ఒక్కో దర్శకుడికి ఒక్కో హీరోయిన్ మీద బాగా గురి కుదురుతుంది. అలా కుదిరిన వాళ్లతో వరుసగా సినిమాలు చేస్తుంటారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రత్యేక అభిమానం చూపించే హీరోయిన్ ఎవరంటే.. మరో మాట లేకుండా పూజా హెగ్డే పేరు చెప్పేయొచ్చు.
ఒక లైలా కోసం, ముకుంద లాంటి మీడియం రేంజి సినిమాలు చేసి బాలీవుడ్కు వెళ్లిపోయిన పూజాను ఏరి కోరి ఎంచుకుని ‘దువ్వాడ జగన్నాథం’ లాంటి భారీ చిత్రంలో అల్లు అర్జున్ సరసన కథానాయికను చేసి తన కెరీర్ను మలుపు తిప్పింది హరీషే.
ఆ సినిమా అనుకున్నంతగా ఆడకపోయినా పూజ కెరీర్కు మాత్రం ఢోకా లేకపోయింది. వరుసగా పెద్ద స్టార్ల సరసన భారీ చిత్రాలతో దూసుకెళ్లింది. ఇప్పుడు టాలీవుడ్ నంబర్ వన్ హీరోయిన్ పూజానే అనే విషయంలో మరో మాట లేదు.
ఆల్రెడీ మహేష్ బాబు లాంటి టాప్ స్టార్తో నటించిన పూజా.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సరసన అవకాశం అందుకున్నట్లు సమాచారం. ఆమెను పవన్ పక్కన నటింపజేస్తున్నది హరీషే కావడం విశేషం. ప్రస్తుతం ‘వకీల్ సాబ్’తో పాటు క్రిష్ సినిమా చేస్తున్న పవన్.. దీని తర్వాత హరీష్ దర్శకత్వంలో నటించనున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రానికి ఇప్పటికే కథ కూడా రెడీ చేశాడు హరీష్. పవన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తే అప్పుడు షూటింగ్ మొదలుపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ‘డీజే’ తర్వాత హరీష్ నటించిన ‘గద్దలకొండ గణేష్’లోనూ పూజా ప్రత్యేక పాత్రలో నటించింది. ఇప్పుడు పవన్ సినిమాకు కూడా ఆమెనే కథానాయికగా ఎంచుకుని హ్యాట్రిక్ సినిమా చేయడానికి రెడీ అయిపోయాడట హరీష్.
తన కెరీర్ను మలుపు తిప్పిన హరీష్ శంకర్ డైరెక్షన్, పైగా పవన్ కళ్యాణ్ హీరో అంటే ఈ అవకాశాన్ని పూజా ఎందుకు వదులుకుంటుంది? ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న సంగతి తెలిసిందే.
This post was last modified on August 25, 2020 1:44 pm
తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ కెరీర్ మంచి ఊపులో ఉండగానే.. బాలీవుడ్ నిర్మాత జాకీ…
టిడిపి తరఫున బలమైన గళం వినిపించే వారి కోసం పార్టీలో వెతుకుతున్నారు. వివాదరహితంగా పార్టీ పరంగా ప్రజలకు సంక్షేమ పథకాలు…
బాలీవుడ్లో వచ్చిన కల్ట్ బ్లాక్ బస్టర్ విక్కీ డోనర్ చూసిన ప్రేక్షకులు ఎవ్వరూ అందులో డాక్టర్ గా కీలక పాత్ర…
ఆరేళ్ల ముందు కొవిడ్ టైంలో థియేటర్లు మూతపడడంతో.. ఆ ఖాళీని భర్తీ చేయడం కోసం ఒక్కసారిగా ఓటీటీలు విజృంభించేశాయి. ఫిలిం…
వైసీపీ సీనియర్ నాయకుడు, ప్రస్తుతం శాసన మండలి చైర్మన్గా ఉన్న మోషేన్ రాజుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టే అంశంపై…
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై అదే పార్టీకి చెందిన సీనియర్లు గుర్రుగా ఉన్న నేపథ్యంలో అనేక ఫిర్యాదులు అధిష్టానానికి చేరుతున్నాయి. ముఖ్యంగా…