తెలంగాణ రాజకీయాలలో ఓటుకు నోటు కేసు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఓటుకు నోటు వ్యవహారంలో అప్పటి టీడీపీ నేత, ఇప్పటి టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇదే కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు పేరు కూడా బలంగా వినిపించడం సంచలనం రేపింది. అయితే, ఆ కేసు చాలా కాలంగా కోల్డ్ స్టోరేజిలో ఉండిపోయింది. తెలంగాణలో శాసనసభ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో తాజాగా ఆ కేసుకు సంబంధించి కీలక పరిణామం జరిగింది.
ఓటుకు నోటు కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రాదంటూ సుప్రీంకోర్టులో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేయడం సంచలనం రేపింది. ఇదే విషయంపై గతంలో రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. తాజాగా ఆ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు దానిని కొట్టివేసింది. ఇక, ఇదే కేసులో సండ్ర వెంకటవీరయ్య వేసిన పిటిషన్పై విచారణను డిసెంబర్ 4కు దేశపు అత్యున్నత న్యాయస్థానం వాయిదా వేసింది.
2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు నోటు వ్యవహారం సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి మద్దతివ్వాలంటూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ వద్దకు రేవంత్ రెడ్డి వెళ్లి రూ.50 లక్షలు ఇవ్వజూపారని ఆరోపణలు వచ్చిన వీడియో అప్పట్లో వైరల్ అయింది. ఆ కేసులో రేవంత్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
This post was last modified on October 3, 2023 10:55 pm
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…