జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల దృష్టి ప్రస్తుతం దేవర మీదే ఉన్నప్పటికీ.. యంగ్ టైగర్ తర్వాత చేయబోయే ప్రాజెక్టు విషయంలో వాళ్ల క్యూరియాసిటీ తక్కువగా ఏమీ లేదు. ఆ చిత్రంతోనే తారక్ బాలీవుడ్లోకి అడుగు పెడుతున్నాడు. హృతిక్ రోషన్తో కలిసి తారక్ చేయబోతున్న వార్-2 ఈ ఏడాది చివర్లోనే సెట్స్ మీదికి వెళ్తుందనే అంచనాలున్నాయి. ప్రస్తుతం విరామం లేకుండా దేవర షూటింగ్లో పాల్గొంటున్నాడు తారక్.
ఇటీవలే వార్-2 డైరెక్టర్ అయాన్ ముఖర్జీ హైదరాబాద్కు వచ్చి తారక్తో స్క్రిప్టు, షెడ్యూళ్ల గురించి మాట్లాడి వెళ్లాడు. తాజాగా హీరో రణబీర్ కపూర్ వార్-2 గురించి అప్డేట్ ఇవ్వడం విశేషం. తాను అయాన్తో బ్రహ్మాస్త్ర-2 కూడా చేయబోతున్న విషయాన్ని ధ్రువీకరిస్తూ.. వార్-2 షూట్ గురించి మాట్లాడాడు రణబీర్. ఈ సినిమా చిత్రీకరణ అతి త్వరలో మొదలవుతుందని అతను చెప్పాడు.
అంతే కాక వార్-2 షూటింగ్ వచ్చే ఏడాది మూడో క్వార్టర్లోనే పూర్తయిపోతుందని అతను సంకేతాలు ఇవ్వడం విశేషం. బ్రహ్మాస్త్ర-2 చిత్రాన్ని తాము వచ్చే ఏడాది చివర్లో లేదా 2025 ఆరంభంలో మొదలుపెడతామని రణబీర్ వెల్లడించాడు. బ్రహ్మాస్త్ర-1 అనుకున్నంత మంచి ఫలితాన్ని అందుకోని నేపథ్యంలో 2, 3 భాగాలు ఉండకపోవచ్చనే చర్చ జరిగింది. ఈ ప్రచారానికి రణబీర్ తెరదించాడు.
ఆల్రెడీ బ్రహ్మాస్త్ర-2 స్క్రిప్టు వర్క్ నడుస్తోందని.. తనకు అయాన్ కథ కూడా వినిపించాడని చెప్పాడు. బ్రహ్మాస్త్ర-1కు వచ్చిన ఫీడ్ బ్యాక్ అంతా తాము తీసుకున్నామని.. అందులో దొర్లిన తప్పులను సరదిద్దుకుంటామని.. బ్రహ్మాస్త్ర-2 అంచనాలను మించి ఉంటుందని అతను ధీమా వ్యక్తం చేశాడు. బ్రహ్మాస్త్ర-1తో పోలిస్తే పదిరెట్లు భారీగా ఉంటుందని రణబీర్ చెప్పడం విశేషం. మొత్తానికి బ్రహ్మాస్త్ర-2 విషయంలో సందేహాలేమీ అవసరం లేదని రణబీర్ మాటల్ని బట్టి అర్థమైంది.
దశాబ్ద కాలం పైగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న హీరో వడ్డే నవీన్ తనే నిర్మాతగా మారి ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులుతో…
టాలీవుడ్ యువ కథానాయకుడు నితిన్ చివరగా ఎప్పుడు హిట్టు కొట్టాడో తన అభిమానులకు కూడా సరిగా గుర్తుండకపోవచ్చు. ‘భీష్మ’ తర్వాత…
సినిమా ఇండస్ట్రీలో నార్త్ వర్సెస్ సౌత్ గొడవ ఎప్పటినుంచో నడుస్తున్నదే. ముఖ్యంగా బాలీవుడ్ మీడియా, అక్కడి జనాలు సౌత్ సినిమాలపై…
నీట్ పరీక్ష పెద్ద ప్రహసనంగా మారింది. పరీక్ష నిర్వహణలో రోజుకో వివాదం తలెత్తుతోంది. రీ నీట్ పరీక్షకు సంబంధించి హాల్…
పోక్సో కేసులో అరెస్టైన బండి భగరీథ్కు మల్కాజిగిరి కోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. భగీరథ్ను పేట్ బషీరాబాద్ పోలీసులు…
నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మా ఇంటి బంగారం ట్రేడ్ పండిట్ల అంచనాలను మించి బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. ఈ…