అంతా అనుకున్న ప్రకారం జరిగితే.. సలార్ ఈపాటి థియేటర్లలో ఆడుతుండాల్సింది. క్రిస్మస్ సీజన్లో సైంధవ్, హాయ్ నాన్న, ఎక్స్ట్రా సినిమాలు రిలీజ్ కావాల్సింది. కానీ సలార్ సెప్టెంబరు 28 నుంచి వాయిదా పడటం.. క్రిస్మస్ కానుకగా ఆ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు కొత్త ప్రకటన రావడంతో అంతా గందరగోళంగా తయారైంది. క్రిస్మస్ సినిమాలన్నీ కొత్త డేట్లు చూసుకోక తప్పలేదు.
వాటిలో సైంధవ్ సంక్రాంతికి ఫిక్సయింది. ఎక్స్ట్రా డిసెంబరు 8న రిలీజ్ కాబోతున్నట్లు కొత్త డేట్ ఇచ్చారు. ఇక తేలాల్సింది నాని సినిమా విషయమే. కానీ రకరకాల ఆప్షన్లు చూస్తూ టీం ఇంకా డేట్ ఇవ్వలేదు. ఆ చిత్ర బృందం ఎక్కువగా పరిశీలించిన డేట్ డిసెంబరు 8. కానీ ఆ డేట్కు ఇప్పుడు పోటీ తీవ్రంగా మారింది. ఆల్రెడీ వరుణ్ తేజ్ పాన్ ఇండియా మూవీ ఆపరేషన్ వాలెంటైన్ డిసెంబరు రెండో వారంలోనే రాబోతోంది.
ఇక విశ్వక్సేన్ సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని కూడా ఆ వీకెండ్కే ఫిక్స్ చేశారు. తాజాగా నితిన్ మూవీ కూడా ఆ వారాంతపు రేసులోకే వచ్చింది. మూడు సినిమాలకు మించి అక్కడ స్పేస్ లేనట్లే. మరి నాని సినిమా పరిస్థితి ఏంటన్నదే తెలియట్లేదు. డిసెంబరు మూడో వారంలో కెప్టెన్ మిల్లర్ వస్తోంది. పైగా క్రిస్మస్ వీకెండ్ ముందు రావడం అంత మంచిది కాదు.
అలా అని క్రిస్మస్కు, సంక్రాంతికి మధ్యలో వచ్చినా ప్రేక్షకుల దృష్టిలో పడటం కష్టమే. ఇవేవీ కాదనుకుంటే వేసవే శరణ్యం. అది మరీ ఆలస్యం అయిపోతుంది. అందుకే డిసెంబరు రెండో వారం మీదే ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. హాయ్ నాన్న ఆ వారాంతానికే ఫిక్సయితే.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి డేట్ మారొచ్చని అంటున్నారు. లేదంటే మాత్రం నాలుగు సినిమాలకు థియేటర్లు సర్దుబాటు చేయడం చాలా కష్టమవుతుంది.
This post was last modified on October 9, 2023 10:42 pm
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…