సెప్టెంబర్ 28 ఎంతో దూరం లేదు. సరిగ్గా ఇంకో నలభై రోజులు గడిస్తే ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ యాక్షన్ గ్రాండియర్ థియేటర్లలో అడుగు పెడుతోంది. ప్రస్తుతానికి ప్రమోషన్లు ఇంకా వేగవంతం చేయకపోవడం పట్ల అభిమానులు కొంత అసంతృప్తిగా ఉన్నా హోంబాలే ఫిలిమ్స్, దర్శకుడు ప్రశాంత్ నీల్ డే అండ్ నైట్ షిఫ్ట్స్ లో ట్రైలర్ పనులతో పాటు ఆర్టిస్టుల డబ్బింగ్ ని పూర్తి చేయిస్తున్నారు. మరోవైపు టికెట్ రేట్ల పంచాయితీలు, పెంపు కోసం అప్లికేషన్లు ఇవన్నీ చాలా అడ్వాన్స్ గా సిద్ధం చేసుకుని సదరు ప్రభుత్వాలకు నేరుగా విన్నపాలు అందజేసేలా ముందస్తు ప్లానింగ్ జరుగుతోంది.
మరో గుడ్ న్యూస్ ఏంటంటే సలార్ ఐమాక్స్ వెర్షన్ సిద్ధం చేస్తున్నారు. ఈ తెరమీద చూస్తే ఆ అనుభూతి వేరే లెవెల్ లో ఉంటుంది. ఢిల్లీ, గుర్గావ్, నోయిడా, లక్నో, ముంబై, అహ్మదాబాద్, పూణే, కోల్కతా, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్ నగరాల్లో అధికారిక ఐమాక్స్ స్క్రీన్లున్నాయి. కానీ దురదృష్టవశాత్తు తెలుగు రాష్ట్రాల్లో లేవు. హైదరాబాద్ ప్రసాద్ పిసిఎక్స్, సూళ్లూరుపేట వి ఎపిక్ తెరలు చాలా పెద్దవే అయినప్పటికీ వాటికి ఐమాక్స్ ప్రొజెక్షన్ లేదు. క్వాలిటీ విషయంలో ఎంత పోటీ ఇచ్చినా అనుభూతిపరంగా కొంత దిగువే ఉంటాయి. అందుకే మూవీ లవర్స్ లోటుగా ఫీలవుతుంటారు.
సలార్ ని నెవెర్ బిఫోర్ ఎక్స్ పీరియన్స్ చేయాలనుకునే వాళ్ళు పైన చెప్పిన ఏదో ఒక నగరానికి వెళ్లడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. ఐమాక్స్ మనదగ్గర రాకపోవడానికి కారణం లేకపోలేదు. టికెట్ ధరల విషయంలో ఏపీ తెలంగాణలో క్యాపింగ్ పద్దతి అమలులో ఉంది. గరిష్టంగా రేట్ ఎంత ఉండాలనేది గవర్నమెంట్ నిర్దేశించే ప్రకారం ఉండాలి. పక్క స్టేజి లో ఉన్న బెంగళూరులో జైలర్ రిక్లైనర్ సీటుని 2400 రూపాయలకు అమ్మితే హైదరాబాద్ లో 350 దాటలేదు. అందుకే ఐమాక్స్ సెటప్ ని పెట్టుకోవడానికి కార్పొరేట్ సంస్థలు సైతం వెనుకాడుతున్నాయి. ఈ కోరిక ఎప్పటికి తీరేనో.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రముఖ ప్రవచ కర్త చాగంటి కోటేశ్వరరావు ప్రసంగాలను పాఠ్యాంశాలుగా ప్రవేశ పెడుతున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించి…
ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…
ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…
భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోమారు తెలంగాణ అంశం మీద నోరు విప్పారు. భారత దేశంలో…