ఒకప్పుడు తమిళంలో పెద్ద పెద్ద హిట్లతో మిడ్ రేంజ్ స్టార్లలో ఒకడిగా ఎదిగాడు విశాల్. అతడి సినిమాలు తెలుగులో కూడా అనువాదమై మంచి ఫలితాన్నందుకున్నాయి. కానీ కొన్నేళ్ల నుంచి విశాల్ రొటీన్ మాస్ మసాలా సినిమాలతో నిరాశ పరుస్తున్నాడు. అతడి సినిమాలు వరుసగా బోల్తా కొడుతున్నాయి. చివరగా అతడి నుంచి వచ్చిన ‘లాఠీ’ వీకెండ్లోనే వాషౌట్ అయిపోయింది.
ఇక విశాల్ పుంజుకోవడం కష్టమే అని అంతా ఒక నిర్ణయానికి వచ్చేశారు. ఇలాంటి టైంలో వచ్చిన చిత్రం.. మార్క్ ఆంటోనీ. ఒక క్రేజీ ట్రైలర్తో ఈ సినిమా అందరి దృష్టినీ ఆకర్షించింది. తెలుగులో కూడా ఈ సినిమాకు డీసెంట్ బజ్ కనిపించింది. ఈ వారం సరైన పోటీ లేకపోవడం కూడా ‘మార్క్ ఆంటోనీ’కి కలిసొచ్చింది. ఈ చిత్రానికి టాక్ కొంచెం మిక్స్డ్గా వచ్చినప్పటికీ రెండు చోట్లా తొలి రోజు డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చాయి.
తమిళంలో అయితే ‘మార్క్ ఆంటోనీ’ సూపర్ హిట్ అయ్యే దిశగా అడుగులు వేస్తోంది. విశాల్ కెరీర్లోనే అత్యధికంగా ఈ చిత్రానికి రూ.12 కోట్ల ఓపెనింగ్స్ వచ్చాయి తొలి రోజు. విశాల్ రేంజికి ఈ వసూళ్లు చాలా ఎక్కువే. తమిళంలో ఈ సినిమాకు రెండో రోజు కూడా వసూళ్లు డ్రాప్ అవ్వలేదు. సినిమా హౌస్ ఫుల్స్తో రన్ అవుతోంది. ఇందులోని ఓవర్ ద టాప్ కామెడీ తమిళ జనాలకు బాగానే నచ్చుతోంది. ఎస్.జె.సూర్య పాత్రకు వాళ్లు బాగా కనెక్ట్ అయిపోయారు. తన కోసమే సినిమాకు వెళ్తున్నారు. శనివారం ఈ చిత్రం ప్యాక్డ్ హౌస్లతో నడిచింది. ఆదివారం కూడా మంచి వసూళ్లే వచ్చేలా ఉన్నాయి.
అక్కడ సినిమా సూపర్ హిట్ అయినట్లే కనిపిస్తోంది. కానీ తెలుగులో మాత్రం ‘మార్క్ ఆంటోనీ’ అంత ప్రభావం చూపలేకపోతోంది. తొలి రోజు వసూళ్లు బాగున్నా.. రెండో రోజు డ్రాప్ అయ్యాయి. సినిమాలోని ఓవర్ ద టాప్ సీన్లు.. లౌడ్ నరేషన్ మనవాళ్లు తట్టుకోలేకపోతున్నారు. కామెడీ కొంత వర్కవుట్ అయినా సరే.. రెండున్నర గంటలు ఈ లౌడ్నెస్ను మనవాళ్లు భరించలేకపోతున్నారు. దీంతో టాక్ బాగా మిక్స్డ్గా వచ్చి వసూళ్ల మీద ప్రభావం పడింది.
This post was last modified on September 17, 2023 5:51 pm
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…