తమిళంలో గత దశాబ్ద కాలంలో వచ్చిన బెస్ట్ డ్రామా థ్రిల్లర్లలో జిగర్ తండ ఒకటి. ఇందులో కథ.. స్క్రీన్ ప్లే, పాత్రలు.. అన్నీ కూడా వేరే లెవెల్ అన్నట్లుంటాయి. కథలో వైవిధ్యంతోనే ప్రేక్షకులను ఆద్యంతం అలరిస్తూ సరికొత్త స్టయిల్లో సినిమాను నడిపించాడు కార్తీక్ సుబ్బరాజ్. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకాదరణ కూడా బాగానే పొందింది. తర్వాత ఈ సినిమాను తెలుగులో గద్దలకొండ గణేష్గా రీమేక్ చేశారు. హిందీలో కూడా ఇది రీమేక్ అయింది. జిగర్తండతో తనపై భారీగా పెరిగిన అంచనాలను కార్తీక్ సుబ్బరాజ్ అందుకోలేకపోయాడు.
దానికి సాటి వచ్చే సినిమా ఏదీ తీయలేకపోయాడు. ఇప్పుడు అతను జిగర్ తండ సీక్వెల్తో రాబోతున్నాడు. దాని పేరు.. జిగర్తండ డబుల్ ఎక్స్ఎల్. ఈ చిత్రం దీపావళి కానుకగా తెలుగులో కూడా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ప్రెస్మీట్కు హాజరైన దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్.. ఈ సినిమా కాస్టింగ్కు సంబంధించి ఒక ఆసక్తికర విషయం వెల్లడించాడు. ఇందులో ఎస్.జె.సూర్య చేసిన దర్శకుడి పాత్రకు ఒక దశలో మన నవీన్ పొలిశెట్టిని అనుకున్నాడట. ముందు సూర్యనే ఈ పాత్ర కోసం అడగ్గా అతను చేయనన్నాడట.
దీంతో నవీన్ను సంప్రదించాడట కార్తీక్. అతడితో కొన్ని రోజులు సంప్రదింపులు కూడా జరిగినట్లు కార్తీక్ వెల్లడించాడు. కానీ నవీన్ డేట్లు సర్దుబాటు కాకపోవడంతో వేరే ఆప్షన్ చూడాల్సి వచ్చిందన్నాడు. తర్వాత నిర్మాత కార్తికేయన్ ద్వారా సూర్యను మరోసారి సంప్రదించి.. ఈ పాత్రకు ఒప్పించి సినిమా చేయించినట్లు కార్తీక్ వెల్లడించాడు. జిగర్తండా లాంటి క్రేజీ మూవీ సీక్వెల్కు నవీన్ను అడిగారంటే అది విశేషమే. నవీన్ నటించి ఉంటే తెలుగులో ఈ సినిమాకు మాంచి క్రేజే వచ్చేదేమో. ఐతే ఎస్.జె.సూర్యకు కూడా తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది.
This post was last modified on October 11, 2023 8:51 am
కూటమిలో మూడు పార్టీలు.. విభిన్నమైన భావజాలం.. అయినా ఏకతాటిపై నడుస్తున్నాయి. దానికి కారణం రాష్ట్రం బాగుండాలనే సదుద్దేశమే అని పార్టీల…
రివ్యూస్, పబ్లిక్ టాక్ బాగున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయిన ఆంధ్రకింగ్ తాలూకా రెండో వారం నుంచి పికప్ ఆశిస్తున్నామని…
బహుశా బాలకృష్ణ కెరీర్ లోనే ఇది మొదటిసారని చెప్పొచ్చు. ఇంకో రెండు మూడు గంటల్లో షోలు ప్రారంభమవుతాయని అభిమానులు ఎదురు…
నిర్మాతలకు వచ్చే ఆర్థిక చిక్కులు పెద్ద రిలీజులను ఎంత ఇబ్బంది పెడతాయో అఖండ 2 విషయంలో చూస్తున్నాం. అయితే ఇలాంటి…
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…