భావోద్వేగాలు ప్రధానాంశంగా రూపొందిన సప్త సాగరాలు దాటి సైడ్ ఏ కన్నడలో సంచలన విజయం నమోదు చేసుకుంది. తెలుగు డబ్బింగ్ కొంత ఆలస్యం కావడంతో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. అయితే అమెజాన్ ప్రైమ్ లో చూశాక మన ఆడియన్స్ కి బాగానే కనెక్ట్ అయ్యిందని సోషల్ మీడియా రెస్పాన్స్ చూశాక అర్థమయ్యింది. అందుకే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సైడ్ బి నవంబర్ 17న ఒరిజినల్ వెర్షన్ తో పాటు సమాంతరంగా విడుదల చేయబోతున్నారు. సీక్వెల్ కి మంచి స్పందన వస్తుందనే నమ్మకంతో థియేటర్లకు తీసుకొస్తున్నారు. మూడు నిమిషాల ట్రైలర్ తో మ్యాటర్ చెప్పారు
ప్రియురాలి జీవిత లక్ష్యం కోసం చేయని నేరానికి జైలు శిక్ష అనుభవించి వచ్చిన మను(రక్షిత్ శెట్టి)కు ప్రియ(రుక్మిణి వసంత్) జాడ దొరకదు. ఎంత ప్రయత్నించినా లాభం లేకపోవడంతో ఒక ఎలెక్ట్రిక్ లాండ్రీ షాప్ లో ఉద్యోగం సంపాదించుకుంటాడు. ఈ క్రమంలో సురభి (చైత్ర)ని చూసి ఇష్టపడి పరిచయం పెంచుకుంటాడు. అయితే తనకు ఈ గతి పట్టించినవాళ్ల మీద ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుని ఒక్కొక్కరిని వేటాడటం మొదలుపెడతాడు. ఓ రోజు ప్రియా కనిపిస్తుంది. తర్వాత మను జీవితం ఏ మలుపులు తిరిగింది, చివరికి ఎవరి ప్రేమ పొందాడో తెరమీద చూడాలి.
మొదటి భాగంలో ఉన్న ల్యాగ్, హెవీ ఎమోషన్ కి భిన్నంగా సైడ్ బి ఆసక్తికరంగా కనిపిస్తోంది. ముఖ్యంగా క్రైమ్, రివెంజ్ యాంగిల్ జోడించడంతో ఇంటరెస్ట్ పెరిగింది. బాహుబలి లాగా అసలు కథని దర్శకుడు హేమంత్ రావు ఇందులోనే చూపించబోతున్నాడు. ఫస్ట్ పార్ట్ లో ఆడియన్స్ ని ప్రేమలో పడేసిన హీరోయిన్ రుక్మిణి వసంత్ కు ఇందులో స్కోప్ తగ్గించి ఎక్కువ కథ మీదే ఫోకస్ పెట్టారు. సైడ్ ఏ చూసిన వాళ్ళను ఇది కూడా చూడాలనిపించేలా ట్రైలర్ కట్ చేయడం అంచనాలు పెంచుతోంది. అజయ్ భూపతి మంగళవారంతో పోటీ పడుతున్న సప్తసాగరాలు దాటి సైడ్ బి ఈసారైనా మంచి ఫలితం అందుకుంటుందేంమో
This post was last modified on November 7, 2023 11:30 am
ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…
ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ…
ఏప్రిల్ 30 'పెద్ది' తప్పుకున్నాక అందరి దృష్టి ఆ స్లాట్ మీద పడింది. ఇది ముందే ఊహించిన 'గాయపడ్డ సింహం'…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. వాస్తవానికి ఇప్పటికే చాలా బిల్లులు పెండింగులో ఉండగా..…
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…