నానితో మూడు చిత్రాల్లో నటించిన నివేదా థామస్ ఇంతకుముందు ఎన్టీఆర్తో ‘జై లవకుశ’లో నటించింది కానీ అగ్ర హీరోల సరసన వరుసగా నటించే ఛాన్స్ దక్కలేదు. ఇప్పటికీ మిడ్ రేంజ్ సినిమాలే చేస్తోన్న నివేద త్వరలో పవన్ ‘వకీల్ సాబ్’లో ఒక ఎమోషనల్ ప్లస్ కాంటెంపరరీ వుమన్ క్యారెక్టర్లో కనిపించనుంది. నివేద స్టార్ స్టేటస్ దక్కించుకోలేకపోయినా కానీ నటిగా అందరి మన్ననలు అందుకుంది. అందుకే ఆమె ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ దృష్టిలో పడింది.
అశ్విన్ త్వరలో ప్రభాస్తో తెరకెక్కించనున్న సైన్స్ ఫిక్షన్ సినిమాలో నివేద ఒక హీరోయిన్ క్యారెక్టర్ చేస్తోందట. మెయిన్ హీరోయిన్గా దీపిక పదుకోన్ ఆల్రెడీ ఖరారయిన సంగతి తెలిసిందే. మరో ముఖ్య భూమిక నివేద పోషిస్తుందని సమాచారం. ప్రభాస్ ‘ఆదిపురుష్’ చిత్రాన్ని అనౌన్స్ చేసినా కానీ నాగ్ అశ్విన్తో ప్రాజెక్ట్ అయితే ‘రాధే శ్యామ్’ పూర్తి కాగానే సెట్స్ మీదకు వెళ్లిపోతుంది. ఈ చిత్రం స్క్రిప్ట్ డెవలప్మెంట్స్ గురించి ప్రభాస్, అశ్విన్ నిత్యం చర్చించుకుంటూనే వున్నారు. అశ్విన్కి తాను చేయబోతున్న ‘ఆదిపురుష్’ డీటెయిల్స్ కూడా ప్రభాస్ చెప్పాడని అశ్విన్ వేసిన ట్వీట్ చూస్తేనే అర్థమైపోతోంది.
This post was last modified on August 19, 2020 12:08 am
కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…
తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…
ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…
ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…
కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జంతర్ మంతర్ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే.…