Movie News

ఒక నిర్మాణ సంస్థ.. రూ.1000 కోట్ల సినిమాలు

యశ్ రాజ్ ఫిలిమ్స్. ఇండియాలో అత్యంత సుదీర్ఘ, ఘనమైన చరిత్ర ఉన్న నిర్మాణ సంస్థల్లో ఒకటి. ఈ సంస్థ సెప్టెంబరు 27న 50వ వార్షికోత్సవం జరుపుకోబోతంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ఒకేసారి ఐదు భారీ చిత్రాల్ని యశ్ రాజ్ ఫిలిమ్స్ అధినేత ఆదిత్య చోప్రా ప్రకటించబోతున్నట్లు సమాచారం.

ఈ ఐదు సినిమాలకు కలిపి పెట్టబోతున్న బడ్జెట్ ఏకంగా రూ.500 కోట్లట. ఆసక్తికర కాంబినేషన్లలో.. బాలీవుడ్ టాప్ స్టార్లతో ఈ సినిమాలు ప్రొడ్యూస్ చేయనుంది యశ్ రాజ్ ఫిలిమ్స్.

యశ్ రాజ్ ఫిలిమ్స్ బేనర్లో ‘దిల్ వాలే దుల్హానియా లే జాయేంగే’ సహా అనేక బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన షారుఖ్ ఖాన్.. కొంత విరామం తర్వాత ‘పఠాన్’ పేరుతో ఆ బేనర్లో సినిమా చేయనున్నాడట. ఇందులో జాన్ అబ్రహాం, దీపికా పదుకొనే కీలక పాత్రలు పోషిస్తారట. ‘వార్’ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. ఈ చిత్ర బడ్జెట్ రూ.250 కోట్లట. ఇక బాలీవుడ్ మరో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇదే బేనర్లో మనీష్ శర్మ దర్శకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్ చేయనున్నాడట. దాని బడ్జెట్ రూ.350 కోట్లంటున్నారు.

మరో పెద్ద హీరో హృతిక్ రోషన్.. ‘వార్’ తర్వాత మళ్లీ యశ్ రాజ్ బేనర్లో ఓ సినిమా చేయనున్నాడట. దీని బడ్జెట్ రూ.200 కోట్ల పైమాటే అని సమాచారం. అలాగే అజయ్ దేవగణ్ హీరోగా శివ రవైల్ అనే కొత్త దర్శకుడు యశ్ రాజ్ బేనర్లో ఓ సూపర్ హీరో మూవీ చేయబోతున్నాడట. దాని బడ్జెట్ రూ.150 కోట్ల దాకా ఉంటుందట.

అలాగే యువ కథానాయకుడు విక్కీ కౌశల్, అందాల సుందరి మానుషి చిల్లర్ కలయికలో విక్టర్ దర్శకత్వంలో రూ.50 కోట్ల బడ్జెట్లో ఓ సినిమాను యశ్ రాజ్ సంస్థ నిర్మించనుందట. మొత్తంగా ఈ ఐదు సినిమాల బడ్జెట్ రూ.1000 కోట్లు. ఈ ఐదు సినిమాలను ఒకేసారి 50వ వార్షికోత్సవం సందర్భంగా యశ్ రాజ్ ఫిలిమ్స్ ప్రకటించనుందట.

This post was last modified on August 22, 2020 10:10 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

తమిళనాడు కూడా తేలింది.. కానీ కేరళ మాత్రం…

తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…

52 minutes ago

కమ్యూనిస్టులు… మళ్ళీ అదే తప్పిదం

రాజ‌కీయాల్లో అవ‌కాశాలు రావ‌డ‌మే అరుదు. వ‌చ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవ‌స‌రం.. వాటిని ప‌ట్టుకుని ఎద‌గాల్సిన అవ‌స‌రం కూడా పార్టీల‌కు, నాయ‌కుల‌కు…

6 hours ago

సంచలనాలకు సిద్ధమవుతున్న జన నాయకుడు

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…

7 hours ago

దృశ్యం 3 ఇక్కడితో ఆగడం లేదా

పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…

7 hours ago

ఇక సీఎం విజయ్ ను ఎవరు ఆపలేరు

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత ప‌రిస్థితి తొలిగిపోయింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిన…

7 hours ago

ప‌వ‌న్ ఇంటికి ప్ర‌ధాని మోడీ?

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఆదివారం హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో మ‌రో…

9 hours ago