ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే మేటి కథానాయకుల్లో ఒకడిగా నిలిచే సత్తా ఉన్న వాడు విక్రమ్. సేతు, సామి, పితామగన్, అపరిచితుడు.. హీరోగా కెరీర్ ఆరంభంలో తన ఫిల్మోగ్రఫీ చూసి వావ్ అనుకోని వారు లేరు. ఓవైపు ‘సామి’ సినిమాలో అదిరిపోయే రేంజిలో మాస్, హీరోయిజాన్ని పండించినా.. మరోవైపు ‘పితామగన్’లో డీగ్లామరస్ రోల్లో పెర్ఫామెన్స్తో ఇరగదీసినా అతడికే చెల్లింది.
కానీ ఒక దశ దాటాక అతను గాడి తప్పాడు. ప్రయోగాలు చేసి చేసి చేతులు కాల్చుకున్నాడు. డిఫరెంట్ గెటప్స్లో కనిపించడం అనే పిచ్చిలో పడిపోయి కెరీర్ను దెబ్బ తీసుకున్నాడు. దాదాపు రెండు దశాబ్దాలుగా అతను సరైన హిట్ కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కానీ ఫలితం ఉండట్లేదు. చివరగా ‘కోబ్రా’తో పలకరించిన అతడికి చేదు అనుభవం తప్పలేదు.
ఇప్పుడు విక్రమ్ నటిస్తున్న కొత్త చిత్రం ‘తంగలాన్’. ‘కబాలి’ దర్శకుడు పా.రంజిత్ రూపొందిస్తున్న చిత్రమిది. వీరి కాంబినేషన్ అనగానే అందరూ ఎగ్జైట్ అయ్యారు. దీనికి తోడు విక్రమ్ షాకింగ్ లుక్ చూసి అందరికీ దిమ్మదిరిగిపోయింది. ఇది కచ్చితంగా సెన్సేషన్ క్రియేట్ చేసే సినిమాలా కనిపించింది. మేకింగ్కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రేక్షకుల్లో ఎగ్జైట్మెంట్ పెంచాయి.
ఐతే విక్రమ్ వరుస ఫ్లాపుల్లో ఉన్నప్పటికీ నిర్మాతలు నమ్మి పెద్ద బడ్జెట్లో సినిమా తీయడానికి రెడీ అయ్యారు. కానీ భారీ లొకేషన్లు, సెట్టింగ్స్తో ముడిపడ్డ ఈ పీరియడ్ మూవీకి బడ్జెట్ హద్దులు దాటిపోయిందట. రెమ్యూనరేషన్లు, పోస్ట్ ప్రొడక్షన్, పబ్లిసిటీ కేవలం ప్రొడక్షన్ కాస్ట్ మాత్రమే రూ.100 కోెట్లు దాటిపోయిందట. ఓవరాల్ బడ్జెట్ దాదాపు రూ.200 కోట్ల దాకా అవుతుందని సమాచారం.
విక్రమ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అతడి మీద ఇంత ఖర్చు పెట్టడం రిస్కే. కానీ కంటెంట్ మీద నమ్మకంతో నిర్మాతలు సాహసం చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మాళవిక మోహనన్ ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. అది ఆకట్టుకునేలా ఉంది. త్వరలోనే విక్రమ్ కొత్త లుక్ను కూడా లాంచ్ చేయబోతున్నారు. ఈ ఏడాది దీపావళికి ‘తంగలాన్’ ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంచనా.
టాలీవుడ్ బాక్సాఫీస్ జూన్ నెల నుంచి ఊపందుకుంది. ఓవర్సీస్, నార్త్ పక్కనపెడితే తెలుగు రాష్ట్రాల వరకు పెద్ది బ్లాక్ బస్టర్…
టాలీవుడ్ లో ఎక్కువ డిమాండ్ ఉన్న సంగీత దర్శకులు ఎవరయ్యా అంటే ముందు వినిపించే పేరు తమన్. అది నిజం…
టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా మొత్తానికి ముహూర్త వేడుకను ముగించింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్…
టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…
నాలుగేళ్ల ముందు వరకు రిషబ్ శెట్టి అంటే.. కన్నడకే పరిమితమైన ఒక నటుడు, దర్శకుడు. తన మార్కెట్ పరిధి చాలా…