తెలంగాణ రాజకీయాలలో ఓటుకు నోటు కేసు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఓటుకు నోటు వ్యవహారంలో అప్పటి టీడీపీ నేత, ఇప్పటి టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇదే కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు పేరు కూడా బలంగా వినిపించడం సంచలనం రేపింది. అయితే, ఆ కేసు చాలా కాలంగా కోల్డ్ స్టోరేజిలో ఉండిపోయింది. తెలంగాణలో శాసనసభ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో తాజాగా ఆ కేసుకు సంబంధించి కీలక పరిణామం జరిగింది.
ఓటుకు నోటు కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రాదంటూ సుప్రీంకోర్టులో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేయడం సంచలనం రేపింది. ఇదే విషయంపై గతంలో రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. తాజాగా ఆ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు దానిని కొట్టివేసింది. ఇక, ఇదే కేసులో సండ్ర వెంకటవీరయ్య వేసిన పిటిషన్పై విచారణను డిసెంబర్ 4కు దేశపు అత్యున్నత న్యాయస్థానం వాయిదా వేసింది.
2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు నోటు వ్యవహారం సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి మద్దతివ్వాలంటూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ వద్దకు రేవంత్ రెడ్డి వెళ్లి రూ.50 లక్షలు ఇవ్వజూపారని ఆరోపణలు వచ్చిన వీడియో అప్పట్లో వైరల్ అయింది. ఆ కేసులో రేవంత్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
This post was last modified on October 3, 2023 10:55 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…