నానితో మూడు చిత్రాల్లో నటించిన నివేదా థామస్ ఇంతకుముందు ఎన్టీఆర్తో ‘జై లవకుశ’లో నటించింది కానీ అగ్ర హీరోల సరసన వరుసగా నటించే ఛాన్స్ దక్కలేదు. ఇప్పటికీ మిడ్ రేంజ్ సినిమాలే చేస్తోన్న నివేద త్వరలో పవన్ ‘వకీల్ సాబ్’లో ఒక ఎమోషనల్ ప్లస్ కాంటెంపరరీ వుమన్ క్యారెక్టర్లో కనిపించనుంది. నివేద స్టార్ స్టేటస్ దక్కించుకోలేకపోయినా కానీ నటిగా అందరి మన్ననలు అందుకుంది. అందుకే ఆమె ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ దృష్టిలో పడింది.
అశ్విన్ త్వరలో ప్రభాస్తో తెరకెక్కించనున్న సైన్స్ ఫిక్షన్ సినిమాలో నివేద ఒక హీరోయిన్ క్యారెక్టర్ చేస్తోందట. మెయిన్ హీరోయిన్గా దీపిక పదుకోన్ ఆల్రెడీ ఖరారయిన సంగతి తెలిసిందే. మరో ముఖ్య భూమిక నివేద పోషిస్తుందని సమాచారం. ప్రభాస్ ‘ఆదిపురుష్’ చిత్రాన్ని అనౌన్స్ చేసినా కానీ నాగ్ అశ్విన్తో ప్రాజెక్ట్ అయితే ‘రాధే శ్యామ్’ పూర్తి కాగానే సెట్స్ మీదకు వెళ్లిపోతుంది. ఈ చిత్రం స్క్రిప్ట్ డెవలప్మెంట్స్ గురించి ప్రభాస్, అశ్విన్ నిత్యం చర్చించుకుంటూనే వున్నారు. అశ్విన్కి తాను చేయబోతున్న ‘ఆదిపురుష్’ డీటెయిల్స్ కూడా ప్రభాస్ చెప్పాడని అశ్విన్ వేసిన ట్వీట్ చూస్తేనే అర్థమైపోతోంది.
This post was last modified on August 19, 2020 12:08 am
యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…
ప్రమోషన్ల సంగతి ఎలా ఉన్నా పెద్ది ఇంకో ఇరవై రెండు రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నెల 18…
పెళ్లి చూపులు, జాతి రత్నాలు టైంలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయిన రాహుల్ రామకృష్ణ ఈ మధ్య కనిపించడం తగ్గించేశాడు. అడపాదడపా…
హైదరాబాద్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు.. రాజకీయంగా చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. నువ్వు నాతో…
తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్…వరుసబెట్టి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల ముందు తమ పార్టీ అధికారంలోకి…
తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్ కి నిజంగానే బంపర్ ఆఫర్ వచ్చిందని చెప్పాలి. అదికార డీఎంకేతో…