పబ్లిక్ స్టేజిల మీద ఏదైనా మాట్లాడేటప్పుడు ఏ మాత్రం నాలుక స్లిప్ అయినా దాని పరిణామాలు ఒక్కోసారి ఊహించనంత దూరం వెళ్లిపోతాయి. క్షమాపణ చెప్పే దాకా దారి తీయొచ్చు. కొన్నేళ్ల క్రితం ఒక సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టు ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అమ్మాయిల గురించి చేసిన కామెంట్ పెద్ద దుమారం రేపింది. దానికి కొడుకు సైతం వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇదే పొరపాటు మన పెద్ద హీరోలు చేస్తే నెటిజెన్లు ఏ రేంజ్ లో ట్రోలింగ్ చేస్తారో తెలియంది కాదు. కానీ షారుఖ్ ఖాన్ వేసిన ఒక జోకు మాత్రం ముందు ఏదో సరదాగా అనిపించినా అర్థం తెలిశాక షాక్ కొట్టేలా ఉంది.
మొన్న జరిగిన జవాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో షారుఖ్ మాట్లాడుతూ ఈ సినిమా షూటింగ్ టైంలోనే దర్శకుడు ఆట్లీ దంపతులకు బిడ్డ జన్మించిందని, మూవీ తమ జాయింట్ ప్రొడక్షన్ అయినా బేబీ మాత్రం వాళ్ళిద్దరిదనేని, తన ప్రమేయం లేదని జోకేశాడు. ముందు పగలబడి నవ్వుకున్నా నిజానికందులో చాలా విచిత్రమైన అర్థం ఉంది. శుభాకాంక్షలు చెప్తే పోయేదానికి దాన్నేదో కామెడీగా చెప్పాలన్న ఉద్దేశంతో అన్న మాటలు ఒకరకంగా మిస్ ఫైర్ అయ్యాయి. విచిత్రంగా దాని మీద ఎలాంటి ట్రోలింగ్స్ రాకుండా, హైలైట్ అవ్వకుండా తమిళ తంబీలు జాగ్రత్త పడ్డారు.
ఒకవేళ ఇదే తరహా ప్రసంగం మన స్టార్లు చేస్తే మాత్రం సభ్యత లేదు, పెద్ద మనుషులు ఇలాగే మాట్లాడతారా అంటూ ఆన్ లైన్ కోర్టులో తీర్పులు ఇచ్చేస్తారు. తప్పు ఎవరు మాట్లాడినా అది తప్పే అవుతుంది. అందరినీ ఒకేరకంగా చూడాలి. అంతే తప్ప కింగ్ ఖాన్ కాబట్టి ఏమి అనకూడాదని చెప్పడం సిల్లీనే. షారుఖ్ మనసులో ఎలాంటి దురుద్దేశం లేకపోవచ్చు. కానీ మాటల రూపంలో అది నిర్వచించిన అర్థం మాత్రం ఇంకోలా ఉంది. ఈవెంట్ తాలూకు అఫీషియల్ వీడియో ఇంకా రిలీజ్ కాలేదు కాబట్టి వైరల్ కాలేదు కానీ వేడుకకు వెళ్లిన వాళ్ళు షూట్ చేసిన వీడియోలో ఇదంతా ఉంది.
This post was last modified on September 1, 2023 11:19 am
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…