కోలీవుడ్ టాప్ స్టార్ విజయ్ కొత్త సినిమా ‘లియో’పై తమిళనాట హైప్ మామూలుగా లేదు. ఈ చిత్రం రాజకీయంగా కూడా కొంత వేడి పుట్టించింది. భారీ స్థాయిలో నిర్వహించాలనుకున్న ఆడియో వేడుక రద్దు కావడం చర్చనీయాంశంగా మారింది. అభిమానులను నియంత్రించలేకే ఈ వేడుకను రద్దు చేసినట్లు నిర్మాత ప్రకటించినప్పటికీ.. ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉండటం వల్లే దీనికి బ్రేక్ పడిందనే సందేహాలు వ్యక్తమయ్యాయి.
మరోవైపు ‘లియో’కు తెల్లవారు జాము నుంచే స్పెషల్ షోలు వేయాలని చూస్తే ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోవడం కూడా చర్చనీయాంశం అయింది. త్వరలో విజయ్ రాజకీయాల్లోకి రావొచ్చన్న అంచనాల నేపథ్యంలో అతడి సినిమాకు అడ్డంకులు సృష్టించే ఉద్దేశంతోనే స్టాలిన్ సర్కారు వాటికి అనుమతులు ఇవ్వట్లేదని అభిమానులు అనుమానాలు వ్యక్తం చేశారు సామాజిక మాధ్యమాల్లో.
విజయ్ సినిమా రిలీజవుతుంటే ఉదయం 9 గంటలకు షో చూడటమేంటి అని వారిలో తీవ్ర అసహనం వ్యక్తమైంది. ఐతే మధ్యలో ఏం జరిగిందో ఏమో కానీ.. ‘లియో’ స్పెషల్ షోలకు ఇప్పుడు అనుమతులు వచ్చేశాయి. ‘లియో’ టీం గవర్నరుకు కూడా లేఖ రాసిందని, ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేసిందని.. దీంతో స్పెషల్ షోలకు అనుమతులు వచ్చాయని అంటున్నారు.
ఎలా సాధిస్తేనేం.. స్పెషల్ షోలకు అనుమతులు అయితే వచ్చేశాయి. తెల్లవారుజామున 4 గంటలకే షోలు పడిపోతున్నాయి. దీంతో విజయ్ అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. ఈ సినిమాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా థియేటర్ల దగ్గర సందడి మామూలుగా ఉండదు. స్పెషల్ షోల వల్ల ఓపెనింగ్స్ కూడా రికార్డు స్థాయిలో వస్తాయని భావిస్తున్నారు. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే.. ‘జైలర్’ వసూళ్లను కూడా ఇది దాటేస్తుందని విజయ్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on October 12, 2023 8:47 am
ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…
ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో…
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్రతిపక్ష నాయకులు…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి ప్రాంతాల్లో చెలరేగిన హింసపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం…