ఇప్పటికే ప్రకటించిన సినిమాలతో 2024 సంక్రాంతి గురించి అలోచించి బుర్రలు వేడెక్కుతుంటే కొత్త అనౌన్స్ మెంట్లతో పోటీ మరింత టైట్ గా మారిపోతోంది. తాజాగా ‘అరణ్మనయ్ 4’ పొంగల్ బరిలో దింపుతున్నట్టు నిర్మాతలు కొత్త పోస్టర్ వదిలారు. దీని మొదటి మూడు భాగాలు తెలుగులోనూ వచ్చాయి. ఫస్ట్ ది ‘చంద్రకళ’ కమర్షియల్ గా ఇక్కడా విజయం సాధించగా ‘కళావతి’ యావరేజ్ అయ్యింది. గత ఏడాది వచ్చిన ‘అంతఃపురం’ ఆశించిన ఫలితం అందుకోలేదు. వీటన్నిటిలో ఆకర్షణీయమైన స్టార్ క్యాస్టింగ్ తో దర్శకుడు సి సుందర్ దెయ్యాల జానర్ లో తీశాడు. ఇప్పుడొచ్చేది నాలుగో భాగం.
ఇందులో రాశి ఖన్నా, తమన్నా భాటియా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వీళ్ళను దెయ్యాలుగా చూపించబోతున్నట్టు చెన్నై టాక్. త్రిష, హన్సిక లాంటి అందెగత్తెలనే ఆత్మలుగా చూపించి భయపెట్టిన సుందర్ కి ఇదేమి కొత్త కాదు. యోగిబాబు లాంటి కమెడియన్లు ఇందులో ఉన్నారు. డబ్బింగ్ కు సంబంధించి ఇంకా లావాదేవీలు జరగలేదు కాబట్టి టైటిల్ గట్రా తర్వాత డిసైడ్ చేస్తారు. అయితే దీన్నిగట్టి పోటీ అనుకోవడానికి లేదు కానీ ఇంత సాహసం చేయడం వెనుక కారణం ఉంది. కోలీవుడ్ లో సంక్రాంతికి శివ కార్తికేయన్ అయలన్ ఒకటే ఫిక్స్ చేశారు. స్టార్ హీరోలెవరివి లేవు.
అందుకే ఈ ఛాన్స్ వాడుకోవడానికి అరణ్మనయ్ టీమ్ నిర్ణయించుకుంది. ఇతర భాషల్లో ఆడినా ఆడకపోయినా పెద్దగా తేడా ఉండదు కానీ స్వంత మార్కెట్ ని మాత్రమే టార్గెట్ చేసుకున్నారు. అయినా ఎంతో కొంత రాబట్టుకోవచ్చనే ఉద్దేశంతో మన నిర్మాతల్లో ఎవరో ఒకరు హక్కులు కొంటారు కాబట్టి ఏదోలా థియేటర్ల సర్దుబాటు చేయాల్సిందే. పైగా తమన్నా, రాశిఖన్నా పోస్టర్లతో మార్కెటింగ్ జరుగుతుంది కనక మరీ తీవ్రంగా తక్కువంచనా వేయడానికి లేదు. ఇంకా మూడు నెలలు టైం ఉంది కాబట్టి ఇంకా ఏమేం బాక్సాఫీస్ పరిణామాలు జరుగుతాయో చూడాలి.
This post was last modified on September 29, 2023 9:20 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…