కీడాకోలా.. గత వారాంతంలో మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా. తరుణ్ భాస్కర్ సినిమా అనగానే క్రేజీగా ఉంటుందని యూత్ ఆడియన్స్ చాలా నమ్మకంతో ఉన్నారు ఈ సినిమా మీద. ‘ఈ నగరానికి ఏమైంది’ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఈ సినిమా చేశాడు తరుణ్. మేకింగ్కు కూడా బాగానే టైం పట్టింది. ఈ సినిమా ప్రోమోలు చూసి ప్రేక్షకులు ఎంతో ఊహించుకున్నారు.
ప్రి రిలీజ్ హైప్ కూడా బాగానే వచ్చింది. ఇందులో స్టార్ కాస్ట్ లేకపోయినా సరే.. అడ్వాన్స్ బుకింగ్స్ గట్టిగానే జరిగాయి. సిటీల్లో, ముఖ్యంగా మల్టీప్లెక్సుల్లో అడ్వాన్స్ ఫుల్స్ పడ్డాయి. ప్రి రిలీజ్ ఈవెంట్లో తరుణ్ భాస్కర్ ‘కీడా కోలా’ గురించి ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడాడో తెలిసిందే. తన తొలి రెండు చిత్రాల విషయంలో తనకు భయం ఉండేదని.. కానీ ‘కీడాకోలా’ విషయంలో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నానని అతను మాట్లాడాడు.
కట్ చేస్తే ‘కీడా కోలా’కు తొలి రోజు మంచి ఓపెనింగ్స్ అయితే వచ్చాయి కానీ టాక్ మాత్రం డివైడ్గా వచ్చింది. మరీ పలుచనైన, సిల్లీగా అనిపించే కథ దీనికి పెద్ద మైనస్ అయింది. ఈ సినిమాలో ఫన్నీ మూమెంట్స్ లేవని కాదు. కొన్ని సీన్లు కడుపుబ్బ నవ్వించాయి. కానీ అక్కడక్కడా కొన్ని మూమెంట్సే తప్ప ఓవరాల్గా సినిమాలో బరువు లేకపోయింది. ఏదో అలా టైంపాస్ చేశారే తప్ప ప్రేక్షకులు కోరుకున్న కిక్ దక్కలేదు. తొలి రోజు సందడి చేశాక రెండో రోజుకే ‘కీడా కోలా’ డౌన్ అయింది.
వీకెండ్ తర్వాత సినిమా అస్సలు నిలబడలేకపోయింది. చిన్న సినిమా అయిన ‘మా ఊరి పొలిమేర-2’ దీని మీద పూర్తిగా డామినేషన్ చూపించింది. ‘కీడా కోలా’ మీద తరుణ్ భాస్కర్ పెట్టుకున్న నమ్మకం నిలబడలేదు. ఏదో సినిమా వచ్చింది వెళ్లిపోయింది అన్నట్లుగా తయారైంది పరిస్థితి. స్క్రిప్టు, టేకింగ్ విషయంలో తరుణ్ మరీ ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నాడన్నది స్పష్టం. చిన్న బడ్జెట్లో తెరకెక్కడం, తరుణ్కు యూత్లో ఉన్న క్రేజ్ వల్ల ఈ సినిమా సేఫ్ జోన్లోకి వెళ్లిపోయి ఉండొచ్చు కానీ.. ఇకముందు మాత్రం తరుణ్ ఇలాంటి సినిమాలు తీస్తే కష్టమే.
This post was last modified on November 6, 2023 9:06 pm
అక్కినేని నాగార్జున… టాలీవుడ్ లో సీనియర్ నటుడు. రాజకీయాలతో పని లేకుండా ఆయన తన పని ఎదో తాను ఆలా…
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. గత కొన్నేళ్లలో సోషల్ మీడియా వేదికగా హద్దులు దాటి ప్రవర్తించిన వైసీపీ కార్యకర్తలు,…
సౌత్ ఇండియా మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరున్న అనిరుధ్ రవిచందర్ తమిళంలోనే విపరీతమైన బిజీగా ఉన్నా తెలుగు…
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో.. సామాన్యులకు కూడా టిక్కెట్లు ఇచ్చామంటూ వైసీపీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గురించి గురువారం నాటి పార్లమెంట్ సమావేశాల్లో ఓ కీలక అంశం…
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి శుక్రవారం గట్టి ఎదురు దెబ్బ తగిలింది. జగన్ కు అత్యంత సన్నిహితుడిగా…