అన్ని రకాల దుకాణాలూ తెరుచుకున్నాయి. వైన్ షాపులూ ఓపెనయ్యాయి. జిమ్లు కూడా తెరిచేశారు. ఏ షరతులూ లేకుండా అన్నీ మామూలుగా నడుస్తున్నాయి. కానీ థియేటర్లకు మాత్రం మోక్షం కలగలేదు.
ఐదు నెలలకు పైగా దేశవ్యాప్తంగా థియేటర్లన్నీ మూతపడే ఉన్నాయి. ఇదిగో అదిగో అంటున్నారు కానీ.. థియేటర్ల తాళాలు తెరుచుకోవట్లేదు. లాక్ డౌన్ 3.0లో అయినా థియేటర్లకు మోక్షం కల్పిస్తారనుకుంటే అలాంటిదేమీ జరగలేదు.
షూటింగ్లకు ఓకే చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. థియేటర్లు ఓపెన్ చేసే విషయం మాత్రం తేల్చలేదు. కానీ షూటింగ్ల దగ్గర పాటించాల్సిన నియమ నిబంధనల గురించి ప్రస్తావిస్తూ.. థియేటర్లలో సోషల్ డిస్టెన్సింగ్తో సీటింగ్ ఏర్పాటు చేయడం, టికెట్లను ఆన్ లైన్లో మాత్రమే అమ్మడం గురించి సూచనలు చేయడం గమనార్హం.
థియేటర్లకు అనుమతి ఇవ్వకపోవడంపై వాటిని నమ్ముకున్న వాళ్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నప్పటికీ.. మరీ ఆందోళన అక్కర్లేదన్నది విశ్లేషకులు చెబుతున్న మాట. సెప్టెంబరు మధ్య లోపే థియేటర్లు తెరుచుకోబోతున్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
థియేటర్లు ఎలా నిర్వహించాలో యాజమాన్యాలకు సంకేతాలు ఇస్తూ పై మార్గదర్శకాలు ఇచ్చారని.. మరిన్ని సూచనలతో వారికి ముందే ఒక నోట్ వెళ్లబోతోందని.. అంతా ఓకే అనుకున్నాక థియేటర్లను ఓపెన్ చేస్తారని అంటున్నారు. ఈ దిశగా మల్టీప్లెక్సుల యాజమాన్యాలు ఇప్పటికే థియేటర్లను సిద్ధం చేసే పనిలో పడ్డాయని.. సెప్టెంబరులో ఎట్టి పరిస్థితుల్లోనూ థియేటర్లు తెరుచుకుంటాయని.. దసరాకు కొత్త సినిమాల సందడి చూడొచ్చని.. కాకపోతే అనేక షరతుల మధ్య సినిమాల ప్రదర్శన సాగుతుందని.. పూర్తి ఆక్యుపెన్సీ మాత్రం వ్యాక్సిన్ రాకుండా సాధ్యం కాదని అంటున్నారు.
మన హీరోలేమో ఏడాదికి ఒక రిలీజ్ ఉండటమే మహా కష్టమైపోయి ప్యాన్ ఇండియా మోజులో ఏళ్లకేళ్లు ఖర్చు పెట్టేస్తున్నారు. మనం…
జనవరిలో 'అనగనగా ఒక రాజు' విడుదల టైంలో నిర్మాత నాగవంశీ ఇకపై తమ బ్యానర్ నుంచి నెలకో సినిమా ఉంటుందని…
టాలీవుడ్ హీరోయిన్లలో సమంత చాలా చాలా స్పెషల్ అని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. విజయశాంతిలా, అనుష్కలా యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలు చేయకపోయినా…
ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో కీలక నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొన్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై శ్రీలక్ష్మికి ఎట్టకేలకు పోస్టింగ్…
సరిగ్గా ఇంకో పదిహేను రోజుల్లో లెనిన్ విడుదల కానుంది. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ…
ఇండియాలో మోస్ట్ సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ల్లో ‘మీర్జాపూర్’ ఒకటి. యూపీ నేపథ్యంలో సాగే ఈ క్రైమ్ సిరీస్.. తొలి…