హిట్టు ఫ్లాపు సంగతి పక్కనపెడితే కోలీవుడ్ లో సెటిలైన తెలుగువాడిగా విశాల్ కు ఇక్కడా మంచి ఫాలోయింగ్ ఉంది. మార్కెట్ తగ్గినప్పటికీ తన సినిమా వస్తోందంటే ఆసక్తికరంగా ఎదురు చూసే అభిమానులున్నారు. కొంత కాలంగా రెగ్యులర్ మూసలో పడిపోయి పరాజయాలు చూస్తున్న విశాల్ కొత్త మూవీ మార్క్ ఆంథోనీ ఈ నెల 15 విడుదల కానుంది. భారీ బడ్జెట్ తో ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ వెరైటీ గ్యాంగ్ స్టర్ డ్రామా కోసం హీరో చాలా వేషాలే వేశాడు. ఇవాళ ట్రైలర్ రిలీజ్ చేశారు. మూడు నిమిషాల వీడియోలో అరటి పండు ఒలిచినట్టు కథేంటో చెప్పేశారు.
ఓ మూడు దశాబ్దాల క్రితం జనాన్ని గడగడలాడించిన ఆంథోనీ(విశాల్), అతని ప్రాణ స్నేహితుడు(ఎస్జె సూర్య) మాఫియాని గుప్పిట్లో పెట్టుకుంటారు. ఎప్పుడు ఏ రూపంలో ఉంటారో అర్థం కాని తెలివితేటలతో శత్రువులను బురిడీ కొట్టిస్తుంటారు. వర్తమానంలో మార్క్ (ఆంటోనీ) తన చిన్ననాటి వ్యక్తులకు ఫోన్ ద్వారా కలుసుకునే టైం మెషీన్ ని చూస్తాడు. దీంతో ఆంథోనీతో పాటు వాడి ఫ్రెండ్ ని కలుసుకునే ప్రయత్నం చేస్తాడు. తీరా చూస్తే ఈ ఇద్దరు రౌడీలు బ్రతికే ఉంటారు. వయసయ్యాక మార్క్ తో తలపడేందుకు సిద్ధపడతారు. తర్వాత ఏం జరిగిందో తెరమీద చూడమంటున్నారు.
కొంచెం గందరగోళంగా ఉన్నప్పటికీ కాన్సెప్ట్ ఆసక్తికరంగానే ఉంది. టైం ట్రావెల్ తో ఆ మధ్య శర్వానంద్ ఒకే ఒక జీవితం వచ్చింది. అది ఎమోషనల్ డ్రామా. అదే పాయింట్ ని తీసుకుని మార్క్ ఆంథోనీని ఫుల్ యాక్షన్ మసాలాగా మార్చాడు ఆధిక్ రవిచంద్రన్. భారీ బడ్జెట్గ్ ఖర్చు పెట్టినట్టు విజువల్స్ చూస్తే చెప్పొచ్చు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం, రామానుజం ఛాయాగ్రహణం బాగా కుదిరాయి. రామ్ స్కంద, లారెన్స్ చంద్రముఖి 2తో పోటీ పడబోతున్న మార్క్ ఆంథోనీ హిట్టు కొట్టడం విశాల్ కు చాలా కీలకం. వెరైటీగానే కనిపిస్తోంది. కంటెంట్ కూడా అలాగే ఉంటే సక్సెస్ దక్కినట్టే.
This post was last modified on September 4, 2023 12:02 am
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…