నెలల తరబడి అక్కినేని అభిమానులు ఎదురు చూసి ఏకంగా మర్చిపోయిన నాగ చైతన్య డీజిటల్ డెబ్యూ దూత త్వరలోనే స్ట్రీమింగ్ కాబోతోందని డిజిటల్ వర్గాల కథనం. 24, మనం, ఇష్క్ ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ హారర్ డ్రామా షూటింగ్ ఫినిష్ చేసుకుని చాలా కాలమయ్యింది. థాంక్ యు టైంలోనే చిత్రీకరణ పూర్తి చేసినట్టు వార్తలొచ్చాయి. అయితే దాంతో పాటు లాల్ సింగ్ చడ్డా, కస్టడీలు వరసగా డిజాస్టర్ కావడంతో దూతను ప్రత్యేకంగా పట్టించుకునేవాళ్ళు లేకపోయారు. ఆ కారణంగానే అమెజాన్ ప్రైమ్ కొంత వేచి చూసే ధోరణి వహించిందనే టాక్ వచ్చింది.
ఏదైతేనేం డిసెంబర్ మొదటి వారంలో అది కూడా ఒకటో తారీఖునే దూతని రిలీజ్ చేయాలని ప్రైమ్ నిర్ణయించుకున్నట్టు తెలిసింది. సాధారణంగా ఈ ఓటిటి ఫాలో అయ్యే ప్యాట్రన్ లోనే ఎనిమిది ఎపిసోడ్లు చెరో ముప్పావు గంట దాకా ఉండేలా ఫైనల్ కట్ సిద్ధం చేశారట. మాములుగా ఇలాంటివి వాటిని ప్రైమ్ చాలా అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తుంది. రకరకాల నగరాలు, ప్రదేశాల్లో ఈవెంట్లు చేస్తుంది. దానికి క్యాస్టింగ్ అందుబాటులో ఉండాలి. చైతు ప్రస్తుతం ఫ్రీగానే ఉన్నాడు. చందూ మొండేటితో చేయాల్సిన తండేల్ (ప్రచారంలో ఉన్న టైటిల్) ప్రీ ప్రొడక్షన్ పనులు స్పీడ్ మీదున్నాయి.
ఒకవేళ దూత కనక డిసెంబర్ కన్ఫర్మ్ చేసుకుని చైతు ఎంతలేదన్నా రెండు మూడు వారాలు దాని ప్రమోషన్ కోసం కేటాయించాల్సి ఉంటుంది. తన స్కూల్ కి భిన్నంగా దెయ్యాల కథలో నటించిన నాగ చైతన్య ఇందులో ఎలా ఉంటాడోననే ఉద్వేగం ఫ్యాన్స్ లో ఎక్కువగా ఉంది. రాజుగారి గది 2 నాగార్జున తరహా పాత్రలోనే దూతలో చైతు క్యారెక్టార్ ఉంటుందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. విక్రమ్ కుమార్ కు ఈ బ్యాక్ డ్రాప్ డీల్ చేయడం కొత్త కాదు. మాధవన్ 13B చాలా తక్కువ బడ్జెట్ తో తీసి సూపర్ హిట్ కొట్టిన ట్రాక్ రికార్డు ఉంది. మరి దూతలో కూడా ఒళ్ళు జలదరించే సన్నివేశాలు చాలానే ఉంటాయట.
This post was last modified on October 31, 2023 7:02 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…