కోలీవుడ్ టాప్ స్టార్ విజయ్ కొత్త సినిమా ‘లియో’పై తమిళనాట హైప్ మామూలుగా లేదు. ఈ చిత్రం రాజకీయంగా కూడా కొంత వేడి పుట్టించింది. భారీ స్థాయిలో నిర్వహించాలనుకున్న ఆడియో వేడుక రద్దు కావడం చర్చనీయాంశంగా మారింది. అభిమానులను నియంత్రించలేకే ఈ వేడుకను రద్దు చేసినట్లు నిర్మాత ప్రకటించినప్పటికీ.. ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉండటం వల్లే దీనికి బ్రేక్ పడిందనే సందేహాలు వ్యక్తమయ్యాయి.
మరోవైపు ‘లియో’కు తెల్లవారు జాము నుంచే స్పెషల్ షోలు వేయాలని చూస్తే ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోవడం కూడా చర్చనీయాంశం అయింది. త్వరలో విజయ్ రాజకీయాల్లోకి రావొచ్చన్న అంచనాల నేపథ్యంలో అతడి సినిమాకు అడ్డంకులు సృష్టించే ఉద్దేశంతోనే స్టాలిన్ సర్కారు వాటికి అనుమతులు ఇవ్వట్లేదని అభిమానులు అనుమానాలు వ్యక్తం చేశారు సామాజిక మాధ్యమాల్లో.
విజయ్ సినిమా రిలీజవుతుంటే ఉదయం 9 గంటలకు షో చూడటమేంటి అని వారిలో తీవ్ర అసహనం వ్యక్తమైంది. ఐతే మధ్యలో ఏం జరిగిందో ఏమో కానీ.. ‘లియో’ స్పెషల్ షోలకు ఇప్పుడు అనుమతులు వచ్చేశాయి. ‘లియో’ టీం గవర్నరుకు కూడా లేఖ రాసిందని, ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేసిందని.. దీంతో స్పెషల్ షోలకు అనుమతులు వచ్చాయని అంటున్నారు.
ఎలా సాధిస్తేనేం.. స్పెషల్ షోలకు అనుమతులు అయితే వచ్చేశాయి. తెల్లవారుజామున 4 గంటలకే షోలు పడిపోతున్నాయి. దీంతో విజయ్ అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. ఈ సినిమాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా థియేటర్ల దగ్గర సందడి మామూలుగా ఉండదు. స్పెషల్ షోల వల్ల ఓపెనింగ్స్ కూడా రికార్డు స్థాయిలో వస్తాయని భావిస్తున్నారు. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే.. ‘జైలర్’ వసూళ్లను కూడా ఇది దాటేస్తుందని విజయ్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on October 12, 2023 8:47 am
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…