లోక నాయకుడు కమల్ హాసన్ కేవలం హీరోయిజం ద్వారా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోలేదు. అనితర సాధ్యమైన పాత్రలు ఎన్నో పోషించి, ఇతరులకు ఛాలెంజ్ అనిపించే కథలను ఎంచుకుని మరీ అందనంత ఎత్తులో నిలబడ్డారు. ఆయనతో తెలుగు ప్రేక్షకులకున్న అనుబంధం పెద్దదే. స్వాతిముత్యం, సాగరసంగమం, ఇంద్రుడు చంద్రుడు, శుభ సంకల్పం, ఇది కథ కాదు, సొమ్మొకడిది సోకోకొకడిది లాంటి టాలీవుడ్ స్ట్రెయిట్ మూవీస్ ఎన్నో చేశారు. 80 దశకం నుంచి ఆయన ఏ భాషలో నటించినా దాని డబ్బింగ్ వెర్షన్ మన ఆడియన్స్ కి అందేలా కమల్ జాగ్రత్త తీసుకునేవారు.
కానీ ఒక్క క్లాసిక్ మాత్రం ఇరవై మూడేళ్ల తర్వాత కూడా అందని ద్రాక్షగా మిగిలిపోయింది. అదే హే రామ్. 2000 సంవత్సరంలో రిలీజైన ఈ మాస్టర్ పీస్ ఆ టైంలో ఎన్నో వివాదాలను మోసుకొచ్చింది. ఒక్క రూపాయి పారితోషికం తీసుకోకుండా షారుఖ్ ఖాన్ స్పెషల్ క్యామియో చేసిన మూవీ ఇదొక్కటే. ఇండో పాక్ విభజన అనంతర పరిణామాలు, దారుణాలు, మహాత్మాగాంధీ హత్య వెనుక నేపథ్యం లాంటి ఎన్నో సున్నితమైన అంశాలను కమల్ తన స్వీయ దర్శకత్వంలో ఆవిష్కరించారు. మూడు జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. ఇళయరాజా సంగీతం గొప్ప దన్నుగా నిలిచింది.
ఇలాంటి హే రామ్ తమిళ వెర్షన్ ని కొన్నేళ్ల క్రితం ప్రత్యేకంగా రీ మాస్టర్ చేయించి అమెజాన్ ప్రైమ్ కి ఇచ్చేశారు. ఇటీవలే యూట్యూబ్ లో అందరూ చూడాలనే ఉద్దేశంతో రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఛానల్ లో ఉచితంగా అందుబాటులో ఉంచారు. తమిళ, హిందీ భాషల్లో అందుబాటులో ఉన్న హే రామ్ తెలుగులో మాత్రం వెలుగు చూడలేదు. సెన్సార్ ఇతరత్రా కారణాల వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో థియేట్రికల్ రిలీజ్ అప్పట్లో కమల్ చేయలేకపోయారు. అలా అది పూర్తిగా మరుగున పడిపోయింది. ఇప్పటికైనా మాకు అర్థమయేలా అనువాదం ఇవ్వమని కమల్ ఫాన్స్ కోరుతున్నారు.
This post was last modified on August 23, 2023 1:54 pm
వైసీపీ హయాంలో జరిగిన 3500 కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణం కేసు.. అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా వైసీపీ కీలక…
శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…
ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ప్రమాదానికి గురయ్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్.. కొద్ద దూరం పైకి వెళ్లి…
కుళ్లిపోయిన చికెన్ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో…
బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…