‘ఖైదీ’, ‘విక్రమ్’ సినిమాలతో లోకేష్ కనకరాజ్ దేశంలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడైపోయాడు. అతడికి బహు భాషల్లో భారీగా అభిమానగణం తయారైంది. తెలుగు ప్రేక్షకులైతే అతడి పేరు చెబితే ఊగిపోయే పరిస్థితి వచ్చింది. ‘లియో’ సినిమాకు ఒక రేంజిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయన్నా.. తొలి రోజు భారీ ఓపెనింగ్స్ వచ్చాయన్నా విజయ్ని మించి లోకేష్కు ఇక్కడున్న క్రేజే ప్రధాన కారణం. ఐతే ‘లియో’ అంచనాలను అందుకోవడంలో ఘోరంగా విఫలమైంది.
లోకేష్ కెరీర్లో వీకెస్ట్ మూవీ ఇదే అనడంలో సందేహం లేదు. అసలేముందని ఈ కథతో సినిమా తీశాడు అనే ప్రశ్నలు తలెత్తాయి. అతను అప్పుడే టచ్ కోల్పోయాడా.. తనలో కంటెంట్ అయిపోయిందా అనే చర్చ జరిగింది. ఐతే తన ప్రతి సినిమాకూ వచ్చే ఫీడ్ బ్యాక్ తీసుకుని పని చేస్తానని చెప్పే లోకేష్.. తన తర్వాతి చిత్రం విషయంలో జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం.
‘లియో’ విషయంలో జరిగిన అతి పెద్ద తప్పు.. స్క్రిప్టు, షూటింగ్ విషయంలో హడావుడి పడటం. ‘విక్రమ్’ రిలీజైన కొన్ని రోజులకే ఈ సినిమాను మొదలుపెట్టేశాడు. స్క్రిప్టు సరిగా తీర్చిదిద్దుకోలేదు. షూటింగ్ కూడా హడావుడిగా చేసేశారు. ముందే రిలీజ్ డేట్ డెడ్ లైన్ పెట్టుకుని ఆ ప్రెజర్ మీద పని చేశాడు లోకేష్. ఆ ఎఫెక్ట్ ఔట్ పుట్ మీద పడింది. అందుకే ఈసారి లోకేష్ హడావుడి పడట్లేదట.
రజినీకాంత్తో కొత్త సినిమాను ఒక వైవిధ్యమైన కథతో చేయబోతున్న లోకేష్.. దీని మీద ఆరు నెలల పాటు పని చేయనున్నాడట. రజినీ అందుబాటులోకి రావడానికి కూడా టైం పడుతుంది కాబట్టి అతడి మీద ఒత్తిడి లేదు. షూటింగ్ కూడా హడావుడి లేకుండా వీలైనంత టైం తీసుకుని చేయాలని లోకేష్ ఫిక్సయ్యాడట. కాబట్టి అతడి నుంచి కొత్త సినిమా రావడానికి దాదాపు రెండేళ్లు పట్టొచ్చని తెలుస్తోంది. కాబట్టి ఈసారి అతడి నుంచి మంచి క్వాలిటీ మూవీ ఆశించవచ్చు.
This post was last modified on October 31, 2023 2:31 pm
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…
ఢిల్లీలో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సమ్మిట్లో గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రదర్శించిన ఒక రోబో డాగ్ ఇప్పుడు పెద్ద వివాదానికి…