మెగా ఫ్యామిలీలో కొంచెం గ్యాప్ తర్వాత పెళ్లి సందడి చూస్తున్నాం. నాగబాబు తనయుడు, హీరో వరుణ్ తేజ్.. తాను కొన్నేళ్ల నుంచి ప్రేమలో ఉన్న లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలల కిందటే వీరి నిశ్చితార్థం హైదరాబాద్లో జరిగింది. ముందు అనుకున్నట్లే డెస్టినేషన్ వెడ్డింగే ప్లాన్ చేసుకున్నాడు వరుణ్. కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులు, మిత్రుల మధ్య ఇటలీలో పెళ్లి చేసుకోవడానికి ఏర్పాట్లు జరిగాయి.
మెగా ఫ్యామిలీలో దాదాపుగా అందరూ ఇటలీకి వెళ్లారు. ఇతర బంధువులు, సన్నిహితులు కలిపి అటు ఇటుగా వంద మంది నడుమ పెళ్లి జరుగుతోంది. సినిమా, పొలిటికల్ కమిట్మెంట్లతో బిజీగా ఉంటూ హైదరాబాద్లో జరిగే మెగా ఫ్యామిలీ పెళ్లి వేడుకలకు కూడా దూరపు చుట్టంలా వచ్చి వెళ్లే పవన్ కళ్యాణ్.. ఈ పెళ్లికి హాజరువుతాడా లేదా అన్న సందేహాలు తలెత్తాయి.
ఐతే భార్య అనా లెజ్నెవాతో కలిసి పవన్ ఇటీవలే ఇటలీకి బయల్దేరడంతో పెళ్లికి వెళ్తున్నాడని క్లారిటీ వచ్చింది. ఐతే రెండు రోజులుగా వరుణ్ పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తిరుగుతుండగా.. అందులో ఎక్కడా పవన్ కనిపించడం లేదు. చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్.. ఇలా చాలామంది మెగా ఫ్యామిలీ సెలబ్రెటీలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలోకి వచ్చాయి. కానీ పవన్ ఫొటోలు మాత్రం దర్శనమివ్వడం లేదు.
దీని మీద మెగా అభిమానులు ఆసక్తిక చర్చలు పెడుతున్నారు. జోకులు పేలుస్తున్నారు. పవన్ ఎక్కడున్నాడో వెతికి పట్టుకుని ఒక ఫొటో తీసి పోస్ట్ చేయాలని చిరును కోరుతున్నారు. కొందరేమో పవన్ ఇటలీకి వెళ్దామని ఎక్కడికి వెళ్లిపోయాడో అంటుంటే.. పెళ్లి కోసం వెళ్లి పుస్తకాలు చదువుతూనో, ఇటలీలో మాన్యుమెంట్స్ చూస్తూనూ గడిపేస్తున్నట్లున్నాడు జోకులు వేస్తున్నారు. వరుణ్ పెళ్లిలో పవన్ ఉన్న ఫొటో ఒకటి బయటికి వస్తే కానీ ఈ చర్చలు ఆగేలా లేవు.
This post was last modified on November 1, 2023 5:00 pm
రష్యా సాయుధ బలగాలు జరిపిన దాడిలో కేరళకు చెందిన అఖిల్ జోయన్ అనే 26 ఏళ్ల నావికుడు ప్రాణాలు కోల్పోయాడు.…
1997 వినీత్, సౌందర్య జంటగా ఆరో ప్రాణం అనే సినిమా వచ్చింది. మంచి హిట్. చక్కని పాటలతో పాటు క్లిష్టమైన…
ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్ టీమిండియా బౌలింగ్ లోపాలపై ఒక పెద్ద డేంజర్ బెల్ మోగించింది. బ్యాటింగ్ బలంగా…
సినిమాకు హైప్ తీసుకురావడంలో ఒక్కో దర్శకుడిది ఒక్కో స్టైల్. ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకులు తమ…
టీడీపీ ని నిలబెట్టింది కార్యకర్తలు.. వారి అండతోనే పార్టీ విజయం దక్కించుకుంటోంది- అని పార్టీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ…
దేశరాజధాని ఢిల్లీలో సోమవారం చోటు చేసుకున్న పరిణామాలపై సోషల్ మీడియా వేదికగా అనేక వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి. అందరి టార్గెట్ ఒక్కటే..…