నిన్న కౌంట్ పరంగా చెప్పుకోదగ్గ సినిమాలు రిలీజయ్యాయి కానీ వేటికీ కనీస ఓపెనింగ్స్ లేక థియేటర్లు వెలవెలబోయాయి. దసరాకొచ్చిన వాటికే మంచి కలెక్షన్లు రావడం గమనించాల్సిన విషయం. అయినా ఉన్నంతలో పబ్లిసిటీ చేసుకుని జనాల దృష్టిలో పడ్డ బడ్జెట్ మూవీ మార్టిన్ లూథర్ కింగ్. సంపూర్ణేష్ బాబు హీరోగా తమిళంలో యోగిబాబు చేసిన సూపర్ హిట్ మండేలా అఫీషియల్ రీమేక్ గా ఇది రూపొందింది. కేరాఫ్ కంచెరపాలం ఫేమ్ వెంకటేష్ మహా రచన చేయగా పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు. అంచనాలు లేకుండా బరిలో దిగిన ఈ కింగ్ సింహాసనం అందుకున్నాడా
పడమరపాడు గ్రామంలో చెప్పులు కొట్టుకుని జీవించే స్మైల్(సంపూర్ణేష్ బాబు) అనాథ. ఓ కొట్టు పెట్టుకోవాలని డబ్బు పోగేసుకుని పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ కోసం వసంత(శరణ్య ప్రదీప్)ని కలుస్తాడు. ఆమె సలహా మేరకు మార్టిన్ లూథర్ కింగ్ పేరు పెట్టేసుకుంటాడు. ఆ ఊరి దక్షిణ దిక్కు పెద్ద లోకి(వెంకటేష్ మహా), ఉత్తర దిక్కు నాయకుడు జగ్గు(నరేష్)లు సర్పంచ్ పదవి కోసం పోటీ పడతారు. ఒక్క ఓటు గెలుపుని శాశిస్తుందని గుర్తించి మార్టిన్ ని ప్రసన్నం చేసుకోవడం మొదలుపెడతారు. అతని గొంతెమ్మ కోరికలన్నీ తీరతాయి. వసంతకు ఇదంతా పక్కదారి పట్టిన వాస్తవం అర్థమవుతుంది. ఆ తర్వాత జరిగేదే అసలు స్టోరీ
ఓటు విలువని తెలియజెప్పే ఉద్దేశంతో రూపొందిన ఒరిజినల్ వెర్షన్ కు వీలైనంత మార్పులు చేయకుండా యధాతథంగా తీసేందుకు ప్రాధాన్యం ఇవ్వడంతో కథనం నెమ్మదిగా సాగుతుంది. మంచి సీన్లు, ఆలోచింపజేసే సంభాషణలు కొంతమేర కాపాడినా సెకండ్ హాఫ్ లో జరిగిన సాగతీతతో పాటు క్లైమాక్స్ ని ప్రేక్షకుల ఊహకే వదిలేయడం వర్కౌట్ కాలేదు. ఒకదశ దాటాక సంపూ స్థాయికి మించిన బరువు పాత్ర మీద పడటంతో తను మోయలేకపోయాడు. కామెడీ వరకు మెప్పించాడు. థియేటర్ ఎక్స్ పీరియన్స్ ని డిమాండ్ చేయడం కష్టమనిపించే మార్టిన్ లూథర్ కింగ్ మెసేజ్ ఇచ్చాడు కానీ ఎంటర్ టైన్ చేయలేకపోయాడు.
This post was last modified on October 28, 2023 10:48 am
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…