దాదాపు రెండు దశాబ్దాలుగా తెలుగులో క్యారెక్టర్ రోల్స్తో ఆకట్టుకుంటోంది సీనియర్ నటి ప్రగతి. ఈ మధ్య కొంచెం జోరు తగ్గినట్లు అనిపిస్తున్నా.. ఆమె ఏదో రకంగా వార్తల్లో మాత్రం నిలుస్తూనే ఉంటుంది. నడి వయస్సులో ఆమె ఫిట్నెస్ కోసం పడే కష్టం.. హీరోయిన్ల తరహాలో చేసే ఫొటో షూట్లు తన గురించి సోషల్ మీడియాలో చర్చించుకునేలా చేస్తుంటాయి.
ఐతే ఇటీవల తన వ్యక్తిగత జీవితం గురించి వచ్చిన వార్తలపై ప్రగతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆధారాలు లేకుండా మీడియాలో వార్తలు రాసేశారంటూ ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి విషయాలు ఏమైనా ఉంటే తనే స్వయంగా చెబుతానని.. కానీ వెరిఫై చేసుకోకుండా వార్తలు ప్రచురించడం దారుణమని ఆమె ఆవేదన చెందింది.
‘‘నేను పెళ్లి చేసుకుంటున్నట్లు కొన్ని ప్రముఖ మీడియా సంస్థలు వార్తలు రాశాయి. సోషల్ మీడియాలో కూడా దీని గురించి ప్రచారం జరిగింది. ఈ వార్తలు చూసి చాలా బాధ కలిగింది. ఆధారాలు లేకుండా అలా రాయడం బాధ్యతా రాహిత్యం. నేను నటిని కాబట్టి మీరు ఏమైనా రాయొచ్చని అనుకోవడం తప్పు. మీకేం హక్కు ఉందని వేరొకరి వ్యక్తిగత జీవితం మీద ఇలా ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్లు రాస్తారు?
నేనీ వార్తలను పూర్తిగా ఖండిస్తున్నా. ఇక ముందైనా ఇలాంటి విషయాలు రాసేటపుడు కొంచెం చెక్ చేసుకుని.. నిజాలు తెలుసుకుని రాయండి. వ్యక్తుల గురించి రాసేటపుడు కొన్ని హద్దులు ఉంటాయి. వాటిని దాటకూడదు. నా వ్యక్తిగత జీవితంలో ఏదైనా జరిగితే, అది చెప్పాలనుకుంటే నేనే వెల్లడిస్తా. అలా కాకుండా నా ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసేలా వార్తలు రాయడం సరైన పద్ధతి కాదు’’ అని ప్రగతి పేర్కొంది. తెలుగు సహా పలు భాషల్లో వందకు పైగా సినిమాలు చేసిన ప్రగతి.. ఇటీవలే మెగాస్టార్ మూవీ ‘భోళా శంకర్’లో మెరిసింది.
This post was last modified on October 30, 2023 4:02 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…