జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల దృష్టి ప్రస్తుతం దేవర మీదే ఉన్నప్పటికీ.. యంగ్ టైగర్ తర్వాత చేయబోయే ప్రాజెక్టు విషయంలో వాళ్ల క్యూరియాసిటీ తక్కువగా ఏమీ లేదు. ఆ చిత్రంతోనే తారక్ బాలీవుడ్లోకి అడుగు పెడుతున్నాడు. హృతిక్ రోషన్తో కలిసి తారక్ చేయబోతున్న వార్-2 ఈ ఏడాది చివర్లోనే సెట్స్ మీదికి వెళ్తుందనే అంచనాలున్నాయి. ప్రస్తుతం విరామం లేకుండా దేవర షూటింగ్లో పాల్గొంటున్నాడు తారక్.
ఇటీవలే వార్-2 డైరెక్టర్ అయాన్ ముఖర్జీ హైదరాబాద్కు వచ్చి తారక్తో స్క్రిప్టు, షెడ్యూళ్ల గురించి మాట్లాడి వెళ్లాడు. తాజాగా హీరో రణబీర్ కపూర్ వార్-2 గురించి అప్డేట్ ఇవ్వడం విశేషం. తాను అయాన్తో బ్రహ్మాస్త్ర-2 కూడా చేయబోతున్న విషయాన్ని ధ్రువీకరిస్తూ.. వార్-2 షూట్ గురించి మాట్లాడాడు రణబీర్. ఈ సినిమా చిత్రీకరణ అతి త్వరలో మొదలవుతుందని అతను చెప్పాడు.
అంతే కాక వార్-2 షూటింగ్ వచ్చే ఏడాది మూడో క్వార్టర్లోనే పూర్తయిపోతుందని అతను సంకేతాలు ఇవ్వడం విశేషం. బ్రహ్మాస్త్ర-2 చిత్రాన్ని తాము వచ్చే ఏడాది చివర్లో లేదా 2025 ఆరంభంలో మొదలుపెడతామని రణబీర్ వెల్లడించాడు. బ్రహ్మాస్త్ర-1 అనుకున్నంత మంచి ఫలితాన్ని అందుకోని నేపథ్యంలో 2, 3 భాగాలు ఉండకపోవచ్చనే చర్చ జరిగింది. ఈ ప్రచారానికి రణబీర్ తెరదించాడు.
ఆల్రెడీ బ్రహ్మాస్త్ర-2 స్క్రిప్టు వర్క్ నడుస్తోందని.. తనకు అయాన్ కథ కూడా వినిపించాడని చెప్పాడు. బ్రహ్మాస్త్ర-1కు వచ్చిన ఫీడ్ బ్యాక్ అంతా తాము తీసుకున్నామని.. అందులో దొర్లిన తప్పులను సరదిద్దుకుంటామని.. బ్రహ్మాస్త్ర-2 అంచనాలను మించి ఉంటుందని అతను ధీమా వ్యక్తం చేశాడు. బ్రహ్మాస్త్ర-1తో పోలిస్తే పదిరెట్లు భారీగా ఉంటుందని రణబీర్ చెప్పడం విశేషం. మొత్తానికి బ్రహ్మాస్త్ర-2 విషయంలో సందేహాలేమీ అవసరం లేదని రణబీర్ మాటల్ని బట్టి అర్థమైంది.
This post was last modified on October 25, 2023 9:25 am
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో కేవలం చర్చలు, ప్రశ్నలకే పరిమితం కాకుండా మంత్రులు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడలు పోటీలు…
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…