అన్ని రకాల దుకాణాలూ తెరుచుకున్నాయి. వైన్ షాపులూ ఓపెనయ్యాయి. జిమ్లు కూడా తెరిచేశారు. ఏ షరతులూ లేకుండా అన్నీ మామూలుగా నడుస్తున్నాయి. కానీ థియేటర్లకు మాత్రం మోక్షం కలగలేదు.
ఐదు నెలలకు పైగా దేశవ్యాప్తంగా థియేటర్లన్నీ మూతపడే ఉన్నాయి. ఇదిగో అదిగో అంటున్నారు కానీ.. థియేటర్ల తాళాలు తెరుచుకోవట్లేదు. లాక్ డౌన్ 3.0లో అయినా థియేటర్లకు మోక్షం కల్పిస్తారనుకుంటే అలాంటిదేమీ జరగలేదు.
షూటింగ్లకు ఓకే చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. థియేటర్లు ఓపెన్ చేసే విషయం మాత్రం తేల్చలేదు. కానీ షూటింగ్ల దగ్గర పాటించాల్సిన నియమ నిబంధనల గురించి ప్రస్తావిస్తూ.. థియేటర్లలో సోషల్ డిస్టెన్సింగ్తో సీటింగ్ ఏర్పాటు చేయడం, టికెట్లను ఆన్ లైన్లో మాత్రమే అమ్మడం గురించి సూచనలు చేయడం గమనార్హం.
థియేటర్లకు అనుమతి ఇవ్వకపోవడంపై వాటిని నమ్ముకున్న వాళ్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నప్పటికీ.. మరీ ఆందోళన అక్కర్లేదన్నది విశ్లేషకులు చెబుతున్న మాట. సెప్టెంబరు మధ్య లోపే థియేటర్లు తెరుచుకోబోతున్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
థియేటర్లు ఎలా నిర్వహించాలో యాజమాన్యాలకు సంకేతాలు ఇస్తూ పై మార్గదర్శకాలు ఇచ్చారని.. మరిన్ని సూచనలతో వారికి ముందే ఒక నోట్ వెళ్లబోతోందని.. అంతా ఓకే అనుకున్నాక థియేటర్లను ఓపెన్ చేస్తారని అంటున్నారు. ఈ దిశగా మల్టీప్లెక్సుల యాజమాన్యాలు ఇప్పటికే థియేటర్లను సిద్ధం చేసే పనిలో పడ్డాయని.. సెప్టెంబరులో ఎట్టి పరిస్థితుల్లోనూ థియేటర్లు తెరుచుకుంటాయని.. దసరాకు కొత్త సినిమాల సందడి చూడొచ్చని.. కాకపోతే అనేక షరతుల మధ్య సినిమాల ప్రదర్శన సాగుతుందని.. పూర్తి ఆక్యుపెన్సీ మాత్రం వ్యాక్సిన్ రాకుండా సాధ్యం కాదని అంటున్నారు.
This post was last modified on August 24, 2020 5:10 pm
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…
ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…
సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…
అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…