సినీ పరిశ్రమలో, బయట రాజకీయాల్లో స్నేహాలు, శత్రుత్వాలు శాశ్వతం కాదనేది మనం సాధారణంగా వినే నానుడి. కానీ కొందరి బంధాలు మాత్రం దీనికి అతీతంగా ఉంటాయి. ఉదాహరణకు నాగిరెడ్డి-చక్రపాణి, బాపు-రమణ జంటలు ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచాయి. ఆధునిక జీవితం లో మెకానికల్ లైఫ్ కు అలవాటు పడిపోయాక ఇలాంటివి ఆశించడం అత్యాశే అవుతుంది. కానీ అల్లు అర్జున్-సుకుమార్ లు మాత్రం దీనికి భిన్నంగా సాగుతున్నారు. తనకు ఆర్య రూపంలో ఒక రిస్కీ లవ్ స్టోరీని నమ్మి అవకాశం ఇచ్చిన బన్నీ అంటే సుక్కుకి ప్రత్యేకమైన ప్రేమ అభిమానం. అది ఎన్నోసార్లు బయటపడింది.
దానికి కొనసాగింపుగా చేసిన ఆర్య 2 ఫలితం నిరాశపరిచినా ఆ ప్రభావం వీళిద్దరి మీద ఎంత మాత్రం పడలేదు. ఒక పెద్ద స్టార్ హీరో వద్దని చెప్పిన పుష్పని బన్నీ నమ్మాడు. అందులోనూ అల వైకుంఠపురములో లాంటి స్టయిలిష్ బ్లాక్ బస్టర్ తర్వాత ఇంత ఊర మాస్ క్యారెక్టర్ లో తనను చూస్తారా లేదా అనే సందేహం పెట్టుకోలేదు. జస్ట్ సుకుమార్ ని నమ్మాడు. జుత్తు పెంచి, ఒళ్ళు మార్చి సంవత్సరాలు త్యాగం చేసేందుకు సిద్ధపడ్డాడు. అదే ఇప్పుడు ఎందరికో కలగా మిగిలిపోయిన జాతీయ అవార్డు దాకా తీసుకెళ్లింది. పుష్ప 2 ది రూల్ మీద వందల కోట్ల పెట్టుబడులు వెల్లువలా పారేలా చేసింది.
అఫ్ స్క్రీన్ కూడా బన్నీ సుక్కులు ఇంత బాండింగ్ తో ఉండటం సెట్లలో దగ్గరి నుంచి చూసినవాళ్లకు అలవాటే. పుష్ప 2 స్క్రిప్ట్ విషయంలో విపరీతమైన జాప్యం జరుగుతున్నా, దాని వల్ల తన విలువైన కాలం ఖర్చవుతున్నా బన్నీ భయపడలేదు. బెస్ట్ ఇవ్వాలన్న సంకల్పంతో మొత్తం సుకుమార్ కే వదిలేశాడు. అందుకే ఎలాంటి ఒత్తిడిని తీసుకోకుండా క్రేజీ బిజినెస్ ఆఫర్లు వెల్లువెత్తుతున్నా కించిత్ కూడా తొణక్కుండా నెమ్మదిగా తమ పని చేసుకుంటున్నారు. ఏది ఏమైనా తనకు డెబ్యూ ఇచ్చిన హీరోకు అరవై తొమ్మిది సంవత్సరాల చరిత్రలో జీవితాంతం గుర్తుపెట్టుకుని కానుక ఇచ్చాడు సుకుమార్.
This post was last modified on August 25, 2023 11:07 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…