టన్నుల కొద్దీ టాలెంట్ ఉన్నా దాన్ని సరిగా వాడుకునే దర్శకుడు లేక పరాజయాలు చవిచూస్తున్న కథానాయకుడు విక్రమ్. పితామగన్, సామి, అపరిచితుడు లాంటి భారీ విజయాలతో ఒకప్పుడు అతను మామూలు క్రేజ్ తెచ్చుకోలేదు. కానీ ఆ తర్వాత భారీ అంచనాల మధ్య వచ్చిన అతడి సినిమాలేవీ ఆశించిన విజయం సాధించలేకపోయాయి. గత రెండు దశాబ్దాలుగా సోలో హీరోగా విక్రమ్కు నిఖార్సయిన హిట్టే లేదు.
అయినా అతడి నుంచి పెద్ద పెద్ద సినిమాలు వస్తూనే ఉంటాయి. కబాలి దర్శకుడు పా.రంజిత్తో విక్రమ్ తంగలాన్ అనే భారీ చిత్రం ఒకటి చేసిన సంగతి తెలిసిందే. వచ్చే జనవరి 26న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు తాజాగా ప్రకటించారు. దీంతో పాటే విక్రమ్ కొత్త సినిమా అనౌన్స్మెంట్ కూడా వచ్చింది.
విక్రమ్ 62వ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ఒక టీజర్ ద్వారా అనౌన్స్ చేశారు. ఇదొక రూరల్ డ్రామా అనే విషయం టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఒక పోలీస్ స్టేషన్లోకి ఒక మహిళ తనను ఇద్దరు రౌడీలు అల్లరి చేశారని కంప్లైంట్ చేయడానికి వస్తుంది. అంతలో ఆ ఇద్దరూ దెబ్బలు తింటూ పోలీస్ స్టేషన్లోకి వచ్చి పడతారు. వాళ్లను కొట్టిన వ్యక్తే హీరో.
ఐతే స్టేషన్లో జులుం చూపించిన హీరోను నువ్వెవరని పోలీస్ గదమాయిస్తే తన గురించి చెవిలో ఏదో చెబుతాడు. అప్పుడా పోలీస్ భయపడతాడు. ఇంతకీ హీరో నేపథ్యం ఏంటన్నదే ఈ కథలా కనిపిస్తోంది. చివర్లో ఒక మామూలు స్కూటర్ మీద మార్కెట్ వస్తువులు తీసుకెళ్తూ కనిపించాడు హీరో. ఆ షాట్ ఆకట్టుకుంది. మొత్తంగా టీజర్ రొటీన్కు భిన్నంగానే అనిపించింది. పక్కా ఎంటర్టైనర్ చూడబోతున్న ఫీలింగ్ కలిగించింది. ఇటీవలే సిద్దార్థ్తో చిత్తా (తెలుగులో చిన్నా) అనే సినిమాతో హిట్ కొట్టిన అరుణ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు.
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…