ఒకప్పుడు తమిళంలో పెద్ద పెద్ద హిట్లతో మిడ్ రేంజ్ స్టార్లలో ఒకడిగా ఎదిగాడు విశాల్. అతడి సినిమాలు తెలుగులో కూడా అనువాదమై మంచి ఫలితాన్నందుకున్నాయి. కానీ కొన్నేళ్ల నుంచి విశాల్ రొటీన్ మాస్ మసాలా సినిమాలతో నిరాశ పరుస్తున్నాడు. అతడి సినిమాలు వరుసగా బోల్తా కొడుతున్నాయి. చివరగా అతడి నుంచి వచ్చిన ‘లాఠీ’ వీకెండ్లోనే వాషౌట్ అయిపోయింది.
ఇక విశాల్ పుంజుకోవడం కష్టమే అని అంతా ఒక నిర్ణయానికి వచ్చేశారు. ఇలాంటి టైంలో వచ్చిన చిత్రం.. మార్క్ ఆంటోనీ. ఒక క్రేజీ ట్రైలర్తో ఈ సినిమా అందరి దృష్టినీ ఆకర్షించింది. తెలుగులో కూడా ఈ సినిమాకు డీసెంట్ బజ్ కనిపించింది. ఈ వారం సరైన పోటీ లేకపోవడం కూడా ‘మార్క్ ఆంటోనీ’కి కలిసొచ్చింది. ఈ చిత్రానికి టాక్ కొంచెం మిక్స్డ్గా వచ్చినప్పటికీ రెండు చోట్లా తొలి రోజు డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చాయి.
తమిళంలో అయితే ‘మార్క్ ఆంటోనీ’ సూపర్ హిట్ అయ్యే దిశగా అడుగులు వేస్తోంది. విశాల్ కెరీర్లోనే అత్యధికంగా ఈ చిత్రానికి రూ.12 కోట్ల ఓపెనింగ్స్ వచ్చాయి తొలి రోజు. విశాల్ రేంజికి ఈ వసూళ్లు చాలా ఎక్కువే. తమిళంలో ఈ సినిమాకు రెండో రోజు కూడా వసూళ్లు డ్రాప్ అవ్వలేదు. సినిమా హౌస్ ఫుల్స్తో రన్ అవుతోంది. ఇందులోని ఓవర్ ద టాప్ కామెడీ తమిళ జనాలకు బాగానే నచ్చుతోంది. ఎస్.జె.సూర్య పాత్రకు వాళ్లు బాగా కనెక్ట్ అయిపోయారు. తన కోసమే సినిమాకు వెళ్తున్నారు. శనివారం ఈ చిత్రం ప్యాక్డ్ హౌస్లతో నడిచింది. ఆదివారం కూడా మంచి వసూళ్లే వచ్చేలా ఉన్నాయి.
అక్కడ సినిమా సూపర్ హిట్ అయినట్లే కనిపిస్తోంది. కానీ తెలుగులో మాత్రం ‘మార్క్ ఆంటోనీ’ అంత ప్రభావం చూపలేకపోతోంది. తొలి రోజు వసూళ్లు బాగున్నా.. రెండో రోజు డ్రాప్ అయ్యాయి. సినిమాలోని ఓవర్ ద టాప్ సీన్లు.. లౌడ్ నరేషన్ మనవాళ్లు తట్టుకోలేకపోతున్నారు. కామెడీ కొంత వర్కవుట్ అయినా సరే.. రెండున్నర గంటలు ఈ లౌడ్నెస్ను మనవాళ్లు భరించలేకపోతున్నారు. దీంతో టాక్ బాగా మిక్స్డ్గా వచ్చి వసూళ్ల మీద ప్రభావం పడింది.
This post was last modified on September 17, 2023 5:51 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…