ఏదైనా సినిమాకు ఆసక్తి రేపడంలోనే కాదు ఓపెనింగ్స్ తేవడంలోనూ టైటిల్స్ చాలా కీలక పాత్ర పోషిస్తాయి. ఎంత కథకు అనుగుణంగా ఉన్నా సరే అది ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందో లేదో చెక్ చేసుకోకుండా కేవలం దర్శకుల అభిరుచికి అనుగుణంగా పెడితే మాత్రం అది ఆడియన్స్ దాకా రీచ్ కాదని మరోసారి ఋజువయ్యింది. ఈ మధ్య కాలంలో కొన్ని అలాగే దెబ్బ తిన్నాయి. సంపూర్ణేష్ బాబు హీరోగా రూపొందిన మార్టిన్ లూథర్ కింగ్ కి కనీస వసూళ్లు దక్కడం లేదు. కంటెంట్ ఎలా ఉందనేది పక్కన పెడితే తెలుగు నేటివిటీకి దూరంగా చరిత్రలో నిలిచిపోయిన ఒక విదేశీ నాయుకుడి పేరు పెట్టడం మైనస్ అయ్యింది.
చిరంజీవి స్టాలిన్ అని పెట్టుకోవచ్చు. స్టార్ హీరో కాబట్టి చెల్లిపోతుంది. కానీ కిరణ్ అబ్బవరం సెబాస్టియన్ అంటే వర్కౌట్ కాలేదు. చిన్న హీరోతో నెపోలియన్ తీస్తే ఎవరూ చూడలేదు. ఇదంతా ప్రాక్టికల్ గా ఆలోచించాల్సిన విషయం. ఆ మధ్య శ్రీకాంత్ అడ్డాల పెదకాపు 1తో వచ్చారు. టైటిల్ చూసి ఇదేదో ఒక సామజిక వర్గానికి చెందిన సినిమా అనుకుని పొరబడిన చాలా మంది దూరంగా ఉన్నారు. దానికి తోడు టాక్ కూడా నెగటివ్ గా రావడంతో కనీసం పబ్లిసిటీ ఖర్చులు కూడా రాలేదు. కొత్త హీరోని పరిచయం చేసేటప్పుడు ఇలాంటి రిస్కులు తీసుకుంటే ఫలితాలు దారుణంగా ఉంటాయి.
ట్రెండ్ కు అనుగుణంగా ఆలోచించడంతో పాటు జనాలకు చేరేలా పేర్లు నిర్ణయించుకోవడం ఎంత ముఖ్యమో దీన్ని బట్టి చెప్పొచ్చు. కనీసం యావరేజ్ అనిపించుకోవాల్సినవి సైతం మొదటి రోజే షోలు క్యాన్సిల్ అయ్యేదాకా తెచ్చుకుంటున్నాయి. ఆ మధ్య రవితేజ తీసిన ఛాంగురే బంగారురాజాకి సినిమాలో ఉన్న క్రైమ్ కామెడీకి లంకె కుదరక ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. సిఎస్ఐ సనాతన్, భువన విజయం, స్లమ్ డాగ్ హస్బెండ్, కృష్ణగాడు అంటే ఒక రేంజ్ ఇవన్నీ పేర్ల దగ్గర పల్టీలు కొట్టినవే. దేంట్లోనూ స్టార్లు లేరు. ఇకనైనా టైటిల్ విషయంలో దర్శక నిర్మాతలు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అసలుకే మోసం వస్తుంది.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…
రెగ్యులర్ గా టాలీవుడ్ ని ఫాలో అయ్యేవాళ్ళకు మ్యాజిక్ అంటే వెంటనే గుర్తొచ్చే కాంబినేషన్ గౌతమ్ తిన్ననూరి - అనిరుద్…
మెగా ఫ్యాన్స్, ఐకాన్ స్టార్ అభిమానుల మధ్య బయటికి కనిపించని కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది. హీరోలు వాళ్ళు వాళ్ళు…
ప్యాన్ ఇండియా సినిమాలకు వాయిదాలు మంచి నీళ్లు తాగినంత సులభంగా మారిపోయాయి. రెండు కన్నా తక్కువ డేట్లు మార్చుకుని థియేటర్లకు…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్…
అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…