భావోద్వేగాలు ప్రధానాంశంగా రూపొందిన సప్త సాగరాలు దాటి సైడ్ ఏ కన్నడలో సంచలన విజయం నమోదు చేసుకుంది. తెలుగు డబ్బింగ్ కొంత ఆలస్యం కావడంతో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. అయితే అమెజాన్ ప్రైమ్ లో చూశాక మన ఆడియన్స్ కి బాగానే కనెక్ట్ అయ్యిందని సోషల్ మీడియా రెస్పాన్స్ చూశాక అర్థమయ్యింది. అందుకే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సైడ్ బి నవంబర్ 17న ఒరిజినల్ వెర్షన్ తో పాటు సమాంతరంగా విడుదల చేయబోతున్నారు. సీక్వెల్ కి మంచి స్పందన వస్తుందనే నమ్మకంతో థియేటర్లకు తీసుకొస్తున్నారు. మూడు నిమిషాల ట్రైలర్ తో మ్యాటర్ చెప్పారు
ప్రియురాలి జీవిత లక్ష్యం కోసం చేయని నేరానికి జైలు శిక్ష అనుభవించి వచ్చిన మను(రక్షిత్ శెట్టి)కు ప్రియ(రుక్మిణి వసంత్) జాడ దొరకదు. ఎంత ప్రయత్నించినా లాభం లేకపోవడంతో ఒక ఎలెక్ట్రిక్ లాండ్రీ షాప్ లో ఉద్యోగం సంపాదించుకుంటాడు. ఈ క్రమంలో సురభి (చైత్ర)ని చూసి ఇష్టపడి పరిచయం పెంచుకుంటాడు. అయితే తనకు ఈ గతి పట్టించినవాళ్ల మీద ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుని ఒక్కొక్కరిని వేటాడటం మొదలుపెడతాడు. ఓ రోజు ప్రియా కనిపిస్తుంది. తర్వాత మను జీవితం ఏ మలుపులు తిరిగింది, చివరికి ఎవరి ప్రేమ పొందాడో తెరమీద చూడాలి.
మొదటి భాగంలో ఉన్న ల్యాగ్, హెవీ ఎమోషన్ కి భిన్నంగా సైడ్ బి ఆసక్తికరంగా కనిపిస్తోంది. ముఖ్యంగా క్రైమ్, రివెంజ్ యాంగిల్ జోడించడంతో ఇంటరెస్ట్ పెరిగింది. బాహుబలి లాగా అసలు కథని దర్శకుడు హేమంత్ రావు ఇందులోనే చూపించబోతున్నాడు. ఫస్ట్ పార్ట్ లో ఆడియన్స్ ని ప్రేమలో పడేసిన హీరోయిన్ రుక్మిణి వసంత్ కు ఇందులో స్కోప్ తగ్గించి ఎక్కువ కథ మీదే ఫోకస్ పెట్టారు. సైడ్ ఏ చూసిన వాళ్ళను ఇది కూడా చూడాలనిపించేలా ట్రైలర్ కట్ చేయడం అంచనాలు పెంచుతోంది. అజయ్ భూపతి మంగళవారంతో పోటీ పడుతున్న సప్తసాగరాలు దాటి సైడ్ బి ఈసారైనా మంచి ఫలితం అందుకుంటుందేంమో
This post was last modified on November 7, 2023 11:30 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…