సినీ పరిశ్రమలో టైమింగ్, సక్సెస్ అనేది చాలా కీలకమైన విషయం. ఎప్పుడు ఎలాంటి సినిమా చేశారు.. ఆ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంది అన్నదాన్ని బట్టే కెరీర్లు డిసైడువుతాయి. కొన్నిసార్లు ఒక హీరోయిన్ యావరేజ్గా ఉన్నా, పెద్దగా నటన రాకపోయినా.. తొలి సినిమా సూపర్ హిట్ అయితే.. ఆ తర్వాత కూడా కొన్ని విజయాలు దక్కితే ఆమె మీద లక్కీ గర్ల్ అని ముద్ర పడిపోతుంది. అవకాశాలు వరుస కట్టేస్తాయి. స్టార్ హీరోయిన్ స్టేటస్ వచ్చేస్తుంది.
అదే సమయంలో కొందరు హీరోయిన్లకు అందం, అభినయం రెండూ ఉన్నా.. సక్సెస్ లేకపోవడం వల్ల ప్రేక్షకుల దృష్టిలో పడలేకపోతారు. వాళ్ల సినిమాలు తేడా కొట్టినపుడు కనుమరుగైపోతారు. చాలా కొద్ది మంది మాత్రమే ఫలితంతో సంబంధం లేకుండా అవకాశాలు అందుకుంటారు. ‘ఏజెంట్’ సినిమాతో ఈ ఏడాదే టాలీవుడ్లోకి అడుగు పెట్టిన సాక్షి వైద్యకు స్టార్ హీరోయిన్ కాదగ్గ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి.
‘ఏజెంట్’ అంత పెద్ద డిజాస్టర్ అయినప్పటికీ… అందులో తన అందచందాలు ఆకట్టుకున్నాయి. టాప్ హీరోయిన్ కాగల ఫీచర్స్ ఆమెలో ఉన్నాయి. నటన పరంగా కూడా ఓకే అనిపించింది. కానీ తొలి చిత్రం డిజాస్టర్ కావడంతో సాక్షికి నిరాశ తప్పలేదు. ఐతే ఆ ఫలితాన్ని పట్టించుకోకుండా ఆమెకు రెండు పేరున్న సినిమాల్లో ఛాన్సులిచ్చారు. అందులో ఒకటి.. గాండీవధారి అర్జున. వరుణ్ తేజ్ సరసన సాక్షి వైద్య పర్ఫెక్ట్ జోడీ అనిపించిది. వరుణ్ కటౌట్ను ఆమె మ్యాచ్ చేసింది. కానీ ఏం లాభం? సినిమా పెద్ద డిజాస్టర్ అయింది. వీకెండ్లోనే ఈ సినిమా ప్రభావం చూపలేకపోయింది.
మరోసారి ప్రేక్షకుల దృష్టిలో పడలేకపోయింది సాక్షి. వరుసగా రెండు పెద్ద డిజాస్టర్లు అంటే.. ఐరెన్ లెగ్ ముద్ర పడిపోయే ప్రమాదం ఉంది. ఐతే ఈ సినిమా కంటే ముందే ఆమెకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో అవకాశం వచ్చింది. ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. పైగా హరీష్ శంకర్ డైరెక్టర్ కావడంతో సాక్షి కూడా ధీమాగానే ఉండుంటుంది. పవన్తో అతడి సినిమా అంటే ఆషామాషీగా ఉండదు. అలాగే హీరోయిన్ని బాగా చూపిస్తాడు. కాబట్టి ఈ చిత్రంతో ఆమె బౌన్స్ బ్యాక్ అవుతుందేమో చూద్దాం.
This post was last modified on August 27, 2023 4:24 pm
భారత దేశానికి శత్రుదేశాలపై యుద్ధాలు కొత్తకాదు.. ఉగ్రవాదులపై దాడులు కూడా కొత్తకాదు. కానీ.. అందరినీ ఏకం చేయడంలోనూ.. అందరినీ ఒకే…
అట్లీ దర్శకత్వంలో రూపొందబోయే అల్లు అర్జున్ 22 షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. స్క్రిప్ట్ లాక్ చేసిన టీమ్ ప్రస్తుతం…
ఇన్నేళ్లు సమంతను ఒక కథానాయికగానే చూశాం. కానీ ఇప్పుడు ఆమెను నిర్మాతగా చూస్తున్నాం. తన ప్రొడక్షన్లో తెరకెక్కిన తొలి చిత్రం…
ఓర్పు-సహనం.. అనేవి ఎంతో కష్టం. ఒక విషయం నుంచి.. ప్రజల ద్వారా మెప్పు పొందాలన్నా.. అదేసమయంలో వస్తున్న విమర్శల నుంచి…
సుమారు 1000 కోట్ల రూపాయల వరకు ప్రకృతి సంపదను దోచుకున్నారన్న ఆరోపణలు ఉన్న ఓబులాపురం మైనింగ్ కేసులో ప్రధాన దోషులు..…
దాయాది దేశం పాకిస్థాన్కు ఊహించని పరిణామం ఎదురైంది. వాస్తవానికి పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత.. తమపై భారత్ కత్తి దూస్తుందని పాక్…