ఒకప్పుడు తెలుగులోకి వచ్చే తమిళ సినిమాల డబ్బింగ్ విషయంలో ఎంత జాగ్రత్త పడేవాళ్లో తెలిసిందే. అవి అనువాద చిత్రాలనే ఫీలింగే వచ్చేది కాదు. తెలుగులో చక్కటి టైటిల్ పెట్టి.. డబ్బింగ్, పాటల విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ పెట్టేవాళ్లు. మణిరత్నం లాంటి దర్శకులైతే వేటూరి లాంటి లెజెండరీ లిరిసిస్టులను పెట్టుకుని పాటలు రాయించుకునేవారు. ఘర్షణ, సఖి, యువ లాంటి మంచి మంచి టైటిళ్లతో ఆయన అనువాద చిత్రాలు రిలీజయ్యాయి.
కానీ ఈ మధ్య తమిళ అనువాదాల తీరు తీవ్ర అభ్యంతరకంగా ఉంటోంది. ఇటీవలే రిలీజైన ‘లియో’ సినిమాలోని ఒక పాటకు రాసిన తెలుగు లిరిక్స్ చూసి మనోళ్లు షాకయ్యారు. ఇక డైలాగుల సంగతి చెప్పాల్సిన పని లేదు. ఎవరో అనువాదకులను పెట్టుకుని మొక్కుబడిగా లాగించేస్తున్నారు. మరీ దారుణమైన విషయం ఏంటంటే.. కొన్ని తమిళ చిత్రాలకు తెలుగులో టైటిల్ పెట్టడానికి కూడా బద్ధకంగా ఉంటోంది. సింగం,
వలిమై, అయలాన్.. ఇలా తమిళ టైటిళ్లే పెట్టి సినిమాలను ఇక్కడ దించేస్తున్నారు. ఈ మధ్యే ప్రభుదేవా నటించిన ‘ఊల్ఫ్’ అనే సినిమాకు తెలుగులో ‘ఉల్ఫ’ అనే పేరు పెట్టి పోస్టర్ వదలడం గమనార్హం. తాజాగా ఇంకో తమిళ చిత్రం.. తమిళ టైటిల్తోనే తెలుగులోకి దిగేస్తోంది. అదే.. తంగలాన్. అసలా పదమేంటో.. దాని అర్థమేంటో మన వాళ్లెవ్వరికీ తెలియదు. పాన్ ఇండియా సినిమా అని చెప్పి అదే పేరుతో ఇక్కడ రిలీజ్ చేయబోతున్నారు.
ఇదేమీ చిన్నా చితకా సినిమా కాదు. విక్రమ్ హీరోగా ‘కబాలి’ దర్శకుడు పా.రంజిత్ తీసిన భారీ చిత్రం. ఇలాంటి సినిమాను తెలుగులో రిలీజ్ చేసేటపుడు కనీసం తెలుగు టైటిల్ పెట్టడం కూడా కష్టమా అన్నది ప్రశ్న. తెలుగు ప్రేక్షకులు ఏ భాషా చిత్రాన్నయినా ఆదరించే విశాల హృదయులైనా సరే.. మరీ వాళ్ల అభిమానాన్ని ఇంత గ్రాంటెడ్గా తీసుకోవడం దారుణం. కనీసం తెలుగు టైటిల్ కూడా పెట్టలేని వాళ్ల సినిమాలను మన వాళ్లు అసలు పట్టించుకోవాల్సిన అవసరం ఉందా అన్నది ప్రశ్న.
This post was last modified on October 28, 2023 3:12 pm
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…
పిల్లల విషయంలో తల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్యవహరించాలో చెప్పే ఉదంతమిది. విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టాలని, వారిలో భయం పెంచాలని…
హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…
సీఎం రేవంత్ రెడ్డిపై, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన…
నందమూరి అభిమానుల ఎదురు చూపులను రెన్యూవల్ చేయడమే తప్ప ఎంట్రీ ఎప్పుడు ఇస్తాడో చెప్పకుండా దోబూచులాడుతున్న మోక్షజ్ఞ మరోసారి వార్తల్లోకి…
ఈనెల 17 వ తేదీన ప్రారంభమైన రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నాలుగు రోజులపాటు జరిగాయి. బిజినెస్ అడ్వయిజరీ కమిటీలో…