హిట్టు ఫ్లాపు సంగతి పక్కనపెడితే కోలీవుడ్ లో సెటిలైన తెలుగువాడిగా విశాల్ కు ఇక్కడా మంచి ఫాలోయింగ్ ఉంది. మార్కెట్ తగ్గినప్పటికీ తన సినిమా వస్తోందంటే ఆసక్తికరంగా ఎదురు చూసే అభిమానులున్నారు. కొంత కాలంగా రెగ్యులర్ మూసలో పడిపోయి పరాజయాలు చూస్తున్న విశాల్ కొత్త మూవీ మార్క్ ఆంథోనీ ఈ నెల 15 విడుదల కానుంది. భారీ బడ్జెట్ తో ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ వెరైటీ గ్యాంగ్ స్టర్ డ్రామా కోసం హీరో చాలా వేషాలే వేశాడు. ఇవాళ ట్రైలర్ రిలీజ్ చేశారు. మూడు నిమిషాల వీడియోలో అరటి పండు ఒలిచినట్టు కథేంటో చెప్పేశారు.
ఓ మూడు దశాబ్దాల క్రితం జనాన్ని గడగడలాడించిన ఆంథోనీ(విశాల్), అతని ప్రాణ స్నేహితుడు(ఎస్జె సూర్య) మాఫియాని గుప్పిట్లో పెట్టుకుంటారు. ఎప్పుడు ఏ రూపంలో ఉంటారో అర్థం కాని తెలివితేటలతో శత్రువులను బురిడీ కొట్టిస్తుంటారు. వర్తమానంలో మార్క్ (ఆంటోనీ) తన చిన్ననాటి వ్యక్తులకు ఫోన్ ద్వారా కలుసుకునే టైం మెషీన్ ని చూస్తాడు. దీంతో ఆంథోనీతో పాటు వాడి ఫ్రెండ్ ని కలుసుకునే ప్రయత్నం చేస్తాడు. తీరా చూస్తే ఈ ఇద్దరు రౌడీలు బ్రతికే ఉంటారు. వయసయ్యాక మార్క్ తో తలపడేందుకు సిద్ధపడతారు. తర్వాత ఏం జరిగిందో తెరమీద చూడమంటున్నారు.
కొంచెం గందరగోళంగా ఉన్నప్పటికీ కాన్సెప్ట్ ఆసక్తికరంగానే ఉంది. టైం ట్రావెల్ తో ఆ మధ్య శర్వానంద్ ఒకే ఒక జీవితం వచ్చింది. అది ఎమోషనల్ డ్రామా. అదే పాయింట్ ని తీసుకుని మార్క్ ఆంథోనీని ఫుల్ యాక్షన్ మసాలాగా మార్చాడు ఆధిక్ రవిచంద్రన్. భారీ బడ్జెట్గ్ ఖర్చు పెట్టినట్టు విజువల్స్ చూస్తే చెప్పొచ్చు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం, రామానుజం ఛాయాగ్రహణం బాగా కుదిరాయి. రామ్ స్కంద, లారెన్స్ చంద్రముఖి 2తో పోటీ పడబోతున్న మార్క్ ఆంథోనీ హిట్టు కొట్టడం విశాల్ కు చాలా కీలకం. వెరైటీగానే కనిపిస్తోంది. కంటెంట్ కూడా అలాగే ఉంటే సక్సెస్ దక్కినట్టే.
కెరీర్ తొలి నాళ్లలో పెద్దగా అవకాశాలు లేనపుడు దక్షిణాదిన వచ్చే ప్రతి ఛాన్సునూ మహా ప్రసాదం అనుకుంటారు. స్టార్ ఇమేజ్…
మెగా హీరోల సినిమాలకు సంబంధించి ఏ ఈవెంట్ అయినా.. అందులో ఎక్కడో ఒక చోట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన పెద్ది సక్సెస్ మీట్ కోసం వేలాది అభిమానులు తరలివచ్చారు. ఈ సినిమాకు సంబంధించి ఇదే…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ విపక్ష వైసీపీ ఇటీవల డోస్ పెంచిన…
ప్రతి సంవత్సరం విజయ్కి స్పెషల్ పిక్తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే త్రిష.. ఈసారి చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన్ని…
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…