తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి రాజుకుంది. తెలంగాణలో ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. ఇంకో నెల రోజుల్లోనే ఎన్నికలు జరగబోతున్నాయి. ఏపీలో ఎన్నికలకు ఇంకో ఐదు నెలల సమయం ఉన్నప్పటికీ.. అక్కడ ఇప్పటికే వాడి వేడి రాజకీయం నడుస్తోంది. ఈ నేపథ్యంలో సినిమాల్లో సైతం రాజకీయ వేడి రాజుకుంటోంది. రాజకీయ కథలతో యాత్ర-2, వ్యూహం, శపథం, ప్రతినిధి-2 లాంటి సినిమాలు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు సమకాలీన రాజకీయాల మీద సెటైరికల్ సినిమాలు కూడా వస్తున్నాయి.
అందులో భాగమే.. టాలీవుడ్ లేటెస్ట్ రిలీజ్.. మార్టిన్ లూథర్ కింగ్. ఓటు విలువను తెలియజేసే సందేశంతో ముడిపడ్డ వినోదాత్మక కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఎన్నికల్లో కులం పాత్ర ఎలాంటిదో చెబుతూ.. దాని వల్ల తలెత్తే దుష్పరిణామాలను కూడా ఈ సినిమా చర్చిస్తుంది. తమిళంలో విజయవంతమైన ‘మండేలా’ సినిమా ఆధారంగా.. మన నేటివిటీకి తగ్గట్లుగా ఈ సినిమాను తీర్చిదిద్దారు.
పూజ కొల్లూరు అనే కొత్త దర్శకురాలు ఈ చిత్రాన్ని రూపొందించగా.. ‘కేరాఫ్ కంచరపాలెం’ దర్శకుడు వెంకటేష్ మహా ఓ కీలక పాత్ర చేయడంతో పాటు దీనికి స్క్రిప్టు అందించాడు. కాగా సమకాలీన రాజకీయాలపై చాలా సెటైర్లు ఉన్న ఈ సినిమాలో.. పర్టికులర్గా కొన్ని సీన్లు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసినట్లు కనిపించాయి. నరేష్ పాత్ర ద్వారా పరోక్షంగా జగన్ మీద సెటైర్లు వేయించడం విశేషం. ఇందులో ఆయన పాత్ర పేరు జగ్గు. ప్రెసిడెంట్ ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబడ్డ అతను.. ప్రచారంలో భాగంగా జనాలను హత్తుకోవడం, ముద్దులివ్వడం చేస్తాడు.
ఒక మహిళా ఓటర్ దగ్గరికెళ్లి ఆమెను కౌగిలించుకుని ముద్దివ్వబోతే పక్కనున్న వాళ్లు ఆపుతారు. అలాగే మరో సీన్లో జనం ఎవ్వరూ లేని చోటు కూడా దండాలు పెట్టి చిత్రమైన హావభావాలు ఇస్తాడు నరేష్. గత ఎన్నికలకు ముందు పాదయాత్రలో భాగంగా జగన్ జనాలను కౌగిలించుకోవడం.. ముద్దులివ్వడం.. చేయి పెట్టి ఆశీర్వదించడం లాంటివి చేయడం గుర్తుండే ఉంటుంది. అలాగే ముఖ్యమంత్రి అయ్యాక తిరుపతిలో ఒక గుడి ప్రారంభోత్సవానికి వెళ్లిన జగన్.. కింద జనాలే లేకపోయినా కొండ మీది నుంచి దండాలు పెడుతున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి.
రాజమౌళి, మహేష్ బాబుల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న వారణాసి సినిమాలో రామాయణం నేపథ్యంలో ఒక అరగంట యుద్ధ సన్నివేశాలు ఉంటాయని…
జూన్ 19 మా ఇంటి బంగారం విడుదలకు రెడీ అవుతోంది. శాకుంతలం, ఖుషి తర్వాత సమంతకు బాగా గ్యాప్ వచ్చేసింది.…
ఆ పాఠశాలలో సంప్రదాయ విద్యా విధానం లేదు.. సహచర విద్యార్థుల ద్వారానే పాఠాలు నేర్చుకుంటారు… ఈ ప్రత్యేకతలు ఉన్న పాఠశాలను…
తెలుగు సినిమాల్లో సాధారణంగా ఒక సినిమాలో ఐదారు పాటలు ఉంటాయి. కొన్ని చిత్రాల్లో ఒకట్రెండు తగ్గుతుంటాయి. కొన్నింట్లో పెరుగుతుంటాయి. థ్రిల్లర్…
సోషల్ మీడియాలోనే కాదు బయట కూడా పెద్దిలో జాన్వీ కపూర్ క్యారెక్టరైజేషన్ గురించి పెద్ద చర్చ జరుగుతోంది. ఎన్నడూ లేనిది…
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఉద్యమ సంఘం నాయకుడు అభిజీత్ దీప్కే ఇచ్చిన పిలుపు ఫలించింది. శనివారం ఉదయం 10 గంటల…