తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి రాజుకుంది. తెలంగాణలో ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. ఇంకో నెల రోజుల్లోనే ఎన్నికలు జరగబోతున్నాయి. ఏపీలో ఎన్నికలకు ఇంకో ఐదు నెలల సమయం ఉన్నప్పటికీ.. అక్కడ ఇప్పటికే వాడి వేడి రాజకీయం నడుస్తోంది. ఈ నేపథ్యంలో సినిమాల్లో సైతం రాజకీయ వేడి రాజుకుంటోంది. రాజకీయ కథలతో యాత్ర-2, వ్యూహం, శపథం, ప్రతినిధి-2 లాంటి సినిమాలు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు సమకాలీన రాజకీయాల మీద సెటైరికల్ సినిమాలు కూడా వస్తున్నాయి.
అందులో భాగమే.. టాలీవుడ్ లేటెస్ట్ రిలీజ్.. మార్టిన్ లూథర్ కింగ్. ఓటు విలువను తెలియజేసే సందేశంతో ముడిపడ్డ వినోదాత్మక కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఎన్నికల్లో కులం పాత్ర ఎలాంటిదో చెబుతూ.. దాని వల్ల తలెత్తే దుష్పరిణామాలను కూడా ఈ సినిమా చర్చిస్తుంది. తమిళంలో విజయవంతమైన ‘మండేలా’ సినిమా ఆధారంగా.. మన నేటివిటీకి తగ్గట్లుగా ఈ సినిమాను తీర్చిదిద్దారు.
పూజ కొల్లూరు అనే కొత్త దర్శకురాలు ఈ చిత్రాన్ని రూపొందించగా.. ‘కేరాఫ్ కంచరపాలెం’ దర్శకుడు వెంకటేష్ మహా ఓ కీలక పాత్ర చేయడంతో పాటు దీనికి స్క్రిప్టు అందించాడు. కాగా సమకాలీన రాజకీయాలపై చాలా సెటైర్లు ఉన్న ఈ సినిమాలో.. పర్టికులర్గా కొన్ని సీన్లు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసినట్లు కనిపించాయి. నరేష్ పాత్ర ద్వారా పరోక్షంగా జగన్ మీద సెటైర్లు వేయించడం విశేషం. ఇందులో ఆయన పాత్ర పేరు జగ్గు. ప్రెసిడెంట్ ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబడ్డ అతను.. ప్రచారంలో భాగంగా జనాలను హత్తుకోవడం, ముద్దులివ్వడం చేస్తాడు.
ఒక మహిళా ఓటర్ దగ్గరికెళ్లి ఆమెను కౌగిలించుకుని ముద్దివ్వబోతే పక్కనున్న వాళ్లు ఆపుతారు. అలాగే మరో సీన్లో జనం ఎవ్వరూ లేని చోటు కూడా దండాలు పెట్టి చిత్రమైన హావభావాలు ఇస్తాడు నరేష్. గత ఎన్నికలకు ముందు పాదయాత్రలో భాగంగా జగన్ జనాలను కౌగిలించుకోవడం.. ముద్దులివ్వడం.. చేయి పెట్టి ఆశీర్వదించడం లాంటివి చేయడం గుర్తుండే ఉంటుంది. అలాగే ముఖ్యమంత్రి అయ్యాక తిరుపతిలో ఒక గుడి ప్రారంభోత్సవానికి వెళ్లిన జగన్.. కింద జనాలే లేకపోయినా కొండ మీది నుంచి దండాలు పెడుతున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి.
This post was last modified on October 28, 2023 3:04 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…