ప్రమోషన్స్ డుమ్మాకి కారణం ఇదే !

అనుష్కకి పాన్ ఇండియా లెవెల్ లో మంచి స్టార్డం ఉంది. ఆమె చేసిన బడా సినిమాలు పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలు నమోదు చేయడంతో ఆమెకి ఎనలేని క్రేజ్ దక్కింది. ముఖ్యంగా బాహుబలి ఫ్రాంచైజ్ అనుష్క ను బిగ్గెస్ట్ స్టార్ గా మార్చేసింది. అయితే అంతటి క్రేజ్ అందుకున్న స్వీటీ అలియాస్ ఆనుష్క చాలా గ్యాప్ తీసుకొని నవీన్ పోలిశెట్టి తో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా చేసింది. అయితే సైజ్ జీరో సినిమా కోసం బరువు పెరిగిన స్వీటీ అదే ఫిజిక్ కంటిన్యూ చేసింది. ఈ సినిమా టైమ్ లో కూడా ఓవర్ వెయిట్ అయిపోయింది అనుష్క. 

రీసెంట్ గా రిలీజైన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ట్రైలర్ లో కూడా అనుష్క బాగా బొద్దుగా కనిపించింది. దీంతో అనుష్క లుక్ పై ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. నిజానికి అనుష్క ఈ సినిమా ప్రమోషన్స్ లో కనిపించకపోవడానికి రీజన్ కూడా ఇదే అని తెలుస్తుంది. ఓవర్ వెయిట్ తగ్గాక ప్రమోషన్స్ లో కనిపించాలని చూసిన అనుష్క కి ఆ పని సాధ్యం అవ్వలేదని తెలుస్తుంది. దీంతో ఆ రీజన్ తోనే స్వీటీ ఎక్కడా కనిపించకుండా ప్రమోషన్ లో తన మాటలు మాత్రమే వినిపిస్తుంది. 

ఇక అనుష్క యోగా టీచర్. అందులో ఆమెది అందె వేసిన చేయి. మరి యోగాతో బరువు తగ్గడం , ఆరోగ్యంగా ఉండటం చాలా సులువే. అయినా అనుష్క ఎందుకు తగ్గలేకపోయిందో ఆమెకే తెలియాలి. ఏదేమైనా అనుష్క ప్రమోషన్స్ లో కనిపించకపోవడంతో సినిమాపై హైప్ తెచ్చే భాద్యతంతా హీరో నవీన్ పైనే పడింది. తాజాగా కథవర్ అనే పాన్ ఇండియా సినిమాకి సైన్ చేసింది. మరి ఆ సినిమాలో అయినా స్వీట్ స్లిమ్ లుక్ తో  దర్శనమిస్తుందా ?