జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల దృష్టి ప్రస్తుతం దేవర మీదే ఉన్నప్పటికీ.. యంగ్ టైగర్ తర్వాత చేయబోయే ప్రాజెక్టు విషయంలో వాళ్ల క్యూరియాసిటీ తక్కువగా ఏమీ లేదు. ఆ చిత్రంతోనే తారక్ బాలీవుడ్లోకి అడుగు పెడుతున్నాడు. హృతిక్ రోషన్తో కలిసి తారక్ చేయబోతున్న వార్-2 ఈ ఏడాది చివర్లోనే సెట్స్ మీదికి వెళ్తుందనే అంచనాలున్నాయి. ప్రస్తుతం విరామం లేకుండా దేవర షూటింగ్లో పాల్గొంటున్నాడు తారక్.
ఇటీవలే వార్-2 డైరెక్టర్ అయాన్ ముఖర్జీ హైదరాబాద్కు వచ్చి తారక్తో స్క్రిప్టు, షెడ్యూళ్ల గురించి మాట్లాడి వెళ్లాడు. తాజాగా హీరో రణబీర్ కపూర్ వార్-2 గురించి అప్డేట్ ఇవ్వడం విశేషం. తాను అయాన్తో బ్రహ్మాస్త్ర-2 కూడా చేయబోతున్న విషయాన్ని ధ్రువీకరిస్తూ.. వార్-2 షూట్ గురించి మాట్లాడాడు రణబీర్. ఈ సినిమా చిత్రీకరణ అతి త్వరలో మొదలవుతుందని అతను చెప్పాడు.
అంతే కాక వార్-2 షూటింగ్ వచ్చే ఏడాది మూడో క్వార్టర్లోనే పూర్తయిపోతుందని అతను సంకేతాలు ఇవ్వడం విశేషం. బ్రహ్మాస్త్ర-2 చిత్రాన్ని తాము వచ్చే ఏడాది చివర్లో లేదా 2025 ఆరంభంలో మొదలుపెడతామని రణబీర్ వెల్లడించాడు. బ్రహ్మాస్త్ర-1 అనుకున్నంత మంచి ఫలితాన్ని అందుకోని నేపథ్యంలో 2, 3 భాగాలు ఉండకపోవచ్చనే చర్చ జరిగింది. ఈ ప్రచారానికి రణబీర్ తెరదించాడు.
ఆల్రెడీ బ్రహ్మాస్త్ర-2 స్క్రిప్టు వర్క్ నడుస్తోందని.. తనకు అయాన్ కథ కూడా వినిపించాడని చెప్పాడు. బ్రహ్మాస్త్ర-1కు వచ్చిన ఫీడ్ బ్యాక్ అంతా తాము తీసుకున్నామని.. అందులో దొర్లిన తప్పులను సరదిద్దుకుంటామని.. బ్రహ్మాస్త్ర-2 అంచనాలను మించి ఉంటుందని అతను ధీమా వ్యక్తం చేశాడు. బ్రహ్మాస్త్ర-1తో పోలిస్తే పదిరెట్లు భారీగా ఉంటుందని రణబీర్ చెప్పడం విశేషం. మొత్తానికి బ్రహ్మాస్త్ర-2 విషయంలో సందేహాలేమీ అవసరం లేదని రణబీర్ మాటల్ని బట్టి అర్థమైంది.
This post was last modified on October 25, 2023 9:25 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…