తెలంగాణా కాంగ్రెస్ సీనియర్లలో కొత్త పంచాయితీ మొదలైంది. అదేమిటంటే సీనియర్లు అయినంత మాత్రాన టికెట్లు గ్యారెంటీ లేదని తాజాగా అధిష్టానం నుంచి సంకేతాలు అందుతుండటమే. నియోజకవర్గంలో తమకు కాకుండా అధిష్టానం ఇంకెవరికి టికెట్ ఇస్తుందని కొందరు సీనియర్లు ఇంతకాలం చాలా ధీమాగా ఉన్నారు. అయితే పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు అధిష్టానానికి పాపులర్ రిపోర్టు ఇచ్చారనే ప్రచారం మొదలవ్వటంతో కొందరు సీనియర్లలో టెన్షన్ మొదలైంది.
ఇంతకీ ఆ పాపులర్ రిపోర్టు ఏమిటంటే సునీల్ బృందం మొత్తం 119 నియోజకవర్గాల్లో పాపులర్ సర్వే పేరుతో ఒక సర్వే చేసింది. ఈ సర్వే ఎందుకంటే కచ్చితంగా గెలిచేదెవరు ? అనే విషయంపై ఎక్కువగా దృష్టి పెట్టారు. ఈ సర్వేలో సీనియర్, జూనియర్ అనే తేడా లేదు. ఈ పార్టీ ఆ పార్టీలో నేతన్న పట్టింపులేదు. ఎవరైతే గెలుస్తారు అన్న ప్రాతిపదికనే సర్వే నిర్వహించారు. అందులో పలానా పార్టీలో నేతైతే కాంగ్రెస్ తరపున పోటీ చేస్తే గెలుస్తారు అని జనాలు అనుకుంటే ఆ నేత పేరును సునీల్ టీం రిపోర్టులో పెట్టింది.
అలాగే జూనియర్ అయినా పార్టీలో మంచి పేరుందని, బాగా కష్టపడుతున్నాడని టికెట్ వస్తే తప్పక గెలుస్తాడని జనాలు అనుకుంటే అలాంటి జూనియర్ నేత పేరును సునీల్ తన రిపోర్టులో ప్రస్తావించారట. దీనివల్ల ఏమైందంటే సీనియర్, జూనియర్ అని కాకుండా గెలుపు గుర్రం ఎవరు అన్న విషయం మీదే సునీల్ సర్వే నిర్వహించారు. సర్వే రిపోర్టు ప్రకారమే నియోజకవర్గాల్లో ఎవరు పోటీ చేస్తే బాగుంటుందో వివరించారట.
సునీల్ తాజా రిపోర్టునే పార్టీ పాపులర్ సర్వే అనంటున్నారు. దీని ప్రకారం కొందరు సీనియర్లకు టికెట్లు గ్యారెంటీ లేకుండా పోయిందట. బీఆర్ఎస్ నుండి మైనంపల్లితో పాటు కొడుక్కి రెండు టికెట్లు ఇవ్వటానికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ కు ఈ పాపులర్ సర్వేనే కారణమట. అలాగే ఇతర పార్టీల్లోని గట్టి నేతలకు కాంగ్రెస్ గాలమేస్తోందని సమాచారం. ఇదంతా చూసిన తర్వాత సీనియారిటి అన్నది కాకుండా గెలుపు గుర్రం అయితేనే టికెట్ అని అధిష్టానం ఆలోచిస్తున్నదట. 6వ తేదీన ఏ విషయం తేలిపోతుందని పార్టీలో టాక్ నడుస్తోంది. చివరకు ఏమవుతుందో చూడాలి.
This post was last modified on October 2, 2023 1:46 pm
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న సునీల్కు రఘురామకు…
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…