Movie News

రాజు గారు భలే బేరాలు పడుతున్నారు

టాలీవుడ్లో ఇప్పుడు ఏ రకంగా చూసినా నంబర్ వన్ ప్రొడ్యూసర్ అంటే దిల్ రాజే. సినిమాల ఫ్రీక్వెన్సీ, వాటి రేంజ్, సక్సెస్ రేట్.. ఇలా అన్ని పారామీటర్లు తీసుకుంటే రాజు మిగతా అందరినీ వెనక్కి నెట్టేసి అగ్ర స్థానంలో ఉంటారు.

అప్పుడప్పుడూ అందరి లాగే ఆయన కూడా కొన్ని ఎదురు దెబ్బలు తింటుంటారు కానీ.. చాలా వరకు ఆయన పైచేయి సాధిస్తుంటారు. కొన్ని నెలలుగా థియేటర్లు మూతపడి ఉన్న నేపథ్యంలో వేరే భాషల్లో పేరున్న సినిమాలు ఓటీటీల్లో రిలీజవుతుంటే.. తెలుగు నిర్మాతలు మాత్రం ఆ విషయంలో విముఖంగా ఉండగా.. రాజే చొరవ తీసుకుని కాలానికి తగ్గట్లు మారాలన్న ఉద్దేశంతో తన నిర్మాణంలో తెరకెక్కిక క్రేజీ మూవీ ‘వి’ని అమేజాన్ ప్రైమ్ వాళ్లకు అమ్మేశాడు. సినిమా బడ్జెట్ మీద కాస్త లాభానికి డిజిటల్ రైట్స్ అమ్ముడైనట్లు తెలుస్తోంది.

ఇంకా శాటిలైట్, డబ్బింగ్ హక్కులు ఉన్నాయి. తర్వాత కుదిరితే థియేటర్లలోనూ ఈ చిత్రాన్ని థియేటర్లోనూ రిలీజ్ చేసి కొంత ఆదాయం రాబట్టాలన్న ఆలోచన కూడా రాజుకు ఉంది. ఇదిలా ఉండగా.. ‘వి’ డీల్ సెట్ అయిందో లేదో.. తన ప్రొడక్షన్లో తెరకెక్కుతున్న మరో సినిమా డిజిటల్ బేరం కూడా రాజు తెంచేసినట్లు సమాచారం.

వేరే నిర్మాతలు మొదలుపెట్టి.. తర్వాత రాజు చేతిలోకి వచ్చిన ‘గుడ్ లక్ సఖి’ని కూడా ఓటీటీలోనే నేరుగా రిలీజ్ చేయాలని నిర్ణయించారు. దీన్ని కూడా అమేజాన్ ప్రైమ్ వాళ్లకే అమ్మేశారట. ఈ సినిమా బడ్జెట్ మీద మంచి లాభానికి డీల్ కుదిరిందట. ఆ మొత్తం రూ.13 కోట్లని సమాచారం. నగేష్ కుకునూర్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ఇది. ఆమె నటించిన ‘పెంగ్విన్’ కూడా ప్రైమ్‌లోనే రిలీజైంది.

దాని మీద రెట్టింపు స్థాయిలో ఈ డీల్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కూడా సెప్టెంబర్లోనే ప్రైమ్‌లో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. రాజు బాటలో మరిందరు నిర్మాతలు ప్రైమ్, ఇతర ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌తో చర్చలు జరుపుతూ విడుదలకు సిద్ధంగా ఉన్న తమ చిత్రాల్ని ఆన్‌లైన్లో రిలీజ్ చేసేయడానికి రెడీ అవుతున్నారు.

This post was last modified on August 21, 2020 2:12 pm

Share

Recent Posts

ట్రంప్ తుంట‌రి నిర్ణ‌యం… తిట్టిపోస్తున్న నెటిజ‌న్లు!

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణ‌యాలు విస్మ‌యానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఇరాన్‌పై ఒంటికాలిపై లేచిన…

26 minutes ago

పులివెందులకు రమ్మంటావా… తాడేపల్లికి రమ్మంటావా

డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…

29 minutes ago

అసెంబ్లీలో మంత్రుల పక్కన సీఎం కూర్చోవడం ఎప్పుడైనా చూసారా?

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…

4 hours ago

ఇంట్రెస్టింగ్… ఫ్లాప్ దర్శకుల కలయికలో సినిమా?

సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుల్లో శంకర్, మురుగదాస్ పేర్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎందుకంటే…

6 hours ago

ఇరుముడి కొట్టుడు మళ్లీ మొదలు

‘టాక్సిక్’ వచ్చిన తర్వాత ‘ఇరుముడి’ రన్ మీద ప్రభావం తప్పదేమో అని డౌట్ ఉండేది. పెద్ద పాన్ ఇండియా సినిమా…

6 hours ago

సుబ్బులక్ష్మి బయోపిక్… సాయిపల్లవి స్థానంలో రష్మిక

సుప్రసిద్ధ గాయని ఏంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీసేందుకు నిర్మాత బన్నీ వాస్, అల్లు అరవింద్, రాక్…

7 hours ago