దాదాపు రెండు దశాబ్దాలుగా తెలుగులో క్యారెక్టర్ రోల్స్తో ఆకట్టుకుంటోంది సీనియర్ నటి ప్రగతి. ఈ మధ్య కొంచెం జోరు తగ్గినట్లు అనిపిస్తున్నా.. ఆమె ఏదో రకంగా వార్తల్లో మాత్రం నిలుస్తూనే ఉంటుంది. నడి వయస్సులో ఆమె ఫిట్నెస్ కోసం పడే కష్టం.. హీరోయిన్ల తరహాలో చేసే ఫొటో షూట్లు తన గురించి సోషల్ మీడియాలో చర్చించుకునేలా చేస్తుంటాయి.
ఐతే ఇటీవల తన వ్యక్తిగత జీవితం గురించి వచ్చిన వార్తలపై ప్రగతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆధారాలు లేకుండా మీడియాలో వార్తలు రాసేశారంటూ ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి విషయాలు ఏమైనా ఉంటే తనే స్వయంగా చెబుతానని.. కానీ వెరిఫై చేసుకోకుండా వార్తలు ప్రచురించడం దారుణమని ఆమె ఆవేదన చెందింది.
‘‘నేను పెళ్లి చేసుకుంటున్నట్లు కొన్ని ప్రముఖ మీడియా సంస్థలు వార్తలు రాశాయి. సోషల్ మీడియాలో కూడా దీని గురించి ప్రచారం జరిగింది. ఈ వార్తలు చూసి చాలా బాధ కలిగింది. ఆధారాలు లేకుండా అలా రాయడం బాధ్యతా రాహిత్యం. నేను నటిని కాబట్టి మీరు ఏమైనా రాయొచ్చని అనుకోవడం తప్పు. మీకేం హక్కు ఉందని వేరొకరి వ్యక్తిగత జీవితం మీద ఇలా ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్లు రాస్తారు?
నేనీ వార్తలను పూర్తిగా ఖండిస్తున్నా. ఇక ముందైనా ఇలాంటి విషయాలు రాసేటపుడు కొంచెం చెక్ చేసుకుని.. నిజాలు తెలుసుకుని రాయండి. వ్యక్తుల గురించి రాసేటపుడు కొన్ని హద్దులు ఉంటాయి. వాటిని దాటకూడదు. నా వ్యక్తిగత జీవితంలో ఏదైనా జరిగితే, అది చెప్పాలనుకుంటే నేనే వెల్లడిస్తా. అలా కాకుండా నా ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసేలా వార్తలు రాయడం సరైన పద్ధతి కాదు’’ అని ప్రగతి పేర్కొంది. తెలుగు సహా పలు భాషల్లో వందకు పైగా సినిమాలు చేసిన ప్రగతి.. ఇటీవలే మెగాస్టార్ మూవీ ‘భోళా శంకర్’లో మెరిసింది.
This post was last modified on October 30, 2023 4:02 pm
గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…
బీజేపీ, జనసేనలతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…
గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…
ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…
యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…