అన్ని రకాల దుకాణాలూ తెరుచుకున్నాయి. వైన్ షాపులూ ఓపెనయ్యాయి. జిమ్లు కూడా తెరిచేశారు. ఏ షరతులూ లేకుండా అన్నీ మామూలుగా నడుస్తున్నాయి. కానీ థియేటర్లకు మాత్రం మోక్షం కలగలేదు.
ఐదు నెలలకు పైగా దేశవ్యాప్తంగా థియేటర్లన్నీ మూతపడే ఉన్నాయి. ఇదిగో అదిగో అంటున్నారు కానీ.. థియేటర్ల తాళాలు తెరుచుకోవట్లేదు. లాక్ డౌన్ 3.0లో అయినా థియేటర్లకు మోక్షం కల్పిస్తారనుకుంటే అలాంటిదేమీ జరగలేదు.
షూటింగ్లకు ఓకే చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. థియేటర్లు ఓపెన్ చేసే విషయం మాత్రం తేల్చలేదు. కానీ షూటింగ్ల దగ్గర పాటించాల్సిన నియమ నిబంధనల గురించి ప్రస్తావిస్తూ.. థియేటర్లలో సోషల్ డిస్టెన్సింగ్తో సీటింగ్ ఏర్పాటు చేయడం, టికెట్లను ఆన్ లైన్లో మాత్రమే అమ్మడం గురించి సూచనలు చేయడం గమనార్హం.
థియేటర్లకు అనుమతి ఇవ్వకపోవడంపై వాటిని నమ్ముకున్న వాళ్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నప్పటికీ.. మరీ ఆందోళన అక్కర్లేదన్నది విశ్లేషకులు చెబుతున్న మాట. సెప్టెంబరు మధ్య లోపే థియేటర్లు తెరుచుకోబోతున్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
థియేటర్లు ఎలా నిర్వహించాలో యాజమాన్యాలకు సంకేతాలు ఇస్తూ పై మార్గదర్శకాలు ఇచ్చారని.. మరిన్ని సూచనలతో వారికి ముందే ఒక నోట్ వెళ్లబోతోందని.. అంతా ఓకే అనుకున్నాక థియేటర్లను ఓపెన్ చేస్తారని అంటున్నారు. ఈ దిశగా మల్టీప్లెక్సుల యాజమాన్యాలు ఇప్పటికే థియేటర్లను సిద్ధం చేసే పనిలో పడ్డాయని.. సెప్టెంబరులో ఎట్టి పరిస్థితుల్లోనూ థియేటర్లు తెరుచుకుంటాయని.. దసరాకు కొత్త సినిమాల సందడి చూడొచ్చని.. కాకపోతే అనేక షరతుల మధ్య సినిమాల ప్రదర్శన సాగుతుందని.. పూర్తి ఆక్యుపెన్సీ మాత్రం వ్యాక్సిన్ రాకుండా సాధ్యం కాదని అంటున్నారు.
This post was last modified on August 24, 2020 5:10 pm
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…