పవన్కళ్యాణ్తో సినిమా సెట్స్ మీద వుండగా క్రిష్ మరో సినిమా మొదలు పెట్టడంతో ఇక పవన్ సినిమా ముందుకి వెళ్లదేమోననే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే పవన్ తనకు అందుబాటులోకి రావడానికి కనీసం ఏడెనిమిది నెలల సమయం పడుతుందని తెలియడం వల్లే క్రిష్ ఈ సినిమా మొదలు పెట్టాడు. మణికర్ణిక తర్వాత క్రిష్ సమయం చాలా వృధా అయింది. అందుకే పవన్ ‘వకీల్ సాబ్’ తర్వాత తన సినిమా మొదలు పెడదామని చెప్పినా వినకుండా హాఫ్ కాల్షీట్లు ఇచ్చి అయినా షూటింగ్ స్టార్ట్ చేయాలని పట్టుబట్టాడు.
కానీ కరోనా బ్రేక్ వల్ల అన్నీ తారుమారు కావడంతో క్రిష్ ఈలోగా ఒక చిన్న సినిమా ప్లాన్ చేసాడు. వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ జంటగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని అటవీ నేపథ్యంలో చిత్రీకరించనున్నారు. ఈ చిత్రానికి నలభై రోజుల షెడ్యూల్ వేసి, ఖచ్చితంగా అంతే సమయంలో పూర్తి చేసేలా ప్లాన్ చేసుకుని వెళుతున్నారు. గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి సినిమానే ఏడు నెలలలో పూర్తి చేసేసిన క్రిష్కి ఈ సినిమాను త్వరగా ఫినిష్ చేయడం పెద్ద పని కాదు. వకీల్ సాబ్ కంటే ముందే ఈ చిత్రం పూర్తయి, విడుదలయిపోతుందని క్రిష్ ధీమా.
This post was last modified on August 19, 2020 12:25 am
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…