గత వీకెండ్లో తెలుగు ప్రేక్షకులను పలకరించిన కొత్త చిత్రం.. మార్టిన్ లూథర్ కింగ్. పేరడీ, స్పూఫ్ సినిమాలు చేసుకునే సంపూర్ణేష్ బాబును ఒక సీరియస్ పాత్రలో చూపిస్తూ కొత్త దర్శకురాలు పూజా కొల్లూరు ఈ చిత్రాన్ని రూపొందించింది. ‘కేరాఫ్ కంచరపాలెం’ దర్శకుడు వెంకటేష్ మహా ఇందులో ఓ కీలక పాత్ర చేయడంతో పాటు స్క్రిప్టు కూడా అందించాడు. ఐతే ఓటు విలువను తెలియజెప్పే ఒక మంచి సందేశాన్ని వినోదపు పూతతో చెప్పిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందన రావట్లేదు.
ప్రేక్షకులను ఆకర్షించే టైటిల్ పెట్టకపోవడం వల్ల కావచ్చు, కాస్టింగ్ మైనస్ అయి ఉండొచ్చు.. కారణాలేవైనప్పటికీ సినిమా లో బజ్తో రిలీజైంది. టాక్ కూడా ఆశించిన స్థాయిలో రాలేదు. కాగా తన సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు దర్శకురాలు సోషల్ మీడియాలో బాగానే కష్టపడుతోంది.
తన నేపథ్యం గురించి వివరిస్తూ.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోట్ చేసి ‘మార్టిన్ లూథర్ కింగ్’ సినిమా చూడమని చెప్పడం.. అలాగే మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు సెలబ్రెటీలను కూడా ట్యాగ్ చేసి సినిమా చూడమని కోరడం.. ఇలా చేస్తోంది పూజ. ఐతే ‘మార్టిన్ లూథర్ కింగ్’ పూజ సొంత కథతో తెరకెక్కిన సినిమా ఏమీ కాదు. ఇది తమిళంలో విజయవంతమైన ‘మండేలా’కు రీమేక్. పూజ ఈ విషయాన్ని ప్రస్తావించకుండా తనే ఒక గొప్ప సినిమా తీసినట్లుగా పోస్టులు పెట్టడం.. ఒరిజినల్ డైరెక్టర్కు క్రెడిట్ ఇవ్వకపోవడం నెటిజన్లకు నచ్చలేదు.
దీన్ని తప్పుబట్టడమే కాక.. తీసిన రీమేక్ సినిమాకు ఇంత హడావుడి ఏంటి అంటూ ఆమెను టార్గెట్ చేశారు. ఇది పూజను బాధించింది. తర్వాతి పోస్టుల్లో ఒరిజినల్ డైరెక్టర్ మడోన్ అశ్విన్ను ట్యాగ్ చేయడమే కాక.. రీమేక్ చేస్తే తప్పేంటి, ఒక మంచి కథను తెలుగు ప్రేక్షకులకు అందించాలని చేసిన ప్రయత్నంలో లోపాలు ఎంచుతారా అంటూ మరో పోస్టు పెట్టింది. ఈ గొడవ ‘మార్టిన్ లూథర్ కింగ్’కు సోషల్ మీడియాలో పబ్లిసిటీ తెచ్చిపెడుతున్నప్పటికీ.. వాస్తవంగా అయితే ఈ సినిమాకు సరైన వసూళ్లు లేవు.
This post was last modified on October 30, 2023 9:25 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…