అప్డేట్స్ కోసం మొహం వాచిపోయేలా ఎదురు చూస్తున్న మహేష్ బాబు అభిమానులకు ఊరట కలిగిస్తూ ఎట్టకేలకు దసరా పండగ సందర్భంగా ఒక కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది హారిక హాసిని సంస్థ. కారు వెనుక డిక్కీ ఓపెన్ చేసి దాని మీద మహేష్ కూర్చుని స్టైల్ గా బీడీ వెలిగించే స్టిల్ తో పాటు కాళ్ళ కింద కత్తి పట్టుకున్న రౌడీ పడిపోయిన ఫోజు చూపించారు. ప్రమోషన్లలో మొదటిసారి వదిలిన పోస్టర్ లో కూడా బీడీనే హైలైట్ చేయడం, ప్రిన్స్ పుట్టినరోజు సందర్భంగా వదిలిన టీజర్ చివరి షాట్ లో బీడీ కాల్చుకుంటూ నడిచి వచ్చే సన్నివేశాన్నిసెట్ చేయడం ఇదంతా మాస్ కోసమే.
బాగానే ఉంది కానీ ఇంతగా మహేష్ తెరమీద చుట్టలు, బీడీలు కాల్చి చాలా సంవత్సరాలయ్యింది. ఫ్యాన్స్ మాత్రం ఒకప్పటి పోకిరి రేంజ్ లో ఇందులో స్మోకింగ్ ఉంటుందని ఆశిస్తున్నారు. నిజానికి గుంటూరు కారం అందరూ అనుకున్నట్టు ఏదో కమర్షియల్ మాస్ మసాలా సినిమా కాదని యూనిట్ నుంచి వినిపిస్తున్న మాట. త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్ని అంశాలు పర్ఫెక్ట్ గా బ్యాలన్స్ చేసి మాస్, క్లాస్ ఎవరినీ వదిలిపెట్టకుండా అల వైకుంఠపురములో కంటే మూడింతలు ఎక్కువ ఎగ్జై టింగ్ కంటెంట్ ఉంటుందని ఊరిస్తున్నారు. అదే నిజమైతే సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి అంతకన్నా కావాల్సింది ఏముంటుంది.
ఫస్ట్ ఆడియో సింగల్ కి సంబంధించిన డేట్ మాత్రం ఇవ్వలేదు. కమింగ్ సూన్ అన్నారు తప్పించి స్పష్టంగా తేదీ లేదు. నవంబర్ నుంచి గుంటూరు కారం సందడి స్టార్ట్ అవుతుందని నిన్న తమన్ ట్వీట్ పెట్టాడు. అంటే మొదటివారం లేదా దీపావళి నుంచి నాన్ స్టాప్ ప్రమోషన్లు ప్లాన్ చేసుకున్నారు. జనవరి 12 విడుదల తేదీలో ఎలాంటి మార్పు ఉండబోవడం లేదు. ఆర్టిస్టులు డేట్లు సర్దుబాటు చేసి మరీ గుంటూరు కారం బృందానికి సహకరిస్తున్నారు. నాగవంశీ గతంలో చెప్పినట్టు దసరా లోపే పాటల చిత్రీకరణ పూర్తి చేస్తామన్నారు కానీ అది సాధ్యపడలేదు. టీజర్ దీపావళికి ఆశించవచ్చు.
This post was last modified on October 23, 2023 9:47 pm
తెలుగు దేశం పార్టీ నిర్వహించే పసుపు పండుగ మహానాడుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడపలో…
సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే త్రివిక్రమ్కు ఎంత అభిమానమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఒక సినీ వేడుకలో ఆయన సిరివెన్నెల గురించి…
హరిహర వీరమల్లు షూటింగ్ కు ముగింపుకొచ్చేసింది. సెట్స్ లో నిన్నటి నుంచి పవన్ కళ్యాణ్ హాజరు కావడంతో టీమ్ ఉత్సహంగా…
కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు చేస్తుందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్ ఫోర్స్మెంటు డైరెక్టరేట్(ఈడీ) పై సుప్రీంకోర్టు తాజాగా ఆగ్రహం వ్యక్తం చేసింది.…
కూటమి ప్రభుత్వం 11 మాసాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో సహజంగానే ప్రభుత్వం ఏం చేసిందన్న విషయంపై చర్చ జరుగుతుంది. అయితే..…
"మీ మీ బ్యాంకు ఖాతాలను మరోసారి అప్ డేట్ చేసుకోండి" అంటూ.. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్న దాతలకు సూచించింది.…