యశ్ రాజ్ ఫిలిమ్స్. ఇండియాలో అత్యంత సుదీర్ఘ, ఘనమైన చరిత్ర ఉన్న నిర్మాణ సంస్థల్లో ఒకటి. ఈ సంస్థ సెప్టెంబరు 27న 50వ వార్షికోత్సవం జరుపుకోబోతంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ఒకేసారి ఐదు భారీ చిత్రాల్ని యశ్ రాజ్ ఫిలిమ్స్ అధినేత ఆదిత్య చోప్రా ప్రకటించబోతున్నట్లు సమాచారం.
ఈ ఐదు సినిమాలకు కలిపి పెట్టబోతున్న బడ్జెట్ ఏకంగా రూ.500 కోట్లట. ఆసక్తికర కాంబినేషన్లలో.. బాలీవుడ్ టాప్ స్టార్లతో ఈ సినిమాలు ప్రొడ్యూస్ చేయనుంది యశ్ రాజ్ ఫిలిమ్స్.
యశ్ రాజ్ ఫిలిమ్స్ బేనర్లో ‘దిల్ వాలే దుల్హానియా లే జాయేంగే’ సహా అనేక బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన షారుఖ్ ఖాన్.. కొంత విరామం తర్వాత ‘పఠాన్’ పేరుతో ఆ బేనర్లో సినిమా చేయనున్నాడట. ఇందులో జాన్ అబ్రహాం, దీపికా పదుకొనే కీలక పాత్రలు పోషిస్తారట. ‘వార్’ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. ఈ చిత్ర బడ్జెట్ రూ.250 కోట్లట. ఇక బాలీవుడ్ మరో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇదే బేనర్లో మనీష్ శర్మ దర్శకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్ చేయనున్నాడట. దాని బడ్జెట్ రూ.350 కోట్లంటున్నారు.
మరో పెద్ద హీరో హృతిక్ రోషన్.. ‘వార్’ తర్వాత మళ్లీ యశ్ రాజ్ బేనర్లో ఓ సినిమా చేయనున్నాడట. దీని బడ్జెట్ రూ.200 కోట్ల పైమాటే అని సమాచారం. అలాగే అజయ్ దేవగణ్ హీరోగా శివ రవైల్ అనే కొత్త దర్శకుడు యశ్ రాజ్ బేనర్లో ఓ సూపర్ హీరో మూవీ చేయబోతున్నాడట. దాని బడ్జెట్ రూ.150 కోట్ల దాకా ఉంటుందట.
అలాగే యువ కథానాయకుడు విక్కీ కౌశల్, అందాల సుందరి మానుషి చిల్లర్ కలయికలో విక్టర్ దర్శకత్వంలో రూ.50 కోట్ల బడ్జెట్లో ఓ సినిమాను యశ్ రాజ్ సంస్థ నిర్మించనుందట. మొత్తంగా ఈ ఐదు సినిమాల బడ్జెట్ రూ.1000 కోట్లు. ఈ ఐదు సినిమాలను ఒకేసారి 50వ వార్షికోత్సవం సందర్భంగా యశ్ రాజ్ ఫిలిమ్స్ ప్రకటించనుందట.
This post was last modified on August 22, 2020 10:10 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…