లోక నాయకుడు కమల్ హాసన్ కేవలం హీరోయిజం ద్వారా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోలేదు. అనితర సాధ్యమైన పాత్రలు ఎన్నో పోషించి, ఇతరులకు ఛాలెంజ్ అనిపించే కథలను ఎంచుకుని మరీ అందనంత ఎత్తులో నిలబడ్డారు. ఆయనతో తెలుగు ప్రేక్షకులకున్న అనుబంధం పెద్దదే. స్వాతిముత్యం, సాగరసంగమం, ఇంద్రుడు చంద్రుడు, శుభ సంకల్పం, ఇది కథ కాదు, సొమ్మొకడిది సోకోకొకడిది లాంటి టాలీవుడ్ స్ట్రెయిట్ మూవీస్ ఎన్నో చేశారు. 80 దశకం నుంచి ఆయన ఏ భాషలో నటించినా దాని డబ్బింగ్ వెర్షన్ మన ఆడియన్స్ కి అందేలా కమల్ జాగ్రత్త తీసుకునేవారు.
కానీ ఒక్క క్లాసిక్ మాత్రం ఇరవై మూడేళ్ల తర్వాత కూడా అందని ద్రాక్షగా మిగిలిపోయింది. అదే హే రామ్. 2000 సంవత్సరంలో రిలీజైన ఈ మాస్టర్ పీస్ ఆ టైంలో ఎన్నో వివాదాలను మోసుకొచ్చింది. ఒక్క రూపాయి పారితోషికం తీసుకోకుండా షారుఖ్ ఖాన్ స్పెషల్ క్యామియో చేసిన మూవీ ఇదొక్కటే. ఇండో పాక్ విభజన అనంతర పరిణామాలు, దారుణాలు, మహాత్మాగాంధీ హత్య వెనుక నేపథ్యం లాంటి ఎన్నో సున్నితమైన అంశాలను కమల్ తన స్వీయ దర్శకత్వంలో ఆవిష్కరించారు. మూడు జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. ఇళయరాజా సంగీతం గొప్ప దన్నుగా నిలిచింది.
ఇలాంటి హే రామ్ తమిళ వెర్షన్ ని కొన్నేళ్ల క్రితం ప్రత్యేకంగా రీ మాస్టర్ చేయించి అమెజాన్ ప్రైమ్ కి ఇచ్చేశారు. ఇటీవలే యూట్యూబ్ లో అందరూ చూడాలనే ఉద్దేశంతో రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఛానల్ లో ఉచితంగా అందుబాటులో ఉంచారు. తమిళ, హిందీ భాషల్లో అందుబాటులో ఉన్న హే రామ్ తెలుగులో మాత్రం వెలుగు చూడలేదు. సెన్సార్ ఇతరత్రా కారణాల వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో థియేట్రికల్ రిలీజ్ అప్పట్లో కమల్ చేయలేకపోయారు. అలా అది పూర్తిగా మరుగున పడిపోయింది. ఇప్పటికైనా మాకు అర్థమయేలా అనువాదం ఇవ్వమని కమల్ ఫాన్స్ కోరుతున్నారు.
This post was last modified on August 23, 2023 1:54 pm
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…