Political News

బ్రేకింగ్: టీడీపీతో పొత్తుపై పవన్ షాకింగ్ ప్రకటన

రాజమండ్రి జైలులో టీడీపీ అధినేత చంద్రబాబుతో ములాఖత్ అయిన తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేనల మధ్య పొత్తు ఉంటుందని సంచలన ప్రకటన చేశారు. ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాలని కొంతకాలంగా ఆలోచిస్తున్నానని, ఈ రోజు నిర్ణయం తీసుకున్నానని అన్నారు. వైసీపీ అరాచకాలను ఎదుర్కోవాలంటే సమిష్టిగా ముందుకు వెళ్లాలని అన్నారు. ఇన్ని రోజులు టీడీపీతో కలిసి వెళ్లాలా, వద్దా అని ఆలోచనతో ఉన్నానని, కానీ ఈరోజు నిర్ణయం తీసుకున్నానని అన్నారు.

ఈ విషయాన్ని, ప్రస్తుతం చంద్రబాబు అరెస్టుతో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను జనసేన నేతలు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు గమనించాలని పవన్ పిలుపునిచ్చారు. విడివిడిగా పోటీ చేస్తే…దశాబ్దాల తరబడి ఇదే పరిస్థితి వస్తుందని, అందుకే ఏపీ భవిష్యత్తు కోసం కలిసి పోరాడాలని నిర్ణయించుకున్నానని అన్నారు. మాజీ సీఎంకే ఈ దుస్థితి వస్తే…అధికారులు, సామాన్యుల పరిస్థితి ఏమిటటని ప్రశ్నించారు. చంద్రబాబుపై కేసు తరహాలోనే ఏపీలో డ్రగ్స్ తో పాటు మరిన్ని కేసులున్నాయని, ఆ కేసులను మీడియా కూడా సరిగ్గా బయటకు తేవడం లేదని ఆరోపించారు. ఈ రోజు చంద్రబాబుకు జరిగిందని, రేపు మారుమూల గ్రామాలలో చిన్నపాటి నేతలకూ ఇదే పరిస్థితి ఉంటుందని అన్నారు.

తనకు మద్దతుగా ఉన్న జనసేన వీర మహిళలపై అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారని అన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని, కానీ స్కిల్ స్కాం కేసులో అధికారులను బాధ్యులను చేయాలని, కానీ, చంద్రబాబుపై రాజకీయ ప్రతీకారం కోసమే ఈ కేసు పెట్టారని అన్నారు. చంద్రబాబు అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. తన స్థాయి వ్యక్తనే బోర్డర్లో పోలీసులు ఆపేశారని, సగటు మనిషిని బతకనిస్తారా అంటూ వైసీపీపై మండిపడ్డారు. బిజెపి, జనసేన, టీడీపీ కలిసి వెళ్లాలని తన కోరిక అని, 2014 మాదిరి ఫలితాలు తీసుకురావాలన్నది తన అభిప్రాయమని అన్నారు.

This post was last modified on September 14, 2023 1:46 pm

Share
Show comments
Published by
Satya
Tags: Feature

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

4 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

5 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago