నిన్న సలార్ వాయిదా తాలూకు అధికారిక ప్రకటన చాలా నింపాదిగా నెమ్మదిగా హోంబాలే ఫిలిమ్స్ ఇవ్వడం ఫ్యాన్స్ ఆగ్రహాన్ని ఎంత మాత్రం చల్లార్చలేదు. వారం రోజులుగా ప్రపంచం మొత్తం ఈ వార్త మారుమ్రోగుతున్నా తమకు వినిపించనే లేదన్న రీతిలో వ్యవహరించిన నిర్మాతలు కనీసం కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించినా బాగుండేది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎప్పటికి పూర్తవుతాయో యూనిట్ కే అంతు చిక్కడం లేదట. పైగా ఫస్ట్ కాపీ చూసి పూర్తిగా సంతృప్తి చెందితేనే తప్ప డేట్ విషయంలో ఎలాంటి మాట ఇవ్వలేనని దర్శకుడు ప్రశాంత్ నీల్ తేల్చి చెప్పడం ఈ పరిస్థితికి కారణమంటున్నారు.
సరే ఇంత గందరగోళం బజ్ పరంగా మంచి కాదు కాబట్టి నిన్న హఠాత్తుగా సలార్ డిజిటల్,శాటిలైట్, ఆడియో అన్ని కలిపి 350 కోట్లకు అమ్మేసినట్టుగా వచ్చిన వార్తని తెరపైకి తెచ్చారన్న కామెంట్స్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. పోస్ట్ పోన్ గురించి మాట్లాడుకుంటూ దాని మీద నెగటివ్ గా ఉన్న ఫ్యాన్స్ ని దృష్టి మరల్చే ఉద్దేశంతో ఇలా ఓటిటి న్యూస్ తో హడావిడి చేశారనే వాదనలో ఎంతో కొంత నిజమైతే కనిపిస్తోంది. ఎందుకంటే సలార్ కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు కావాల్సింది సినిమా ఎంతకు సేలయ్యిందని కాదు. థియేటర్లలో తాము ఎప్పుడు చూడబోతున్నామమనే క్లారిటీ.
అది స్పష్టంగా ఇవ్వలేని పరిస్థితి నెలకొనడంతో ఇలా హక్కులు అమ్ముడుపోవడం గురించి హైలైట్ చేశారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఏది ఏమైనా వీలైనంత త్వరగా సలార్ రిలీజ్ కు సంబంధించిన నిర్ణయం తీసుకోవడం మంచిది. నవంబర్ లో టైగర్ 3, డిసెంబర్ లో నాని, నితిన్, వెంకటేష్ ల సినిమాలున్న నేపథ్యంలో త్వరగా డెసిషన్ చెప్పేస్తే మిగిలినవాళ్లకు అనుకూలంగా ఉంటుంది. లేదంటే మొన్న తప్పుకున్న తర్వాత ఏర్పడ్డ గందరగోళం మళ్ళీ మళ్ళీ రిపీట్ కావడం ఖాయం. విడుదల తేదీ పొందుపరిస్తే తప్ప ట్రైలర్ ని వదలకూడదని డిసైడ్ కావడం అన్నింటిలోకి ఫైనల్ ట్విస్ట్.
This post was last modified on September 14, 2023 1:33 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…