గ్లామర్ షోకి దూరంగా నటనకు స్కోప్ ఉన్న పాత్రలను ఏరికోరి మరీ ఎంచుకునే టాలెంటెడ్ హీరోయిన్లలో నిత్య మీనన్ ముందు వరసలో ఉంటుంది. స్వప్న సినిమా భాగస్వామ్యంలో తను నటించిన కొత్త వెబ్ సిరీస్ శ్రీమతి కుమారి ఈ శుక్రవారం నుంచి ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్లలో బిజీగా ఉన్న ఈ కేరళ కుట్టి మీద నిన్నటి నుంచి ఒక వింత ప్రచారం జరుగుతోంది. గతంలో ఒక తమిళ హీరో తనను విపరీతంగా వేధించాడని, దాని వల్ల మానసికంగా చాలా క్షోభకు గురి కావాల్సి వచ్చిందని ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా వచ్చిన వార్త బాగా వైరల్ అయ్యింది.
కామెడీ ఏంటంటే నిత్య మీనన్ అసలలా ఎవరితోనూ అనలేదట. అయినా పేరు చెప్పకుండా ఎవరో వేధించారని చెప్పడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని తనకూ తెలుసు. కొన్నేళ్ల క్రితం పలువురు బాలీవుడ్ కోలీవుడ్ హీరోయిన్లు పేర్లు చెప్పి మరీ మీ టూ ఉద్యమం లేవనెత్తితే తర్వాత దాని గురించి పట్టించుకున్న నాథుడు లేడు. ఇండస్ట్రీ పోకడ అలా ఉంది. పోనీ ఎవరైనా బలమైన సాక్ష్యాధారాలు చూపిస్తారా అంటే అదీ ఉండదు. అలాంటప్పుడు ఇలా చెప్పుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇదంతా తెలియనంత అనుభవలేమి నిత్య మీనన్ కి లేక కాదు.
కుమారి శ్రీమతి ప్రమోషన్లలో భాగంగా దానికి హైప్ రావడం కోసం ఇలా చేశారన్న కామెంట్స్ లేకపోలేదు కానీ ఇదంతా వట్టి సోషల్ మీడియా ఫార్స్ వ్యవహారంలాగే చూడాలి. ఆ మధ్య భీమ్లా నాయక్ లో పవన్ కళ్యాణ్ సరసన జోడి కట్టిన నిత్య మీనన్ సహజంగా ఉండే తన బొద్దుతనానికి స్వస్తి చెప్పి ఇప్పుడు చక్కని రూపంలో ఉంది. అయినా అవకాశాలు ఇబ్బడి ముబ్బడిగా రావడం లేదు కానీ పెర్ఫార్మన్స్ డిమాండ్ చేసే పాత్రలు వస్తే మాత్రం నో చెప్పడం లేదు. స్వంత ఇంటి కోసం మద్యం షాపు పెట్టేందుకు వెనుకాడని యువతిగా శ్రీమతి కుమారిలో నిత్య మీనన్ చాలా డిఫరెంట్ గా కనిపించనుందట.
This post was last modified on September 26, 2023 11:24 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…