ఏదైనా సినిమాకు ఆసక్తి రేపడంలోనే కాదు ఓపెనింగ్స్ తేవడంలోనూ టైటిల్స్ చాలా కీలక పాత్ర పోషిస్తాయి. ఎంత కథకు అనుగుణంగా ఉన్నా సరే అది ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందో లేదో చెక్ చేసుకోకుండా కేవలం దర్శకుల అభిరుచికి అనుగుణంగా పెడితే మాత్రం అది ఆడియన్స్ దాకా రీచ్ కాదని మరోసారి ఋజువయ్యింది. ఈ మధ్య కాలంలో కొన్ని అలాగే దెబ్బ తిన్నాయి. సంపూర్ణేష్ బాబు హీరోగా రూపొందిన మార్టిన్ లూథర్ కింగ్ కి కనీస వసూళ్లు దక్కడం లేదు. కంటెంట్ ఎలా ఉందనేది పక్కన పెడితే తెలుగు నేటివిటీకి దూరంగా చరిత్రలో నిలిచిపోయిన ఒక విదేశీ నాయుకుడి పేరు పెట్టడం మైనస్ అయ్యింది.
చిరంజీవి స్టాలిన్ అని పెట్టుకోవచ్చు. స్టార్ హీరో కాబట్టి చెల్లిపోతుంది. కానీ కిరణ్ అబ్బవరం సెబాస్టియన్ అంటే వర్కౌట్ కాలేదు. చిన్న హీరోతో నెపోలియన్ తీస్తే ఎవరూ చూడలేదు. ఇదంతా ప్రాక్టికల్ గా ఆలోచించాల్సిన విషయం. ఆ మధ్య శ్రీకాంత్ అడ్డాల పెదకాపు 1తో వచ్చారు. టైటిల్ చూసి ఇదేదో ఒక సామజిక వర్గానికి చెందిన సినిమా అనుకుని పొరబడిన చాలా మంది దూరంగా ఉన్నారు. దానికి తోడు టాక్ కూడా నెగటివ్ గా రావడంతో కనీసం పబ్లిసిటీ ఖర్చులు కూడా రాలేదు. కొత్త హీరోని పరిచయం చేసేటప్పుడు ఇలాంటి రిస్కులు తీసుకుంటే ఫలితాలు దారుణంగా ఉంటాయి.
ట్రెండ్ కు అనుగుణంగా ఆలోచించడంతో పాటు జనాలకు చేరేలా పేర్లు నిర్ణయించుకోవడం ఎంత ముఖ్యమో దీన్ని బట్టి చెప్పొచ్చు. కనీసం యావరేజ్ అనిపించుకోవాల్సినవి సైతం మొదటి రోజే షోలు క్యాన్సిల్ అయ్యేదాకా తెచ్చుకుంటున్నాయి. ఆ మధ్య రవితేజ తీసిన ఛాంగురే బంగారురాజాకి సినిమాలో ఉన్న క్రైమ్ కామెడీకి లంకె కుదరక ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. సిఎస్ఐ సనాతన్, భువన విజయం, స్లమ్ డాగ్ హస్బెండ్, కృష్ణగాడు అంటే ఒక రేంజ్ ఇవన్నీ పేర్ల దగ్గర పల్టీలు కొట్టినవే. దేంట్లోనూ స్టార్లు లేరు. ఇకనైనా టైటిల్ విషయంలో దర్శక నిర్మాతలు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అసలుకే మోసం వస్తుంది.
This post was last modified on October 29, 2023 1:29 pm
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…