ఇప్పటికే ప్రకటించిన సినిమాలతో 2024 సంక్రాంతి గురించి అలోచించి బుర్రలు వేడెక్కుతుంటే కొత్త అనౌన్స్ మెంట్లతో పోటీ మరింత టైట్ గా మారిపోతోంది. తాజాగా ‘అరణ్మనయ్ 4’ పొంగల్ బరిలో దింపుతున్నట్టు నిర్మాతలు కొత్త పోస్టర్ వదిలారు. దీని మొదటి మూడు భాగాలు తెలుగులోనూ వచ్చాయి. ఫస్ట్ ది ‘చంద్రకళ’ కమర్షియల్ గా ఇక్కడా విజయం సాధించగా ‘కళావతి’ యావరేజ్ అయ్యింది. గత ఏడాది వచ్చిన ‘అంతఃపురం’ ఆశించిన ఫలితం అందుకోలేదు. వీటన్నిటిలో ఆకర్షణీయమైన స్టార్ క్యాస్టింగ్ తో దర్శకుడు సి సుందర్ దెయ్యాల జానర్ లో తీశాడు. ఇప్పుడొచ్చేది నాలుగో భాగం.
ఇందులో రాశి ఖన్నా, తమన్నా భాటియా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వీళ్ళను దెయ్యాలుగా చూపించబోతున్నట్టు చెన్నై టాక్. త్రిష, హన్సిక లాంటి అందెగత్తెలనే ఆత్మలుగా చూపించి భయపెట్టిన సుందర్ కి ఇదేమి కొత్త కాదు. యోగిబాబు లాంటి కమెడియన్లు ఇందులో ఉన్నారు. డబ్బింగ్ కు సంబంధించి ఇంకా లావాదేవీలు జరగలేదు కాబట్టి టైటిల్ గట్రా తర్వాత డిసైడ్ చేస్తారు. అయితే దీన్నిగట్టి పోటీ అనుకోవడానికి లేదు కానీ ఇంత సాహసం చేయడం వెనుక కారణం ఉంది. కోలీవుడ్ లో సంక్రాంతికి శివ కార్తికేయన్ అయలన్ ఒకటే ఫిక్స్ చేశారు. స్టార్ హీరోలెవరివి లేవు.
అందుకే ఈ ఛాన్స్ వాడుకోవడానికి అరణ్మనయ్ టీమ్ నిర్ణయించుకుంది. ఇతర భాషల్లో ఆడినా ఆడకపోయినా పెద్దగా తేడా ఉండదు కానీ స్వంత మార్కెట్ ని మాత్రమే టార్గెట్ చేసుకున్నారు. అయినా ఎంతో కొంత రాబట్టుకోవచ్చనే ఉద్దేశంతో మన నిర్మాతల్లో ఎవరో ఒకరు హక్కులు కొంటారు కాబట్టి ఏదోలా థియేటర్ల సర్దుబాటు చేయాల్సిందే. పైగా తమన్నా, రాశిఖన్నా పోస్టర్లతో మార్కెటింగ్ జరుగుతుంది కనక మరీ తీవ్రంగా తక్కువంచనా వేయడానికి లేదు. ఇంకా మూడు నెలలు టైం ఉంది కాబట్టి ఇంకా ఏమేం బాక్సాఫీస్ పరిణామాలు జరుగుతాయో చూడాలి.
This post was last modified on September 29, 2023 9:20 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…