దసరాతో ఈ ఏడాది సూపర్ బ్లాక్ బస్టర్ అందుకున్న న్యాచురల్ స్టార్ నాని మంచి ఊపు మీదున్నాడు. హయ్ నాన్న పేరుకి ఫ్యామిలీ ఎంటర్ టైనరే అయినప్పటికీ బిజినెస్ వర్గాల్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. డిసెంబర్ క్రిస్మస్ కానుకగా వెంకటేష్, నితిన్ లతో పోటీ పడేందుకు రెడీ అవుతోంది. వి తర్వాత కథల విషయంలో జాగ్రత్తగా ఉంటున్న నానికి క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి. అందులో భాగంగా రజనీకాంత్ నటించబోయే ఆయన 170వ సినిమాలో ఓ కీలక పాత్ర ఆఫర్ చేసినట్టు చెన్నై అప్డేట్. జై భీంతో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న టిజె జ్ఞానవేల్ దీనికి దర్శకుడు.
మరో విశేషం కూడా ఉంది. ఇందులో అమితాబ్ బచ్చన్ కూడా నటించబోతున్నారు. కథ తాలూకు డీటెయిల్స్ ఇంకా ఏదీ బయటికి రాలేదు కానీ దశాబ్దాల క్రితం దేశాన్ని కుదిపేసిన ఓ ఎన్ కౌంటర్ ఆధారంగా చాలా సీరియస్ ఇష్యూతో తెరకెక్కించబోతున్నట్టు తెలిసింది. జై భీంలాగే ఇందులోనూ సున్నితమైన అంశాలు ఉంటాయట. అయితే నాని ఓకే చెప్పింది లేనిది ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మ్ కాలేదు. రజని 170 బృందం ప్రస్తుతం స్క్రిప్ట్ పనులతో బిజీగా ఉంది. జైలర్ రిలీజ్ అయ్యాక దీనికి సంబంధించిన ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకో రెండు వారాలు పట్టొచ్చు.
ఇది నిజమైతే నానికి ఒక అరుదైన ల్యాండ్ మార్క్ మూవీగా నిలిచిపోతుంది. ఎందుకంటే ఇండియన్ సినిమా దిగ్గజాలు రజని, అమితాబ్ లతో ఒకేసారి స్క్రీన్ పంచుకోవడం నిజంగా అదృష్టమే. వాళ్లిద్దరూ కలిసి ఒకప్పుడు నటించారు కానీ తర్వాత చాలా గ్యాప్ వచ్చేసింది . న్యాచురల్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం ఇది వీలైనంత త్వరగా మొదలుకావాలని కోరుకుంటున్నారు. సోలో హీరోగా నాని చేసిన మల్టీస్టారర్లు పెద్దగా లేవు. నాగార్జునతో చేసిన దేవదాస్ మాత్రమే చెప్పుకోదగ్గది. కానీ ఇప్పుడీ రజనీకాంత్ 170 మాత్రం అన్నింటిని మించి లార్జర్ దాన్ లైఫ్ అవుతుంది. వాస్తవం అయ్యే సూచనలే ఎక్కువగా ఉన్నాయి.
This post was last modified on August 4, 2023 1:19 pm
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…