హిట్టు ఫ్లాపు సంగతి పక్కనపెడితే కోలీవుడ్ లో సెటిలైన తెలుగువాడిగా విశాల్ కు ఇక్కడా మంచి ఫాలోయింగ్ ఉంది. మార్కెట్ తగ్గినప్పటికీ తన సినిమా వస్తోందంటే ఆసక్తికరంగా ఎదురు చూసే అభిమానులున్నారు. కొంత కాలంగా రెగ్యులర్ మూసలో పడిపోయి పరాజయాలు చూస్తున్న విశాల్ కొత్త మూవీ మార్క్ ఆంథోనీ ఈ నెల 15 విడుదల కానుంది. భారీ బడ్జెట్ తో ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ వెరైటీ గ్యాంగ్ స్టర్ డ్రామా కోసం హీరో చాలా వేషాలే వేశాడు. ఇవాళ ట్రైలర్ రిలీజ్ చేశారు. మూడు నిమిషాల వీడియోలో అరటి పండు ఒలిచినట్టు కథేంటో చెప్పేశారు.
ఓ మూడు దశాబ్దాల క్రితం జనాన్ని గడగడలాడించిన ఆంథోనీ(విశాల్), అతని ప్రాణ స్నేహితుడు(ఎస్జె సూర్య) మాఫియాని గుప్పిట్లో పెట్టుకుంటారు. ఎప్పుడు ఏ రూపంలో ఉంటారో అర్థం కాని తెలివితేటలతో శత్రువులను బురిడీ కొట్టిస్తుంటారు. వర్తమానంలో మార్క్ (ఆంటోనీ) తన చిన్ననాటి వ్యక్తులకు ఫోన్ ద్వారా కలుసుకునే టైం మెషీన్ ని చూస్తాడు. దీంతో ఆంథోనీతో పాటు వాడి ఫ్రెండ్ ని కలుసుకునే ప్రయత్నం చేస్తాడు. తీరా చూస్తే ఈ ఇద్దరు రౌడీలు బ్రతికే ఉంటారు. వయసయ్యాక మార్క్ తో తలపడేందుకు సిద్ధపడతారు. తర్వాత ఏం జరిగిందో తెరమీద చూడమంటున్నారు.
కొంచెం గందరగోళంగా ఉన్నప్పటికీ కాన్సెప్ట్ ఆసక్తికరంగానే ఉంది. టైం ట్రావెల్ తో ఆ మధ్య శర్వానంద్ ఒకే ఒక జీవితం వచ్చింది. అది ఎమోషనల్ డ్రామా. అదే పాయింట్ ని తీసుకుని మార్క్ ఆంథోనీని ఫుల్ యాక్షన్ మసాలాగా మార్చాడు ఆధిక్ రవిచంద్రన్. భారీ బడ్జెట్గ్ ఖర్చు పెట్టినట్టు విజువల్స్ చూస్తే చెప్పొచ్చు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం, రామానుజం ఛాయాగ్రహణం బాగా కుదిరాయి. రామ్ స్కంద, లారెన్స్ చంద్రముఖి 2తో పోటీ పడబోతున్న మార్క్ ఆంథోనీ హిట్టు కొట్టడం విశాల్ కు చాలా కీలకం. వెరైటీగానే కనిపిస్తోంది. కంటెంట్ కూడా అలాగే ఉంటే సక్సెస్ దక్కినట్టే.
This post was last modified on September 4, 2023 12:02 am
నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…
గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…
బీజేపీ, జనసేనలతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…
గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…
ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…