తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టకేలకు పోటీకి రెడీ అయిన.. జనసేనలో టికెట్ల కేటాయింపు కూడా ఊపందుకుంది. నిన్న మొన్నటి వరకు అసలు పోటీ చేయాలా? వద్దా? అనే మీమాంస నుంచి బయట పడి.. బీజేపీతో చేతులు కలిపి.. 9 స్థానాలను దక్కించుకుని.. వాటిలో పోటీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెడీ అయ్యారు. ఈ క్రమంలో తాజాగా ఆయన కీలకమైన కూకట్పల్లి స్థానం నుంచి అభ్యర్థిని ఖరారు చేశారు. హైదరాబాద్ కి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, వెస్ట్ జోన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ను పవన్ ప్రకటించారు.
ఆర్థికంగా బలంగా ఉండడంతోపాటు.. సామాజిక వర్గం పరంగా కూడా ప్రేమ్కుమార్ కు కూకట్ పల్లి వంటి కీలక టికెట్ ఇవ్వడంతో జనసేనలో జోష్ పెరుగుతుందనే వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం మంగళగిరిలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. పలువురు తెలంగాణకు చెందిన నాయకులను కూడా పార్టీలో చేర్చుకున్నారు. సినీ నటుడు సాగర్, భద్రాద్రి కొత్తగూడెనికి చెందిన వ్యాపారవేత్త లక్కినేని సురేందర్ రావు తదితరులు జనసేనలో చేరారు. ఈ సందర్భంగానే కూకట్ పల్లి నుంచి జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ని ప్రకటించారు.
త్వరలోనే మిగిలిన అభ్యర్తులను కూడా ప్రకటించనున్న పవన్ చెప్పారు. మొత్తం 9 స్థానాలకే పరిమితమైన నేపథ్యంలో పార్టీ విషయంలో అంకిత భావం చూపే వారికే టికెట్లు ఇచ్చే అవకాశం ఉందనేచర్చసాగుతోంది. అయితే.. ఇలా పార్టీలో చేరిన వ్యక్తికి అలా టికెట్ ప్రకటించడంపై జనసేనలోనూ చర్చసాగుతోంది. అయితే, ప్రేమ్కుమార్కు పవన్కు మధ్య స్నేహం ఉందని.. ఎప్పటి నుంచో ఇద్దరి మధ్న పరిచయం కూడా ఉందని అందుకే టికెట్ ఇచ్చి ఉంటారని కొందరు చెబుతున్నారు. ఏదేమైనా.. కూకట్పల్లిలో బీఆర్ ఎస్ అభ్యర్థికి దీటుగా ప్రేమ్కుమార్ పోటీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
This post was last modified on November 6, 2023 9:26 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…