అంతా అనుకున్న ప్రకారం జరిగితే.. సలార్ ఈపాటి థియేటర్లలో ఆడుతుండాల్సింది. క్రిస్మస్ సీజన్లో సైంధవ్, హాయ్ నాన్న, ఎక్స్ట్రా సినిమాలు రిలీజ్ కావాల్సింది. కానీ సలార్ సెప్టెంబరు 28 నుంచి వాయిదా పడటం.. క్రిస్మస్ కానుకగా ఆ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు కొత్త ప్రకటన రావడంతో అంతా గందరగోళంగా తయారైంది. క్రిస్మస్ సినిమాలన్నీ కొత్త డేట్లు చూసుకోక తప్పలేదు.
వాటిలో సైంధవ్ సంక్రాంతికి ఫిక్సయింది. ఎక్స్ట్రా డిసెంబరు 8న రిలీజ్ కాబోతున్నట్లు కొత్త డేట్ ఇచ్చారు. ఇక తేలాల్సింది నాని సినిమా విషయమే. కానీ రకరకాల ఆప్షన్లు చూస్తూ టీం ఇంకా డేట్ ఇవ్వలేదు. ఆ చిత్ర బృందం ఎక్కువగా పరిశీలించిన డేట్ డిసెంబరు 8. కానీ ఆ డేట్కు ఇప్పుడు పోటీ తీవ్రంగా మారింది. ఆల్రెడీ వరుణ్ తేజ్ పాన్ ఇండియా మూవీ ఆపరేషన్ వాలెంటైన్ డిసెంబరు రెండో వారంలోనే రాబోతోంది.
ఇక విశ్వక్సేన్ సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని కూడా ఆ వీకెండ్కే ఫిక్స్ చేశారు. తాజాగా నితిన్ మూవీ కూడా ఆ వారాంతపు రేసులోకే వచ్చింది. మూడు సినిమాలకు మించి అక్కడ స్పేస్ లేనట్లే. మరి నాని సినిమా పరిస్థితి ఏంటన్నదే తెలియట్లేదు. డిసెంబరు మూడో వారంలో కెప్టెన్ మిల్లర్ వస్తోంది. పైగా క్రిస్మస్ వీకెండ్ ముందు రావడం అంత మంచిది కాదు.
అలా అని క్రిస్మస్కు, సంక్రాంతికి మధ్యలో వచ్చినా ప్రేక్షకుల దృష్టిలో పడటం కష్టమే. ఇవేవీ కాదనుకుంటే వేసవే శరణ్యం. అది మరీ ఆలస్యం అయిపోతుంది. అందుకే డిసెంబరు రెండో వారం మీదే ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. హాయ్ నాన్న ఆ వారాంతానికే ఫిక్సయితే.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి డేట్ మారొచ్చని అంటున్నారు. లేదంటే మాత్రం నాలుగు సినిమాలకు థియేటర్లు సర్దుబాటు చేయడం చాలా కష్టమవుతుంది.
This post was last modified on October 9, 2023 10:42 pm
భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టింది నేనే, గుమ్మడికాయ కట్టింది నేనే అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే.…
నేచురల్ స్టార్ నాని కేవలం నటుడిగానే కాకుండా 'వాల్ పోస్టర్ సినిమా' బ్యానర్పై నిర్మాతగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన…
టాలీవుడ్లో మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో క్రిష్ ఒకడు. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్లో క్రిష్ ఎన్నడూ రొటీన్ సినిమా…
మంచి టాలెంట్ ఉన్న యంగ్ జనరేషన్ దర్శకులు కెరీర్ ప్రారంభంలో హిట్లు అందుకున్నప్పటికీ దాన్ని నిలబెట్టుకునే క్రమంలో, కథల ఎంపికలో…
స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని సినిమాల్లో చూడటమే కానీ నిజ జీవితంలో దాన్ని ఆచరించే వాళ్ళను వేళ్ళ మీద…
ఒక జడ్జి ప్రజల్ని చీమలతో పోల్చితో మరొకరు నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చడం దేశ ప్రజలను విస్మయానికి గురి చేసింది. దాని…