స్టార్ హీరోయిన్లు పెళ్లి మాట ఎత్తితే.. కొన్ని టెంప్లేట్ సమాధానాలు ఇస్తారు. నా పెళ్లికి ఇంకా టైం ఉంది.. ఇప్పుడు ఆ ఆలోచనే లేదు.. సమయం వచ్చినపుడు చెబుతా.. అంటూ సమాధానం దాటవేస్తారు. కన్నడ అమ్మాయి అయినా.. ఆ భాషలోనే కాక తెలుగు, తమిళం, హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్గా ఎదిగిన రష్మిక మందన్నాకు కూడా తాజాగా పెళ్లి గురించి మీడియా నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి.
అందుకామె బదులిస్తూ.. ఒక నటుడితో తనకు ఎప్పుడో పెళ్లయిపోయిందని చెప్పి అందరికీ పెద్ద షాకిచ్చింది. ఆమె చెప్పిన ఆ మాటకు ఆ కార్యక్రమంలో పాల్గొన్న బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ సైతం షాకింగ్ లుక్ ఇచ్చాడు. కానీ తర్వాత అసలు విషయం బయటపెట్టింది రష్మిక.
‘‘నాకు నరుటోతో ఎప్పుడో పెళ్లయిపోయింది. అతనే నా మనసులో ఉన్నాడు’’ అని రష్మిక పేర్కొంది. ఇంతకీ ఈ నరుటో ఎవరయ్యా అంటే జపనీస్ టీవీ సిరీస్ ‘నరుటో’లో ప్రధాన పాత్రధారి. ఆ పాత్రకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు. ఆ క్యారెక్టర్తో వాళ్లందరూ ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతుంటారు. రష్మిక కూడా ఆ పాత్రకు వీరాభిమాని అన్నమాట.
ఇప్పటికే పలు సందర్భాల్లో నరుటో క్యారెక్టర్పై తన ఇష్టాన్ని చాటుతూ ఇన్స్టాగ్రామ్లో ఆమె అనేక పోస్టులు పెట్టారు. అవకాశం వస్తే ఈ సిరీస్ కొత్త సీజన్లో తాను నరుటో ప్రేయసి హినాటాగా కనిపించడానికి కూడా రెడీ అని.. అందుకోసం హెయిర్ స్టైల్ కూడా మార్చుకుంటానని రష్మిక పేర్కొంది. ఈ నేపథ్యంలోనే నరుటోతో ప్రేమలో పడ్డట్లు, పెళ్లి చేసుకున్నట్లు ఆమె కామెంట్ చేసింది. ప్రస్తుతం రష్మిక.. తెలుగులో ‘పుష్ప-2’.. తమిళంలో ‘రెయిన్ బో’, హిందీలో ‘యానిమల్’ చిత్రాల్లో నటిస్తోంది.
This post was last modified on October 8, 2023 4:33 pm
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…