చిరంజీవి అంటే.. మెగాస్టార్ చిరంజీవి కాదు. ఉత్తరాంధ్రలోని ఆముదాలవలస మాజీ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడు తమ్మినేని చిరంజీవి నాగ్. ప్రస్తుతం నియోజకవర్గంలో ఈయన గురించిన టాపిక్ పెద్దగానే సాగుతోంది. యువతను తనవైపు తిప్పుకోవడంలో బాగానే పనిచేస్తున్నారని అంటున్నారు. అంతేకాదు.. వైసీపీ నాయకులతోనూ కలివిడిగానే ఉంటున్నట్టు తెలుస్తోంది.
వచ్చే ఎన్నికల్లో ఆముదాలవలస నియోజకవర్గం నుంచి చిరంజీవి పోటీ చేయడం ఖాయమైందన్న ప్రచారం జరుగుతోంది. అయితే.. వైసీపీ పరంగా దీనిపై అధికారిక ప్రకటన అయితే ఇప్పటి వరకు రాలేదు. వాస్తవానికి 2024లోనే సీతారాం.. తన తనయుడికి టికెట్ ఇప్పించుకునేందుకు ప్రయత్నించారు. కానీ, పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో జగన్ ఆ మేరకు అవకాశం ఇవ్వలేదు. కానీ.. ఆ ఎన్నికల్లో కూటమి ప్రభావంతో వైసీపీ 11కు పరిమితం అయింది.
ఇక, వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తన కుమారుడిని నిలబెట్టాలన్నది సీతారాం ఆలోచనేకాదు.. నిర్ణయం కూడా. దీంతో వైసీపీ అధినేతను తాను ఒప్పించుకుంటానని గతంలోనే చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన ఇంటిపట్టునే ఉంటూ.. పార్టీ కార్యక్రమాల్లో కుమారుడి పాత్రను మరింత పెంచుతున్నారు. పార్టీ కార్యక్రమాలను చిరంజీవే నిర్వహిస్తున్నారు. పీపీపీ విధానంలో వైద్య శాలలను నిర్మించే విషయంపై జరిగిన నిరసనలోనూ ఆయన పాల్గొన్నారు.
పార్టీ తరఫున కార్యక్రమాల్లోనూ చిరంజీవి పాల్గొంటున్నారు. దీనికితోడు యువతను ఎక్కువగా ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ.. చిత్రం ఏంటంటే.. తనకు వరసకు బంధువయ్యే.. ఎమ్మెల్యే కూన రవికుమార్పై మాత్రం.. చిరంజీవిపై కూన ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు.
అంతా సైలెంట్గా సాగిపోతోంది. కొన్నాళ్ల కిందట వివాదంగామారిన కూన ఆడియో టేపు వ్యవహారం వెనుక చిరు ఉన్నారన్నది కూన వర్గం చెబుతున్న మాట. అంతకుమించి.. ఇరువురు కూడా బహిరంగ విమర్శలు చేసుకోవడం లేదు. కానీ, సైలెంట్గా చిరు పుంజుకుంటున్నారు. మరి ఆయన సక్సెస్ అవుతారా? లేదా? అనేది చూడాలి.
This post was last modified on March 4, 2026 3:42 pm
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…
రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…