తెలుగులో తన మార్కెట్ బాగా దెబ్బ తినడం, తన కొత్త చిత్రం ‘చిన్నా’కు థియేటర్లు ఇవ్వకపోవడం గురించి ఈ సినిమా ప్రెస్ మీట్లో చాలా ఫీలయ్యాడు తమిళ హీరో సిద్దార్థ్. ఒకప్పుడు ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ లాంటి చిత్రాలతో అతను చూసిన వైభవం వేరు. అలాంటి హీరోకు ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. కానీ సినీ రంగంలో సక్సెస్ సాధించడం ఎంత కష్టమో.. దాన్ని నిలబెట్టుకోవడం అంతకంటే కష్టం.
తరుణ్, ఉదయ్ కిరణ్.. ఇలా చాలామంది హీరోలు మొదట్లో రైజ్ అయి తర్వాత కింద పడ్డ వాళ్లే. సిద్ధు కూడా ఆ కోవకు చెందిన వాడే. ఇక ‘చిన్నా’ గురించి చెబుతూ.. ఈ సినిమా చూశాక ఇది బాలేదు, సిద్ధును చూసేందుకు థియేటర్లకు రాము అని ప్రేక్షకులు చెబితే.. మళ్లీ తాను హైదరాబాద్కే రానని ఎమోషనల్గా, పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు సిద్ధు.
అతను అంత కాన్ఫిడెంట్గా చెప్పాడంటే ‘చిన్నా’లో ఏదో ఒక ప్రత్యేకత ఉందని అర్థమవుతంది. నిజానికి ‘చిన్నా’ చాలా మంచి సినిమా. ఇంకా చెప్పాలంటే గొప్ప సినిమా. పిల్లల మీద లైంగిక వేధింపుల నేపథ్యంలో చాలా ఇంటెన్స్గా ఈ సినిమా తీశారు. అదే సమయంలో థ్రిల్లర్ అంశాలతో సినిమా ఆసక్తికరంగా సాగుతుంది కూడా. తమిళంలో ‘చిత్తా’ పేరుతో రిలీజైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. కానీ తెలుగులో ఇంకో అరడజను సినిమాలతో పోటీ పడటం వల్ల ‘చిన్నా’ ప్రేక్షకుల దృష్టిలో పడలేదు.
సోషల్ మీడియాలో కూడా దీని గురించి పెద్దగా చర్చ జరగలేదు. చూసిన వాళ్లు బాగుందన్నప్పటికీ.. ఇదేదో డార్క్ మూవీ అన్నట్లుగా జనం దూరంగా ఉన్నారు. దీంతో ‘చిన్నా’ బాక్సాఫీస్ దగ్గర కనీస ప్రభావం కూడా చూపలేదు. గత సినిమాలతో మరీ నిరాశపరచడం కూడా సిద్ధును మన ఆడియన్స్ నమ్మకపోవడానికి ఒక కారణం కావచ్చు. ఈ సినిమాను పట్టించుకోకపోవడం సిద్ధును ఆవేదనకు గురి చేస్తుందనడంలో సందేహం లేదు. దీన్ని మనసుకు తీసుకున్నాడంటే.. రిలీజ్కు ముందు అన్నట్లే ఇక ఇటు వైపు రాకుండా ఆగిపోతాడేమో.
This post was last modified on October 14, 2023 7:22 pm
టాలీవుడ్ సినీ ప్రియులు అంత సులభంగా మర్చిపోలేని ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాల్లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఒకటి. సిద్దార్థ్, త్రిష జంటగా…
రాకా.. ప్రస్తుతం ఇండియాలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్లో ఒకటి. పుష్ప-2 లాంటి సెన్సేషనల్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్…
పదహారు సంవత్సరాల క్రితం 2010లో విడుదలైన డార్లింగ్ అంటే ప్రభాస్ అభిమానులకు ఒక స్పెషల్ ఎమోషన్. మాస్ ఫార్ములాకు దూరంగా…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళకు చెందిన నాలుగు నిర్మాతల మండళ్లు ఒక కొత్త సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. రాబోయే రోజుల్లో…
మన దగ్గర మిడ్ రేంజ్ హీరోల మీద వంద కోట్ల బడ్జెట్లు పెట్టేస్తున్నారు నిర్మాతలు. తీరా చూస్తే తెర మీద…
తెలుగు టీవీ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన షోగా జబర్దస్త్ను చెప్పొచ్చు. అందులో డబుల్ మీనింగ్లు, బాడీ షేమింగ్ల గురించి అభ్యంతరాలు…