Movie News

రన్బీర్ యష్ సాయిపల్లవితో రామాయణం

ఆదిపురుష్ దెబ్బకు మళ్ళీ ఎవరు రామాయణం జోలికి వెళ్లరేమో అనుకుంటున్న టైంలో బాలీవుడ్ లో మాత్రం ఆ దిశగా పెద్ద అడుగులే పడుతున్నాయి. రన్బీర్ కపూర్ రాముడిగా దర్శకుడు నితేష్ తివారి మూడు భాగాల భారీ ప్యాన్ ఇండియా మూవీని ప్లాన్ చేస్తున్నట్టు ముంబై అప్డేట్. ఈ వార్త గతంలోనే వచ్చినప్పటికీ సీతగా అలియా భట్ నటించేందుకు సుముఖత చూపించడంతో ఈ ప్రాజెక్టు ఆగుతుందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఆ స్థానంలో తాజాగా సాయిపల్లవి వచ్చి చేరడంతో ప్రీ ప్రొడక్షన్ పనులు వేగమందుకున్నట్టు తెలిసింది. ఇంకో రెండు నెలల్లో షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు.

అసలు ట్విస్టు ఇది కాదు. రావణాసురుడిగా నటించేందుకు కెజిఎఫ్ ఫేమ్ యష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం. ఫస్ట్ పార్ట్ కోసం పదిహేను రోజులు కాల్ షీట్స్ ఇచ్చి రెండో భాగంలో తన పాత్ర కీలకం కాబట్టి అప్పుడు ఎక్కువ డేట్స్ ఇచ్చేలా అంగీకారం కుదిరిందట. రామసీత అనుబంధాన్ని ముందు ఎస్టాబ్లిష్ చేసి ఆ తర్వాత దశకంఠుడి ఎంట్రీని క్లైమాక్స్ లో చూపించి సీక్వెల్ నుంచి యష్ మీద ఎక్కువ కథ నడిచేలా కథను రాసుకున్నట్టు వినికిడి. అయితే ఇమేజ్ దృష్ట్యా యష్ దీనికి ఒప్పుకుంటాడో లేదోననే సందేహాలు చాలా తలెత్తినా ఫైనల్ గా ఎస్ చెప్పడం అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది.

బడ్జెట్ ఎంతనేది చెప్పలేదు కానీ ఇండియన్ స్క్రీన్ మీద ఇంతవరకు ఎవరూ ఖర్చు పెట్టనంత మొత్తం ఉంటుందని అంటున్నారు. ఈ ముగ్గురి రెమ్యునరేషన్లు కూడా అంతే స్థాయిలో ఉంటాయట. మళ్ళీ వేరొకరు రామాయణం తీసే సాహసం చేయలేనంత అద్భుతంగా నితేష్ తివారి ప్లాన్ చేసినట్టుగా నార్త్ మీడియా తెగ ఊదరగొడుతోంది. అయితే వందల సార్లు చూసేసిన రాముడి గాథ మరోసారి గొప్పగా చూపించడమంటే కత్తి మీద సామే. అయినా ఇంత రిస్క్ కు సిద్ధపడటం చూస్తే స్క్రిప్ట్ బలంగా రాసుకున్నట్టు ఉన్నారు. ఇతర తారాగణం, సాంకేతిక వర్గం వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. 

This post was last modified on October 3, 2023 11:46 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బీఆర్ఎస్ తో పొత్తు.. మౌనం వీడిన బీజేపీ

బీఆర్ఎస్ తో బీజేపీకి చీకటి పొత్తు ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తుంటారు. అయితే, బీజేపీతో కాంగ్రెస్ చీకటి ఒప్పందం చేసుకుందని…

15 minutes ago

పెద్దావిడ ఖాతాలో 50 కోట్ల బ్లాక్ బస్టర్

కాదేది కంటెంట్ కు అనర్హం అంటారు సినీ పెద్దలు. ఇది అక్షరాలా నిజం. డిజిటల్ యుగంలో కేవలం స్టార్ ఎలివేషన్లతోనే…

56 minutes ago

సడన్ ఎంట్రీ ఇవ్వనున్న జన నాయకుడు ?

సెన్సార్ వివాదం వల్ల మూడు నెలలుగా వాయిదా పర్వంలో నలిగిపోతున్న జన నాయకుడు విడుదల కోసం నిర్మాత శతవిధాలా ప్రయత్నాలు…

2 hours ago

ప్రపంచకప్.. భారత్ ఖాతాలో ఎవరికీ సాధ్యం కాని రికార్డులు!

అహ్మదాబాద్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడించి భారత్ విశ్వవిజేతగా నిలిచింది. ఈ…

3 hours ago

పెద్ది బిజినెస్ టార్గెట్ అంత భారీగానా

ఏప్రిల్ 30 విడుదల కాబోతున్న పెద్ది బిజినెస్ వ్యవహారాలు ఊపందుకున్నాయి. రెండు పాటలు ఛార్ట్ బస్టర్ కావడం, టీజర్ సంచలనం…

9 hours ago

ఆ దర్శకుడికి ఛాన్సిచ్చేదెవరు?

అనుదీప్ కేవీ.. ఐదేళ్ల ముందు ఈ పేరు ఒక సంచలనం. కొవిడ్ వల్ల కళ తప్పిన థియేటర్లలో సందడి తీసుకొచ్చి,…

11 hours ago