తెలుగు సినిమాల్లో ఉన్నంత కమెడియన్లు ప్రపంచంలో మరే సినీ పరిశ్రమలోనూ లేరు అంటే అతిశయోక్తి కాదు. ఒక టైంలో ఒకే సినిమాలో పది మంది కమెడియన్లు పెట్టి నవ్వుల్లో ముంచెత్తేవారు జంధ్యాల, ఈవీవీ, రేలంగి నరసింహారావు లాంటి దర్శకులు. 90వ దశకం వరకు అలా ఒక వెలుగు వెలిగిన కమెడియన్లలో బాబూ మోహన్ ఒకరు. కోట శ్రీనివాసరావు కలయికలో ఆయన చేసిన కామెడీ ఎపిసోడ్లు ఇప్పటికీ ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటాయి.
ఒక టైంలో బ్రహ్మానందంను కూడా వెనక్కి నెట్టి టాప్ కమెడియన్2గా వెలుగొందాడు బాబూ మోహన్. కానీ 90వ దశకం చివరికి వచ్చేసరికి ఆయన హవా తగ్గిపోయింది. కెరీర్ డౌన్ అయిన టైంలోనే రాజకీయాల్లోకి అడుగు పెట్టిన బాబూ మోహన్.. నెమ్మదిగా సినిమాలకు దూరం అయిపోయారు. తర్వాత ఆయన్ని అందరూ మరిచిపోయారు.
బాబూ మోహన్ తెర మీద కనిపించి చాలా ఏళ్లయిపోయింది. ఐతే ఇప్పుడు ఉన్నట్లుండి ఆయనో వెబ్ సిరీస్లో తళుక్కుమన్నారు. ఆ సిరీసే.. కుమారి శ్రీమతి. నిత్యా మీనన్ ప్రధాన పాత్రలో వైజయంతీ మూవీస్ వాళ్లు రూపొందించిన ఈ సిరీస్ను గోంటేష్ ఉపాధ్యే రూపొందించాడు. ఈ నెల 28న ఈ సిరీస్ స్ట్రీమ్ కాబోతోంది. ఈ సిరీస్ ట్రైలర్ అందరినీ అమితంగా ఆకట్టుకుంది.
తమ కుటుంబం కోల్పోయిన ఇంటిని వెనక్కి తెచ్చుకునేందుకు బార్ పెట్టాలనుకునే ఓ అమ్మాయి కథ ఇది. ట్రైలర్ చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. ఈ ట్రైలర్లో అందరి దృష్టినీ ఆకర్షించిన జడ్జి పాత్రలో బాబూ మోహన్ కనిపించాడు. సినిమాలకు చాలా గ్యాప్ తీసుకున్నప్పటికీ.. ఆయన మళ్లీ తనదైన స్క్రీన్ ప్రెజెన్స్తో ఆకట్టుకున్నారు. ట్రైలర్ చూస్తే ఈ పాత్ర బాగానే క్లిక్ అయినట్లు అనిపిస్తోంది. పూర్తి సిరీస్లో బాబూ మోహన్ ఇంకా బలమైన ముద్ర వేశారంటే.. మళ్లీ సినిమాల్లో బిజీ అవడం ఖాయం.
This post was last modified on September 26, 2023 12:19 am
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…
ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…
నిన్న విడుదలైన ది ప్యారడైజ్ మొదటి పాట ఆయా షేర్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. గతంలో ఇలాంటి పాటలు ఎవరూ…