అందరూ డిసెంబర్ మూడో వారంలో సలార్, డుంకీ పోటీ మీదే దృష్టి పెడుతున్నారు కానీ దానికి ముందు వెనుకా ఇతర విషయాలు బోలెడున్నాయి. అదే నెల 15 ధనుష్ ప్యాన్ ఇండియా మూవీ కెప్టెన్ మిల్లర్ ని విడుదల చేస్తామని ఎప్పుడో ఆగస్ట్ లోనే ప్రకటించారు. అప్పటికి షారుఖ్ ఖాన్ వస్తున్న విషయం మాత్రమే కన్ఫర్మ్ అయ్యింది. బాలీవుడ్ మూవీ కాబట్టి దాన్ని పోటీగా పరిగణించాల్సిన అవసరం లేదని మిల్లర్ నిర్మాతలు భావించారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా సలార్ వచ్చే చేరడంతో కేవలం వారం రోజుల వ్యవధిలో వీలైనంత రాబట్టుకోవడం అంత సులభంగా ఉండదు.
ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు కానీ కొన్ని కీలక అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. అచ్చం ఇలాగే 2018 డిసెంబర్ లో ధనుష్ మారి 2 రిలీజ్ చేసినప్పుడు కాంపిటీషన్ లో షారుఖ్ ఖాన్ జీరో, యష్ కెజిఎఫ్ చాప్టర్ 1, మోహన్ లాల్ ఒడియన్, అక్వమెన్ ఉన్నాయి. అయినా సరే మారి 2 కమర్షియల్ గా మంచి విజయం సాధించింది. ఇప్పుడదే సీన్ రిపీట్ అవ్వొచ్చని మిల్లర్ ప్రొడ్యూసర్ల ధీమా. కాకపోతే అప్పుడు లేని ప్రభాస్ ఇప్పుడున్నాడు కాబట్టి డైనోసర్ ని తక్కువంచనా వేయడానికి లేదు. అందుకే తుది నిర్ణయం చాలా క్యాలికులేషన్ల మీద ఆధారపడి ఉంటుంది.
ఒకవేళ ఢీ కొట్టాలని అనుకుంటే మాత్రం తమిళంలో ఏమో కానీ ఇతర భాషల్లో కెప్టెన్ మిల్లర్ కు కష్టాలు తప్పవు. బ్రిటిష్ బ్యాక్ డ్రాప్ లో అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో రూపొందిన ఈ పీరియాడిక్ డ్రామాలో ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్ కాగా శివరాజ్ కుమార్, సందీప్ కిషన్ కీలక పాత్రలు పోషించారు. టీజర్ చూశాక మంచి అంచనాలు ఏర్పడ్డాయి. షూటింగ్ అయిపోయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. సంక్రాంతి ఆప్షన్ చూశారు కానీ ధనుష్ భార్య ఐశ్వర్య దర్శకత్వంలో మామ రజనీకాంత్ లాల్ సలామ్ ఆల్రెడీ పొంగల్ ప్రకటన ఇచ్చింది కాబట్టి నో ఛాన్స్. ఫైనల్ గా ఏం డిసైడ్ అవుతారో చూడాలి.
This post was last modified on October 2, 2023 2:16 pm
అంతా అనుకున్నట్లు జరిగితే నితిన్ కొత్త చిత్రం రాబిన్ హుడ్ ఎప్పుడో రిలీజైపోయి ఉండాలి క్రిస్మస్కు అనుకున్న ఆ చిత్రం…
నాగ చైతన్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కిన తండేల్ థియేటర్లకు వచ్చేసింది. గత ఏడాది డిసెంబర్…
ఈ మధ్య కాలంలో అజిత్ లాంటి స్టార్ ఉన్న పెద్ద సినిమా బజ్ లేకుండా విడుదలయ్యిందంటే అది పట్టుదల మాత్రమే.…
ఏపీ రాజధాని అమరావతిని పరుగులు పెట్టించాలని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో…
'ప్రజల్లోకి ప్రభుత్వం' నినాదంతో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన…
వచ్చే వారం విడుదల కాబోతున్న లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా రానున్న సంగతి తెలిసిందే.…