ఒక్కో దర్శకుడికి ఒక్కో హీరోయిన్ మీద బాగా గురి కుదురుతుంది. అలా కుదిరిన వాళ్లతో వరుసగా సినిమాలు చేస్తుంటారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రత్యేక అభిమానం చూపించే హీరోయిన్ ఎవరంటే.. మరో మాట లేకుండా పూజా హెగ్డే పేరు చెప్పేయొచ్చు.
ఒక లైలా కోసం, ముకుంద లాంటి మీడియం రేంజి సినిమాలు చేసి బాలీవుడ్కు వెళ్లిపోయిన పూజాను ఏరి కోరి ఎంచుకుని ‘దువ్వాడ జగన్నాథం’ లాంటి భారీ చిత్రంలో అల్లు అర్జున్ సరసన కథానాయికను చేసి తన కెరీర్ను మలుపు తిప్పింది హరీషే.
ఆ సినిమా అనుకున్నంతగా ఆడకపోయినా పూజ కెరీర్కు మాత్రం ఢోకా లేకపోయింది. వరుసగా పెద్ద స్టార్ల సరసన భారీ చిత్రాలతో దూసుకెళ్లింది. ఇప్పుడు టాలీవుడ్ నంబర్ వన్ హీరోయిన్ పూజానే అనే విషయంలో మరో మాట లేదు.
ఆల్రెడీ మహేష్ బాబు లాంటి టాప్ స్టార్తో నటించిన పూజా.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సరసన అవకాశం అందుకున్నట్లు సమాచారం. ఆమెను పవన్ పక్కన నటింపజేస్తున్నది హరీషే కావడం విశేషం. ప్రస్తుతం ‘వకీల్ సాబ్’తో పాటు క్రిష్ సినిమా చేస్తున్న పవన్.. దీని తర్వాత హరీష్ దర్శకత్వంలో నటించనున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రానికి ఇప్పటికే కథ కూడా రెడీ చేశాడు హరీష్. పవన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తే అప్పుడు షూటింగ్ మొదలుపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ‘డీజే’ తర్వాత హరీష్ నటించిన ‘గద్దలకొండ గణేష్’లోనూ పూజా ప్రత్యేక పాత్రలో నటించింది. ఇప్పుడు పవన్ సినిమాకు కూడా ఆమెనే కథానాయికగా ఎంచుకుని హ్యాట్రిక్ సినిమా చేయడానికి రెడీ అయిపోయాడట హరీష్.
తన కెరీర్ను మలుపు తిప్పిన హరీష్ శంకర్ డైరెక్షన్, పైగా పవన్ కళ్యాణ్ హీరో అంటే ఈ అవకాశాన్ని పూజా ఎందుకు వదులుకుంటుంది? ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న సంగతి తెలిసిందే.
This post was last modified on August 25, 2020 1:44 pm
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్పై ఒంటికాలిపై లేచిన…
డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…
సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుల్లో శంకర్, మురుగదాస్ పేర్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎందుకంటే…
‘టాక్సిక్’ వచ్చిన తర్వాత ‘ఇరుముడి’ రన్ మీద ప్రభావం తప్పదేమో అని డౌట్ ఉండేది. పెద్ద పాన్ ఇండియా సినిమా…
సుప్రసిద్ధ గాయని ఏంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీసేందుకు నిర్మాత బన్నీ వాస్, అల్లు అరవింద్, రాక్…