నిన్న కౌంట్ పరంగా చెప్పుకోదగ్గ సినిమాలు రిలీజయ్యాయి కానీ వేటికీ కనీస ఓపెనింగ్స్ లేక థియేటర్లు వెలవెలబోయాయి. దసరాకొచ్చిన వాటికే మంచి కలెక్షన్లు రావడం గమనించాల్సిన విషయం. అయినా ఉన్నంతలో పబ్లిసిటీ చేసుకుని జనాల దృష్టిలో పడ్డ బడ్జెట్ మూవీ మార్టిన్ లూథర్ కింగ్. సంపూర్ణేష్ బాబు హీరోగా తమిళంలో యోగిబాబు చేసిన సూపర్ హిట్ మండేలా అఫీషియల్ రీమేక్ గా ఇది రూపొందింది. కేరాఫ్ కంచెరపాలం ఫేమ్ వెంకటేష్ మహా రచన చేయగా పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు. అంచనాలు లేకుండా బరిలో దిగిన ఈ కింగ్ సింహాసనం అందుకున్నాడా
పడమరపాడు గ్రామంలో చెప్పులు కొట్టుకుని జీవించే స్మైల్(సంపూర్ణేష్ బాబు) అనాథ. ఓ కొట్టు పెట్టుకోవాలని డబ్బు పోగేసుకుని పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ కోసం వసంత(శరణ్య ప్రదీప్)ని కలుస్తాడు. ఆమె సలహా మేరకు మార్టిన్ లూథర్ కింగ్ పేరు పెట్టేసుకుంటాడు. ఆ ఊరి దక్షిణ దిక్కు పెద్ద లోకి(వెంకటేష్ మహా), ఉత్తర దిక్కు నాయకుడు జగ్గు(నరేష్)లు సర్పంచ్ పదవి కోసం పోటీ పడతారు. ఒక్క ఓటు గెలుపుని శాశిస్తుందని గుర్తించి మార్టిన్ ని ప్రసన్నం చేసుకోవడం మొదలుపెడతారు. అతని గొంతెమ్మ కోరికలన్నీ తీరతాయి. వసంతకు ఇదంతా పక్కదారి పట్టిన వాస్తవం అర్థమవుతుంది. ఆ తర్వాత జరిగేదే అసలు స్టోరీ
ఓటు విలువని తెలియజెప్పే ఉద్దేశంతో రూపొందిన ఒరిజినల్ వెర్షన్ కు వీలైనంత మార్పులు చేయకుండా యధాతథంగా తీసేందుకు ప్రాధాన్యం ఇవ్వడంతో కథనం నెమ్మదిగా సాగుతుంది. మంచి సీన్లు, ఆలోచింపజేసే సంభాషణలు కొంతమేర కాపాడినా సెకండ్ హాఫ్ లో జరిగిన సాగతీతతో పాటు క్లైమాక్స్ ని ప్రేక్షకుల ఊహకే వదిలేయడం వర్కౌట్ కాలేదు. ఒకదశ దాటాక సంపూ స్థాయికి మించిన బరువు పాత్ర మీద పడటంతో తను మోయలేకపోయాడు. కామెడీ వరకు మెప్పించాడు. థియేటర్ ఎక్స్ పీరియన్స్ ని డిమాండ్ చేయడం కష్టమనిపించే మార్టిన్ లూథర్ కింగ్ మెసేజ్ ఇచ్చాడు కానీ ఎంటర్ టైన్ చేయలేకపోయాడు.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…