చిరంజీవి అంటే.. మెగాస్టార్ చిరంజీవి కాదు. ఉత్తరాంధ్రలోని ఆముదాలవలస మాజీ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడు తమ్మినేని చిరంజీవి నాగ్. ప్రస్తుతం నియోజకవర్గంలో ఈయన గురించిన టాపిక్ పెద్దగానే సాగుతోంది. యువతను తనవైపు తిప్పుకోవడంలో బాగానే పనిచేస్తున్నారని అంటున్నారు. అంతేకాదు.. వైసీపీ నాయకులతోనూ కలివిడిగానే ఉంటున్నట్టు తెలుస్తోంది.
వచ్చే ఎన్నికల్లో ఆముదాలవలస నియోజకవర్గం నుంచి చిరంజీవి పోటీ చేయడం ఖాయమైందన్న ప్రచారం జరుగుతోంది. అయితే.. వైసీపీ పరంగా దీనిపై అధికారిక ప్రకటన అయితే ఇప్పటి వరకు రాలేదు. వాస్తవానికి 2024లోనే సీతారాం.. తన తనయుడికి టికెట్ ఇప్పించుకునేందుకు ప్రయత్నించారు. కానీ, పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో జగన్ ఆ మేరకు అవకాశం ఇవ్వలేదు. కానీ.. ఆ ఎన్నికల్లో కూటమి ప్రభావంతో వైసీపీ 11కు పరిమితం అయింది.
ఇక, వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తన కుమారుడిని నిలబెట్టాలన్నది సీతారాం ఆలోచనేకాదు.. నిర్ణయం కూడా. దీంతో వైసీపీ అధినేతను తాను ఒప్పించుకుంటానని గతంలోనే చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన ఇంటిపట్టునే ఉంటూ.. పార్టీ కార్యక్రమాల్లో కుమారుడి పాత్రను మరింత పెంచుతున్నారు. పార్టీ కార్యక్రమాలను చిరంజీవే నిర్వహిస్తున్నారు. పీపీపీ విధానంలో వైద్య శాలలను నిర్మించే విషయంపై జరిగిన నిరసనలోనూ ఆయన పాల్గొన్నారు.
పార్టీ తరఫున కార్యక్రమాల్లోనూ చిరంజీవి పాల్గొంటున్నారు. దీనికితోడు యువతను ఎక్కువగా ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ.. చిత్రం ఏంటంటే.. తనకు వరసకు బంధువయ్యే.. ఎమ్మెల్యే కూన రవికుమార్పై మాత్రం.. చిరంజీవిపై కూన ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు.
అంతా సైలెంట్గా సాగిపోతోంది. కొన్నాళ్ల కిందట వివాదంగామారిన కూన ఆడియో టేపు వ్యవహారం వెనుక చిరు ఉన్నారన్నది కూన వర్గం చెబుతున్న మాట. అంతకుమించి.. ఇరువురు కూడా బహిరంగ విమర్శలు చేసుకోవడం లేదు. కానీ, సైలెంట్గా చిరు పుంజుకుంటున్నారు. మరి ఆయన సక్సెస్ అవుతారా? లేదా? అనేది చూడాలి.
This post was last modified on March 4, 2026 3:42 pm
సినిమా నటులు ఎందరో రాజకీయ నాయకులయ్యారు. అయితే ప్రజల మనసులో బలమైన ముద్ర వేసిన వాళ్ళు మాత్రం కొందరే ఉంటారు.…
మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే సీ ఓటర్ చేసిన సర్వే తమిళనాడు టీవీకే, కాంగ్రెస్ కాపురం…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( SIR ) చిక్కుముడిగా మారింది.…
కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…
ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…