉన్న బ్రాండ్ కావడంతో మహారాష్ట్రలోని డిస్ట్రిబ్యూటర్లు అండగా నిలబడి కావాల్సిన మల్టీప్లెక్సు షోలు సర్దుబాటు చేస్తున్నారు. సింగల్ స్క్రీన్లలో సైతం ఆడుతుందని నిర్మాతలు ధీమాగా ఉండటంతో టైగర్ 3కి అవి ఆల్రెడీ బుక్ అయినా సరే జీ సంస్థ తన వంతుగా కాసిన్ని ఇప్పించుకునేందుకు పావులు కదుపుతోంది. నాళ్ 2కి అంత క్రేజ్ ఉంది మరి. ఏమైనా ఒక తెలుగోడు ఇలా బాలీవుడ్ మూవీకి సవాల్ విసరడం విశేషమే.
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…