చూస్తుంటే దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కంటెంట్ తో పాటు లెన్త్ పరంగా కూడా షాక్ ఇచ్చేలా ఉన్నాడని బాలీవుడ్ వర్గాల కథనం. ఇన్ సైడ్ టాక్ ప్రకారం అనిమల్ నిడివి అక్షరాలా 3 గంటల 30 నిముషాలు లాక్ చేశారట. ఫైనల్ సెన్సార్ కాపీ కూడా అంత నిడివితోనే పంపించారని టి సిరీస్ వర్గాల కథనం. తన డెబ్యూ మూవీ అర్జున్ రెడ్డిని కూడా సందీప్ నాలుగు గంటలకు పైగానే ప్లాన్ చేసుకున్నాడు. కానీ కొత్త హీరోతో అంత సుదీర్ఘమైన నిడివి అంటే థియేటర్ వర్గాల నుంచి మద్దతు దక్కదనే అనుమానంతో పాటు రిసీవ్ చేసుకోలేరన్న డౌట్ తో గంటకు పైగానే ఎడిట్ చేయించి వదిలాడు.
కానీ అనిమల్ కు మాత్రం అంత రాజీ పడనని నిర్మాతలతో అంటున్నట్టు తెలిసింది. దీనికి హీరో రన్బీర్ కపూర్ మద్దతు ఇస్తున్నట్టు వినికిడి. అదే కనక జరిగితే అనిమల్ కు రెండు ఇంటర్వెల్స్ ఇవ్వాల్సి రావొచ్చు. ఒకప్పుడు ఇలాగే చేసేవాళ్ళు. అమీర్ ఖాన్ లగాన్, సల్మాన్ హం ఆప్కె హై కౌన్ లకు డబుల్ విశ్రాంతి నిచ్చేవాళ్ళు. కానీ రోజుకు మూడు షోలు మాత్రమే సాధ్యమయ్యేవి. అలా అని టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఉండేది కాదు. కానీ వంద రోజులకు పైగా హౌస్ ఫుల్ కలెక్షన్లతో లాంగ్ రన్ దక్కేది కాబట్టి వసూళ్ల ఫిగర్లలో తేడాలు వచ్చేవి కాదు. బ్లాక్ బస్టర్లు పడేవి.
మరి సందీప్ అంతసేపు థియేటర్ ఆడియన్స్ ని కట్టి పడేయడం పెద్ద సవాలే. సినిమా మాత్రం ఎక్స్ ట్రాడినరిగా వచ్చిందని, చూసిన ప్రతి ఒక్కరు ఎక్కడా బోర్ ఫీలవ్వకుండా కన్నార్పకుండా చూశారని, ఆ నమ్మకంతో సందీప్ వంగా అంత రిస్క్ కి రెడీ అవుతున్నట్టు చెబుతున్నారు. ఇంకా అధికారికంగా చెప్పలేదు కాబట్టి నిర్ధారించలేం కానీ ఒకవేళ నిజమైతే మాత్రం రోజుకు అయిదారు షోలు వేసుకునే మల్టీప్లెక్సులకు చిక్కొచ్చి పడుతుంది. కాస్త త్వరగా ఆటలు మొదలుపెట్టాల్సి ఉంటుంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన అనిమల్ లిరికల్ వీడియోస్ ఇప్పటికే సంచలనం సృష్టిస్తున్నాయి.
This post was last modified on October 30, 2023 10:52 pm
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…