బొమ్మరిల్లు సిద్దార్థ్ ఎంతో ప్రత్యేకంగా ప్రమోట్ చేసుకున్న సినిమా చిన్నా. ఇలాంటి మంచి చిత్రం తన జీవితంలో తీయలేదని పదే పదే చెప్పుకొచ్చాడు. హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భావోద్వేగానికి గురవ్వడం అభిమానులను కదిలించింది. అయితే శుక్రవారం నెలకొన్న విపరీతమైన పోటీ వల్ల చిన్నాకు సరైన ఓపెనింగ్స్ దక్కలేదు. తమిళంలో ఒక వారం ముందే రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఇక్కడ మెల్లగా పికప్ అవుతుందనే అంచనాలతో నిర్మాతలున్నారు. మరి ఇలాంటి వాతావరణంలో వచ్చిన చిన్నా చెప్పుకున్నంత రేంజ్ లో ఉన్నాడా లేదానేది చూద్దాం.
మునిసిపల్ ఆఫీస్ లో పని చేసే ఈశ్వర్(సిద్దార్థ్)కు అన్న కూతురు చిట్టి(సహస్ర శ్రీ)అంటే ప్రాణం. ఆ పాప స్నేహితురాలు మున్ని(సబియా తస్నీమ్)ని సైతం అంతే అభిమానంగా చూస్తుంటాడు. ఓసారి మున్ని మీద లైంగిక దాడి జరిగి ఆ నేరం కాస్త ఈశ్వర్ మీదకు వస్తుంది. ప్రియురాలు(నిమిషా నజయన్)కూడా అపార్థం చేసుకుంటుంది. బెయిలు మీద బయటికి వచ్చాక చిట్టి కనిపించకుండా పోతుంది. దీంతో వెర్రెత్తిపోయిన ఈశ్వర్ పోలీసుల మీద ఆధారపడకుండా తనే స్వయంగా వెతకడం మొదలుపెడతాడు. ఈ క్రమంలో అనూహ్యమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి.
చాలా సెన్సిటివ్ పాయింట్ ని తీసుకున్న దర్శకుడు అరుణ్ కుమార్ అంతే సున్నితంగా కథనం ఎలాంటి పక్కదారి పట్టకుండా చిన్నాని రూపొందించాడు. ఇంట్లో చిన్న పిల్లలున్న తల్లితండ్రులకు బలంగా కనెక్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ లో హంతకుడిని పట్టుకునే వైనం, చివరి ట్విస్టు మనం ఎంతో గొప్పగా ఆశిస్తాం కానీ అంత స్థాయిలో లేవు. అయినా సరే ఇప్పటి సమాజానికి కావాల్సిన ఓ ముఖ్యమైన సందేశాన్ని ఇవ్వడంలో టీమ్ సక్సెస్ అయ్యింది. కాకపోతే ఇలాంటి హార్డ్ హిట్టింగ్ డ్రామాలు తమిళ ఆడియన్స్ కి కనెక్ట్ అయినంతగా తెలుగు ప్రేక్షకులకు ఏ మేరకు రీచ్ అవుతాయనే దాన్ని బట్టే సక్సెస్ ఫెయిల్యూర్ ఆధారపడి ఉంది.
This post was last modified on October 6, 2023 10:41 pm
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…