Movie News

ఒక నిర్మాణ సంస్థ.. రూ.1000 కోట్ల సినిమాలు

యశ్ రాజ్ ఫిలిమ్స్. ఇండియాలో అత్యంత సుదీర్ఘ, ఘనమైన చరిత్ర ఉన్న నిర్మాణ సంస్థల్లో ఒకటి. ఈ సంస్థ సెప్టెంబరు 27న 50వ వార్షికోత్సవం జరుపుకోబోతంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ఒకేసారి ఐదు భారీ చిత్రాల్ని యశ్ రాజ్ ఫిలిమ్స్ అధినేత ఆదిత్య చోప్రా ప్రకటించబోతున్నట్లు సమాచారం.

ఈ ఐదు సినిమాలకు కలిపి పెట్టబోతున్న బడ్జెట్ ఏకంగా రూ.500 కోట్లట. ఆసక్తికర కాంబినేషన్లలో.. బాలీవుడ్ టాప్ స్టార్లతో ఈ సినిమాలు ప్రొడ్యూస్ చేయనుంది యశ్ రాజ్ ఫిలిమ్స్.

యశ్ రాజ్ ఫిలిమ్స్ బేనర్లో ‘దిల్ వాలే దుల్హానియా లే జాయేంగే’ సహా అనేక బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన షారుఖ్ ఖాన్.. కొంత విరామం తర్వాత ‘పఠాన్’ పేరుతో ఆ బేనర్లో సినిమా చేయనున్నాడట. ఇందులో జాన్ అబ్రహాం, దీపికా పదుకొనే కీలక పాత్రలు పోషిస్తారట. ‘వార్’ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. ఈ చిత్ర బడ్జెట్ రూ.250 కోట్లట. ఇక బాలీవుడ్ మరో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇదే బేనర్లో మనీష్ శర్మ దర్శకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్ చేయనున్నాడట. దాని బడ్జెట్ రూ.350 కోట్లంటున్నారు.

మరో పెద్ద హీరో హృతిక్ రోషన్.. ‘వార్’ తర్వాత మళ్లీ యశ్ రాజ్ బేనర్లో ఓ సినిమా చేయనున్నాడట. దీని బడ్జెట్ రూ.200 కోట్ల పైమాటే అని సమాచారం. అలాగే అజయ్ దేవగణ్ హీరోగా శివ రవైల్ అనే కొత్త దర్శకుడు యశ్ రాజ్ బేనర్లో ఓ సూపర్ హీరో మూవీ చేయబోతున్నాడట. దాని బడ్జెట్ రూ.150 కోట్ల దాకా ఉంటుందట.

అలాగే యువ కథానాయకుడు విక్కీ కౌశల్, అందాల సుందరి మానుషి చిల్లర్ కలయికలో విక్టర్ దర్శకత్వంలో రూ.50 కోట్ల బడ్జెట్లో ఓ సినిమాను యశ్ రాజ్ సంస్థ నిర్మించనుందట. మొత్తంగా ఈ ఐదు సినిమాల బడ్జెట్ రూ.1000 కోట్లు. ఈ ఐదు సినిమాలను ఒకేసారి 50వ వార్షికోత్సవం సందర్భంగా యశ్ రాజ్ ఫిలిమ్స్ ప్రకటించనుందట.

This post was last modified on August 22, 2020 10:10 am

Share

Recent Posts

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

3 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

3 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

4 hours ago

పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…

4 hours ago

వ్య‌క్తి చ‌నిపోతే… కేసు మూసేయొచ్చు: ఉండ‌వ‌ల్లి కేసుపై సుప్రీంకోర్టు

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఓ కీల‌క కేసు విష‌యంలో సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. వ్య‌క్తి చ‌నిపోయిన త‌ర్వాత‌.. కేసును…

4 hours ago

డాటరాఫ్ రవీనా… ఫలితం కూడా అదేనా

టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…

5 hours ago